రాత్రిపూట మరణాన్ని నివారించడానికి డాక్టర్ల సూచనలు చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా రాత్రి పూట మరణించడం మనం వింటూ ఉంటాం " నిన్న వరకు బాగానే ఉన్నాడు ఎలా ఇలా చనిపోయాడు?" అనే ప్రశ్న తరుచుగా వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం రాత్రిపూట ఆకస్మికంగా మంచం నుండి లేచడం వల్ల మెదడుకు రక్త ప్రవాహము నిలిచిపోవడమే
మానవ శరీరము విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. రాత్రిపూట టాయిలెట్ కు వెళ్ళాలి అన్న అవసరం వచ్చినప్పుడు మనం వెంటనే మంచం నుంచి లేచి దూకుతాం. ఈ వేగం కారణంగా మెదడుకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవిస్తుంది.
దీనిని నివారించడానికి డాక్టర్లు " 3 1/2 నిమిషాల నియమము " పాటించమని చెబుతున్నారు. మీరు మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు బదులుగా ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి .ఇది చిన్న జాగ్రత్త అయినా పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు.
మొదటి నిమిషం మంచం మీద పడుకున్నట్టుగానే ఉండాలి. తరువాతి అర నిమిషం మంచం మీద నెమ్మదిగా కూర్చోవాలి. ఆపై అర నిమిషం కాళ్లు నేల వైపు దించి మంచం అంచున కూర్చోవాలి. మొత్తం మూడు నిమిషాలు గడిచాక నెమ్మదిగా లేచి నడవాలి
ఈ విధానము వయసుతో సంబంధం లేకుండా అందరూ పాటించాలి. రక్త ప్రసరణ సమస్య ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మేల్కొని తొందరగా కదిలే సమయము లో ఇది జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త అవసరం.
ఈ చిన్న అలవాటు వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ కొనసాగుతుంది. గుండె బలహీన పడకుండా ఉంటుంది. పడిపోవడం , ఆకస్మిక గుండె పోటు ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే ఈ సమాచారాన్ని మన కుటుంబం స్నేహితులు బంధువులతో పంచుకోవాలి.
ఒకరి జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని రక్షించగలదు
సేకరణ విషయంతో యాసాల మల్లిఖార్జున్ ,రేచపల్లి , సారంగాపూర్ 9848729131.
No comments:
Post a Comment