ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒకరోజు ఒక ఇల్లాలు ఇంటిలో దోసెలు పోస్తున్నది. 'విరిగిన దోసలన్నీ ఈశ్వరుడికి’ అని నవ్వుతూ పనిమీద బయటకి వెళ్ళిపోయాడు భర్త. కొంత సమయం తర్వాత ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాడు. కానీ ఆరోజు అన్ని దోసెలు ముక్కలై వచ్చాయని ఆ ముక్కల్ని చూపింది అతని భార్య.
ఏం చెయ్యను? అని అతను తన భార్యను ఏమీ అనకుండా మహర్షి దగ్గరికి ముక్కలైన దోసలను తీసుకొనిపోయి మహర్షి ముందు పెట్టాడు.
మహర్షి "ఏమిటి అది?" అని అన్నారు. అందుకు అతను ఇంట్లో నా భార్య దోసెలు చేస్తూ వుంటే నవ్వులాటకి మాణిక్య వాచకర్(తమిళ మహనీయుడు) కథలో చెప్పిన విధంగా "విరిగినవన్నీ ఈశ్వరుడికి" అనేసి వచ్చాను. ఒక్క దోస కూడా సరిగా రాలేదు. అన్నీ ముక్కలైపోయాయి. "విరిగిన ముక్కలన్నీ మహర్షివి" గనుక మహర్షికి తీసుకొచ్చాను.
మహర్షి నవ్వుతూ నాలుగు ముక్కలు తిని, తక్కినవి అక్కడున్న భక్తులకు పంచి పెట్టించారు.
No comments:
Post a Comment