రమణుల ఉపదేశ సారము
“హృదయ కుహరమధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
ఆహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృదివిశ మనసా త్వం చిన్వతా మజ్జతా వా
పవనచలన రోధాదాత్మనిష్ఠో భవ త్వం.”
(హృదయ కోశము నందు అహం స్ఫురణతో కేవల బ్రహ్మము ఆత్మస్వరూపమై భాసించుండును. విచారణచే కాని, మనస్సును హృదయము నందు లీనము చేసికొని కాని, లేదా శ్వాస నియమము చే (మనస్సును నియమించుకొని) కాని, ఆత్మనిష్ఠుడవు కమ్ము.)
ఈ శ్లోకము మహర్షి కృతమే. రమణ మహర్షి శిష్యులలో ఒకరైన జగదీశ్వర శాస్త్రి, సంస్కృత పండితుడు, కవి, “హృదయ కుహర మధ్యే “ అని ప్రారంభించి తర్వాత వ్రాయవలసినది తోచక, ఆ కాగితం అట్లే మహర్షి కూర్చునే స్థానంలో దిండు క్రింద పెట్టి, ఏదో పనిపై వెళ్లి పోయారట. ఆ తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, మహర్షి శ్లోకమును పై విధంగా పూరించి ఉంచారు!
వాశిష్ట గణపతి ముని పై శ్లోకమును రమణ మహర్షి బోధనా సారాంశంగా తీసుకొని, వారి రమణ గీత లో, ఒక అధ్యాయమంతా వ్యాఖ్యానించారు. వారీ శ్లోకము గురించి చెప్పినది:
“శ్లోకం భగవతో వక్త్రాన్మహర్షేరిమముద్గతం,
శ్రుత్యంత సారం యో వేద, సంశయో నాస్య జాతు చిత్ “
“భగవాన్ ముఖతః వెలువడిన ఈ శ్లోకము వేదాంత సారమని, నిస్సంశయముగా గ్రహింపవలెను.”
No comments:
Post a Comment