Friday, 21 November 2025

 *పర్వదినాల మాసం మార్గశిరం*

మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.

మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.

మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!

శుక్లపాడ్యమి

ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.

విదియ తదియలు

ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

పంచమి

నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.

షష్ఠి

ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.

సప్తమి

దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.

అష్టమి

ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.

ఏకాదశి

మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

ద్వాదశి

నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.

చతుర్దశి

చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.

బహుళ పాడ్యమి

దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.

అమావాస్య

మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.

ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.

🕉️🕉️🕉️
 జీవిత రహదారులు.   !
    జీవిత రహదారుల వెంట 
    గమ్యం లేని అనంతమైన 
    ప్రయాణం     !
    అర్థరహితమైన జీవితానికి 
    అర్ధాన్ని వెతుక్కుంటూ 
    శ్రమైక  జీవన సౌందర్యాన్ని 
    ఆస్వాదిస్తూ
    ఎన్నో మజిలీలు    !
    కష్టాల కడలిని ఈదుతూ 
    అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ 
    అమాయకపు ప్రయాణం 
    అంతులేని దూరాలు.   !
    ప్రేమానురాగాల వెలువలో 
    కాలమిలా గడిచిపోయింది.    !
    స్నేహమాధుర్యంలో 
    లక్ష్యసాధన అన్వేషిస్తూ 
    కాలమిలా గడిచిపోయింది.   !
    ఎన్నో ఎడబాటులో 
    అమాయకత్వంగా బతికితే 
    జరిగిన మోసాలెన్నో.  !
    ఎవరిని నిందించిన ఏం ప్రయోజనం 
    ఎవరి స్వార్థం వారిదే కదా 
    ముందు చూపు లేని జీవితంలో 
    ఎదురయ్యే అగ చాట్లు ఎన్నో.   ?
    కాలం చాలా విలువైనది 
    స్థితిని నిర్ణయిస్తుంది 
    గతిని నిర్దేశిస్తుంది.  .!
    స్నేహమాధుర్యంలో లోటుపాట్లు 
    తెలియవు ఎప్పుడూ  !
    పుట్టినాము కాబట్టి జీవించాలి 
    జీవించడానికి ఒక మంచి మార్గాన్ని 
    ఎంచుకొని సాగిపోవాలి.   !
    అభివృద్ధికి సహకరించిన అందరికీ 
    కృతజ్ఞతలు తెలుపుకుంటూ 
    ఆవలి తీరం జీవితాన్ని 
    చేర్చాలి.   !    !                                   
                                    ___ రా జ్
 🕉 భజగోవిందం — తొలి పది శ్లోకాలు & సులభమైన అర్థాలు



**1️⃣ భజగోవిందం భజగోవిందం

గోవిందం భజమూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుక్రుంకరణే ॥**

అర్థం:
పండితానం, వ్యాకరణం, గ్రంథాలన్నీ చివరికి ఉపకారపడవు.
మరణ సమయం రాగానే గోవింద భక్తి మాత్రమే శరణు.
అందుకే భగవంతుని భజించు.



**2️⃣ మూఢ జహీహి ధనాగమ తృష్టిం

కురు సద్బుద్ధిం మనసి విత్రిష్టిమ్ ।
యల్లభసే నిహ కామేన
తేనా వినోదయ చిత్తం ॥**

అర్థం:
ధనం, కోరికలు, ఆశలు — ఇవన్నీ తగ్గించు.
నీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకో.
సుఖ–దుఃఖాలను సమానంగా స్వీకరించు.



**3️⃣ నారి స్తనభర నాభీ దేశం

దృష్ట్వా మా గా మోహావేషం ।
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్ ॥**

అర్థం:
శరీర సౌందర్యం చూసి మోహపడవద్దు.
అది కేవలం మాంసం—రేపు మారిపోతుంది.
శాశ్వతం కాని విషయాల వల్ల మనసు తప్పుదోవ పడకూడదు.



**4️⃣ నలినీ దల గత జలమతి తరలం

తద్వజ్జీవితం తిహ పచ్ఛల్పమ్ ।
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ ॥**

అర్థం:
పద్మపత్రంపై నీటి బొట్టు ఎంత నశ్వరమో, జీవితం కూడా అంతే క్షణికం.
అహంకారం, గర్వం అన్నీ వదలాలి.
శోకంతో నిండిన ఈ లోకంలో శాశ్వతం ఏదీ లేదు.



**5️⃣ యావద్విత్తోపార్జన సక్తః

స్తావన్నిజో పరिवारో రక్తః ।
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కొన పృచ్ఛతి గేహే ॥**

అర్థం:
ధనం ఉన్నప్పుడు కుటుంబం దగ్గరగా ఉంటుంది.
ధనం లేకపోతే అదే మనుషులు దూరమవుతారు.
సമ്പదపై ఆధారపడిన ప్రేమ నిలబడదు.



**6️⃣ యావత్పవనో నివసతి దేహే

తావత్ పృచ్ఛతి కుశలం గేహే ।
గతవతి వాయౌ దేహాపాయే
భార్యాపి న విచ్ఛతి తేషం గేహే ॥**

అర్థం:
శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ప్రీయమైన వాడిగా కనిపిస్తాం.
ప్రాణం పోయిన వెంటనే శరీరం కూడా ఎవరికీ అవసరం లేదు.
శరీరం నశ్వరమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.



**7️⃣ బాలస్థావే క్రీడాసక్తః

తరుణస్థావే తరు నీసక్తః ।
వృద్ధస్థావే చింతాసక్తః
పరమె బ్రహ్మణి కోఽపి న సక్తః ॥**

అర్థం:
బాల్యంలో ఆటలు, యౌవనంలో కామం, వృద్ధాప్యంలో ఆందోళన — ఇవే మనిషి జీవితం.
ఈ చక్రంలో ఆత్మజ్ఞానం ఆలోచించడానికి ఎవరికీ సమయం ఉండదు.
అందుకే తక్షణమే దైవచింతన మొదలుపెట్టాలి.



**8️⃣ కాఠేరౌ మను జాహి వికారం

రత్నసముప్లవ మజ్ఞం ।
సరసిజనాభ భవదేవం
వుపాసిహ వుపాసిహ చితం సమస్తమ్ ॥**

అర్థం:
కోపం, లోభం, మోహం, అహంకారం — ఇవన్నీ మనల్ని పతనంలోకి తోసేస్తాయి.
ఇవన్నీ వదిలితేనే మనసు స్వచ్ఛమవుతుంది.
స్వచ్ఛమైన మనసుతో దైవస్మరణలో నిలవాలి.



**9️⃣ గురుచరణాంబుజ నిరభరణం

భవమంగళం సద్వరణం ।
లోకానుగ్రహకారణం
గురుదేవం భజ భజ వత్స ॥**

అర్థం:
గురువు పాదసేవ భక్తికి మూలం.
గురువే జీవితం సరిదిద్దే శుభకారకం.
గురువు అనుగ్రహం పొందినవాడే జ్ఞానం పొందగలడు.



**🔟 శత్రౌ మిత్రే పుత్రే బంధౌ

మా కురు యత్నం విజితే రంధౌ ।
మాయమాయ మిదం అఖిలమ్
హిత్వా బ్రహ్మపదమ్ ప్రవిశ విద్యత్ ॥**

అర్థం:
శత్రువు, మిత్రుడు, బంధువు — అందరూ స్వార్థం ప్రకారమే ప్రవర్తిస్తారు.
ఇవన్నీ మాయా—శాశ్వతం కాదు.
దీనిని విడిచి ఆత్మతత్త్వాన్ని గ్రహించినవాడే విముక్తి పొందుతాడు.
 మనసు మాటల ముత్యాలు

🌹 అనుకోని ఆపదలు వచ్చినప్పుడే
అసలైన మిత్రులెవరో...
అర్థం అవుతుంది...
కాపాడేవారు ఎవరో...
కాదనుకునే వారు ఎవరో.....!!

🌹 శరీరానికి మరణం
ఒక్కసారి మాత్రమే..
కానీ మనసుకు
తప్పు చేసిన ప్రతిసారీ
మరణమే..!!

🌹 "అదృష్టం" అంటే..
ధనవంతులుగా అవడం
మాత్రమే కాదు 
చేతినిండా పని, 
కడుపునిండా తిండి,
కంటినిండా నిద్ర,
అవసరానికి ఆదుకునే ఆప్తులను
కలిగి ఉండడమే
అసలైన "అదృష్టం".

శుభోదయం
 *ఓం నమో నారాయణాయ* 🙏 

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం* । 
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్* 

 *భావం* : 

 *భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో దేనినైనా ఆచరించడం:* 

 *శ్రవణం* (దేవుని కథలు వినడం), *కీర్తనం* (నామ సంకీర్తన), *స్మరణం* (భగవంతుని తలవడం), *పాద సేవనం* (భగవంతుని సేవ), *అర్చనం* (పూజించడం), *వందనం* (నమస్కరించడం), *దాస్యం* (సేవకునిగా ఉండటం), *సఖ్యం* (స్నేహంగా ఉండటం), *ఆత్మ నివేదనం* (సమర్పణ).

 *మానవ జన్మ ప్రయోజనం:* 

 *ఈ నరజన్మ, కేవలం జంతువులు పొందే భోగముల కోసం కాదు. ఇది దివ్యమైన తపస్సు చేయడానికే ఉద్దేశించబడింది.*  

 *సారం* : 

 *మానవ శరీరాన్ని కేవలం భోగాల కోసం వినియోగించకూడదు, దైవచింతన, తపస్సు ద్వారా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం.* 

*ఆచార్య సద్బోధన*
                   
*జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?*

 *ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.* 

 *ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.* 

 *ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.* 

 *ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.* 

 *అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.* 

 *సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.* 

 *అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.* 
*ఈ పవిత్ర జీవనం కోసమే మనపెద్దలు ధర్మం ఆచరించమన్నారు.```* 

 *ఓం నమో భగవతే వాసుదేవాయః* 🙏
 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం*

 *"మార్గశిర మాసం" - ముక్తికి మార్గం*
                  
*మార్గశిర మాసం విశిష్టత*

 *చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.* 

 *ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.* 

*భగవద్గీతలోని విభూతియోగంలో - *"మాసానాం మార్గశీర్షం"* 

 *మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.* 

 *ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి* . 

 *అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.* 

 *ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి.  శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.* 

..  🍀 *"ఓం నమో నారాయణాయ'"* 🍀
 *అనే మంత్రాన్ని స్మరించాలి* .

 *ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని ,  'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.* 

 *మార్గశిర శుద్ధ షష్ఠి* - *'స్కంద షష్ఠి'.*

 *శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.* 

 *తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'*"" అని అంటారు* 

 *మార్గశిర శుద్ధ ఏకాదశి* - *'వైకుంఠ ఏకాదశి'.* 

 *దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు* . 

 *ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.* 

 *మోక్షదా ఏకాదశి* ... *"గీతాజయంతి".*

 *సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.* 

 *త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.*

 ఈ *"దత్తాత్రేయ జయంతి"* ని *మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.* 

 *మార్గశిర శుక్ల త్రయోదశినాడు*

*"హనుమద్‌వ్రతం",* *"మత్స్యద్వాదశి",* *"ప్రదోష వ్రతం"* *ఆచరించడం పరిపాటి* .

*ఈ మాసంలోనే....*

" *అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం* 

 *కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా  నిలుస్తుంది.* 

 *ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః* 🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

   శ్లో𝕝𝕝   *మాతరం పితరం భక్త్యా*
            *తోషయేన్న ప్రకోపయేత్* l
            *మాతృశాపేణ నాగానాం*
           *సర్పసత్రేఽభవత్ క్షయః* ll

      *--- _చారుచర్యా - క్షేమేన్ద్రః_ ---*

తా𝕝𝕝 *తల్లిదండ్రులను భక్తితో సేవించాలి.... వారికి సంతోషం కలిగించాలి...కోపం కలిగించరాదు....* తల్లికి ఆగ్రహం కలిగించి శాపగ్రస్తులై నాగసంతతి { సర్పయాగంలో హతులైనారు మిగిలిన వారు చెల్లాచెదురై }పాతాలమును చేరి దుస్థితిని అనుభవించారుకదా!!!

✍️VKS ©️ MSV🙏
 హరి ఓం  ,                     
                                       *.            *వందే మాతరం* 
దేశ స్వాతంత్ర్య సంగ్రామం లో ఉర్రూతలూగించిన నినాదం గా మారిన గీతం ‘వందే మాతరం’.  ఈ గీత రచయత  బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ. ఆయన రచించిన  ‘ఆనంద్ మఠ్’  అనే నవలో  దీనిని ఉపయోగించడం  జరిగినది.  

1857 విప్లవం విఫలం అవ్వడానికి చారిత్రిక కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రజలలో జాతీయ స్పూర్తి కొరవడటం  ముఖ్య కారణం.  అందుచేత ఆ విప్లవసమయం లో పెక్కు మంది స్తబ్దు గా ఉండిపోయారు.   బ్రిటిష్ వారికి మద్దతు పలికినవారు కొంతమంది. 

 ప్రజలలో జాతీయ భావాలు రేకెత్తించిన వారిలో ముఖ్యులు బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ.  ఆయన రచించిన నవల ఆనంద్ మఠ్ బహుళ ప్రచారం పొందినది. అలాగే అందులోని వందేమాతరం గీతం కూడా బహుళ ప్రచారం పొందినది.   

1763-1800 మధ్య లో బెంగాల్ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా ‘సన్యాసుల తిరుగుబాటు’ జరిగినది.  బ్రిటిష్ వారు అతి కష్టం మీద ఆ తిరుగుబాటును అణచగలిగారు.   బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ ఈ ఇతివృత్తం నేపధ్యం గా తీసుకొని, బ్రిటిష్ వారి వేటు పడకుండా ఉండటానికి, ఆ నవలను ఒక చారిత్రిక ఆధ్యాత్మిక నవలగా రూపొందించారు.  అందులో భారత దేశాన్ని ఆయన భారత మాత గా దుర్గ, లక్ష్మి సరస్వతి గా కీర్తించడం జరిగినది.   

ఆ రోజుల్లో కాంగ్రెస్ సమావేశాలలోనూ, ముఖ్యమైన సభల్లోనూ  – వందేమాతరం గీతాన్నే అలపించేవారు.   1896 కాంగ్రెస్ సమావేశం లో రవీంద్రనాథ టాగూరు గారు ఈ గీతాన్ని స్వయంగా పాడారు.  బెంగాల్ విభజన కు వ్యతిరేకం గా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని  వందేమాతరం ఉద్యమమనే పిలుస్తారు.  వందేమాతరం అని గట్టిగా నినదిస్తే బ్రిటిష్ దొరలు ఉలిక్కి పడేవారు.  అలా నినాదం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునేవారు.   స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, తాను రాజమండ్రి లో చదువుకుంటూ ఉండగా, వందేమాతరం అనే నినాదం చేసినందుకు, ప్రిన్సిపాల్ ‘హంటర్’  ఆయనను కాలేజీ నుండి బహిష్కరించాడు.  మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన అనర్హుడుగా ప్రభుత్వం ప్రకటించింది.   

మనకు స్వాతంత్ర్యం వచ్చినపుడు జాతీయ గీతం ఏది ఉండాలనే చర్చ వచ్చినది.   వందే మాతరం బహుళ ప్రచారం పొందిన గీతం అయినప్పటికీ,  ముస్లిం నాయకుల, సెక్యులర్ నాయకుల అభ్యంతరాల వల్ల,  ముఖ్యంగా నెహ్రూ గారి చొరవతో జనగణ మన .. గీతాన్ని జాతీయ గీతం గా స్వీకరించడం జరిగినది.    ఐనప్పటికి వందేమాతరం గీతానికి జాతీయ గీతం తో సమాన  హోదా ఇవ్వటానకి అంగీకరించారు.   ఈ గీతం లో మొదటి రెండు చరణాలు పాడటానికి నిర్ణయం జరిగినది.  
**
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ గారు ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం యావత్తు భారత మాత కు వందేమాతరం అంటున్నది ..........              
              *సేకరణ*.                  
              🙏🙏 ...                
  వలిశెట్టి  లక్ష్మీశేఖర్ ...                              
  Ph.98660 35557..       
  HYD. 21.11.2025.
 [11/21, 11:30] +91 99597 98384: మీ విలువ తెలుసుకోండి  , అది లేని చోటు ఉండకండి .......                  
ఒకరోజు  బాగోలేనంత మాత్రాన , జీవిత మొత్తం అలాగే ఉంటుందనుకోకండి ...        
ఎవరిని దేనికి బలవంతం చేయకండి  ,  వేడుకోకండి , వెంటపడకండి ......
మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోవడం కన్నా కొంతమందికి దూరం జరగడం మేలు ......                           
    VLS - 21.11.25.
[11/21, 11:30] +91 99597 98384: *_కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తింటుందట._*
        *_అలాగే మనిషి కూడా డబ్బుతో అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు._*.....
*******************.              *ఆశావాదిని ఏ విషము చంపలేదు...... నిరాశవాదిని  ఏ ఔషధము బతికించలేదు* .....
 21-11-2025,

""శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవాను పశ్యతా""

ఓ వాలి మహారాజా! శ్రద్ధగా ఆలకించవయ్యా! నేను నీకు విధించిన శిక్షని నీ‌ అంత్యకాలములో అది అన్యాయమని భావించక ప్రశాంతముగ‌ న్యాయమని స్వీకరించు.కారణము నేను నీకు వేసిన శిక్షని ధర్మమార్గము ననుసరించి వేసాను.నేను అనుసరించిన ధర్మము నా పూర్వీకులు అనుసరించిన మార్గమే. అందుకే అయ్యది ధర్మ మార్గమని గ్రహించు.

రామాయణము కిష్కిందాకాండములో రాముడు వాలిని శరముతో గాయపర్చగా రాముడు  వాలితో సంభాషిస్తు,

"" అవశ్యం  పితురాచారః""

పూర్వీకులొనర్చిన ధర్మకార్యాచరణని ఆచరింపవలెనని పల్కి వాలిని ఓదార్చితుండగా  దానికి  ఆ వానరేశ్వరుడు బదులుగ ఓ రామా!, నీది న్యాయమా! అంటు,

""ఆధార్యం చర్మమే సద్భీ  రోమాణ్యస్థి  చ వర్జితం ,
అభక్ష్యాణి  చ  మాంసాని  త్వద్విధైర్థర్మ చారిభిః||(17-36) 

మరణావస్థను భరిస్తూ వాలి రామునితో ఇలా అంటాడు.
ఓ రామా! స్పృహదప్పిన వానిని పాము కాటు వేసినట్లుగ చాటునదాగి నన్ను వధించావు.కోతుల మాంసము ఎవ్వరు తినరు,చర్మము ఎముకలు నీకు గానీ మరెవ్వరికి గానీ  ఉపయోగపడవు.నీకు నాకు పూర్వ వైరము లేదు.కనుక నీవు చేసినది అధర్మమని రామునిపై అపవాదు వేసి

"" చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి  మనీషిణః,
అభక్ష్యాణి  చ మాంసాని  సో~హం పంచనఖో హతః||(17-38),

ఓ రామా! నీకు తెలియదా! ముళ్లపంది, వరాహము,ఉడుము,తాబేలు,కుందేలు అను ఐదు మాత్రమే భక్షింపదగినవి.నేను ఐదుగోళ్ల జంతువునే అయినప్పటికి నా మాంసము తినుటకు నీకు పనికి రావుగదయ్యా! అని విలపిస్తున్న వాలితో ,
 శ్రీరాముడు స్పందిస్తు ఆ వానరేశ్వరునితో ఓయీ! వినవయ్యా!

"" త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః|,
ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితమ్|.""(18-45).

ఆవేశములో యుండి నన్ను నిందించవలదు."

"రాజా రాష్ట్రకృతం పాపమ్,"
ప్రజలు చేసిన పాపకార్యముల ఫలితము రాజు అనుభవింపవలసియుండును. నా సోదరుడు భరతుని పాలనలో యున్న ఈ ప్రదేశములో జరిగిన పాపకార్యాన్ని నేను ప్రక్షాళన చేయకపోతే ఈ పాపము రాజైన నా భరతుడు అనుభవించబలసియుండునని చెప్పి , వాలి చేసిన తప్పులన్నిటిని తెలియచేసి పాపము చేసిన వారిని శిక్షించుట రాజధర్మము.కనుక నిన్ను వధించుట నా కర్తవ్యము అని వాలిని ఊరడిస్తాడు.

పాపకార్యాల పట్ల ప్రతిఒక్కరు విముఖతను  కలిగియుండాలని రాముని పాత్ర ద్వారా రామాయణము మనకి తెలియచేస్తున్నది కనుక మనమెల్లరము సన్మార్గగాములమై చరించాలి.

జై శ్రీరామ్   జై  జై  శ్రీరామ్.

Sri K P Sarma Garu.💐🙏
 సమయ పాలన

కాలం పరమాత్మ స్వరూపం. పరమాత్మకు ఆదిమధ్యాంతాలు లేనట్టే కాలానికీ లేవు. కాలం కలిసి రాలేదంటే అదృష్టం బాగా లేదని అర్థం. నిత్య వ్యవహారంలో ఈ మాటను ఎలా ఉపయోగించుకున్నా కాలం తాత్వికమైన అంశం. అది గొప్ప ప్రజా స్వామికవాది. ఎవరిపట్ల ఏవిధమైన హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. గొప్ప జ్ఞాని... అందరికీ అన్నీ అవుతుంది కానీ, ఎవరికీ ఏమీ కాదు. కాలతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఎరుక కొంచెమైనా ఉంటే జీవితంలో విజయాలు సాధించగలం. కాలం అనే మాటను విశాల భావనలో ప్రయోగిస్తాం. నిర్దిష్టమైన వేళను సమయమని వ్యవహరిస్తుంటాం.

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయపాలన అనే రెండూ మనిషి జీవితంలో అత్యంత విలువైనవి. ఎందుకంటే కాలమే జీవితం గనక. ఒక కోటీశ్వరుణ్ని పేదకుటుం బంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులెలా అయ్యారని ప్రశ్నిస్తే 'కాలం ఇచ్చే అవకా శాలను ఉపయోగించుకునే కళ తెలిసినవాణ్ని' అని బదులిచ్చాడట. కాలం ఒక ప్రవాహం వంటిది. దాన్ని నిలువరించలేం. చాలామంది గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. కాలాన్ని దాచుకోవడం సాధ్యంకాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు. నిజమే. కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో, విషాదం కలి గిస్తాడో ఊహించలేం. అందుకే 'రేపటి పని ఈరోజే చేయండి. నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి, రేవేమవుతుందో ఎవరికి తెలుసు' అంటాడు కబీర్.
సమయపాలన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. సమయపాలన లేకపోవడానికి సంకల్పం కొరవడటం, యాంత్రిక జీవితానికి అలవాటుపడటం, చేయాల్సిన పనిపై ఏకాగ్రత లేకపోవడం మొదలైనవన్నీ కార ణాలు. ఆటంకాలు ఎదురైనప్పుడు వేరే మార్గంలో ప్రయత్నించకుండా పని వాయిదా వేస్తుంటారు చాలా మంది. ఎవరికైనా ఉండేవి రోజుకు 24 గంటలే. లోకంలో పొద్దు చాలనివాళ్లూ ఉంటారు, పొద్దుపోని వాళ్లూ ఉంటారు. బద్ధకం వల్ల మనిషి ఏ పనీ సాధిం చలేడు. కుటుంబ పోషణకోసం వృత్తిని సాగిస్తూనే వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా సంఘసేవ, సాహిత్యం, కళలు వంటివాటిల్లో పాల్గొనే వారికి సమయం చాలదు. అయినా ఒక ప్రణాళిక ప్రకారం దైనందిన జీవితం గడుపుతూ సమయాన్ని ఆయా పనులకోసం విభజించుకుంటూ లక్ష్య సాధనకోసం శ్రమించేవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శమే. వృద్ధాప్యంలోనూ ఉత్సాహంతో క్రియాశీలంగా ఉండేవా రిని చూస్తుంటాం. యవ్వనంలో ఆరోగ్యంగా ఉండీ తమకూ సమాజానికీ ఉపయోగడని నిష్క్రియాపరుల్నీ చూస్తుంటాం. శంకరాచార్యులు, వివేకానందుడు వంటివారు కొద్దికాలమే జీవించినా ప్రతి క్షణాన్నీ తమ ధ్యేయం కోసం వినియోగించి చరితార్థులయ్యారు. يكور

కొంతమంది తమ కాలాన్ని వ్యర్థం చేసుకోవడమేగాక ఇతరుల సమయాన్నీ హరి స్తుంటారు. సభలు సమావేశాలకు వెళ్లినప్పుడు ఇది తరచూ చూస్తుంటాం. ధనం పోతే మళ్లీ సంపాదించుకోగలం. కాలం విషయంలో అది సాధ్యం కాదు కాబట్టి క్రమ శిక్షణతో ప్రతి క్షణాన్నీ ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉంది.

డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
 యోగక్షేమం వహామ్యహం

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ... అన్నవి ఆర్యోక్తులు. ఇవన్నీ ఆచరించడం భగవంతుణ్ని సేవించడంతో సమానం. ఒక మహాకవి అన్నట్టుగా తల్లిదండ్రులు విషమని తలచేవాళ్లు కొందరైతే, గురువులకు పంగనామాలు పెట్టేవాళ్లు ఇంకొందరు. ఒకప్పుడు చుట్టాలు వస్తున్నారంటే ఇంటిల్లి పాది సంతోషించేవారు. మన పట్ల ప్రేమాభిమానాలు ఉండబట్టే వస్తున్నారని భావించేవారు. వాళ్లకి సకల సదుపాయాలు సమకూర్చి, భోజన వసతుల్లో ఎటు వంటి ఇబ్బంది లేకుండా చూసేవారు.

ఇటీవల కాలంలో భార్య తరపు వాళ్లు వస్తే భర్త, భర్త తరపు వాళ్లు వస్తే భార్య ముఖం ముడుచుకోవడం గురించి తరచూ వింటున్నాం. వాళ్ల వైఖరికి అనుగుణంగా పిల్లలు కూడా ప్రవర్తించడం, ఏ మాత్రం సమర్థనీయం కాకపోయినా... సహజం! ఇటు వంటి కారణాల వల్ల పిల్లలు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయానురాగాలనే కాక పెద్దల మార్గదర్శకత్వాన్నీ కోల్పోతు న్నారు. పెద్దవాళ్లు కూడా తమ మూడోతరం వారసులైన చిన్నారుల బాల్య చేష్టలు చూసే భాగ్యానికి నోచుకోవడం లేదు.

పూర్వపు రోజుల్లో ఇప్పటిలా క్షణాల్లో పను లైపోయే వసతులేవీ లేవు. అయినా కష్టమ నుకోకుండా కట్టెల పొయ్యిమీదే మట్టి, రాగి, కంచు వంటి పాత్రల్లో అతిథి, అభ్యాగతులకు వేడివేడిగా వండి పెట్టేవారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో పెద్దవాళ్లు అన్నం వండిన పాత్ర పూర్తిగా తుడిచి పెట్టేయకూడదని అంటారు. దానర్థం గబుక్కున అతిథులెవరైనా వస్తే వెంటనే వడ్డించడానికి ఉండాలని.
ఆతిథ్యం గురించి, దాని ప్రాముఖ్యం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకరోజు, మహాకోపిష్టి అని పేరొందిన దుర్వాస మహాముని, తన శిష్యబృందంతో అతిథిగా వస్తాడు. అప్పటికే పాండవుల భోజనాలు అయిపోవడంతో అక్షయపాత్రను శుభ్రం చేసి బోర్లించేసింది ద్రౌపది. ఆ పాత్రని కావాల్సినంత సేపు వాడుకున్నాక ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తే ఇంక ఆ పూటకి అది పనిచేయదు. దాంతో ముని బృందానికి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకు. దుర్వాసుడి ఆగ్రహానికి గురికాక తప్పదని భయప డ్డాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ద్రౌపది అక్షయ పాత్రని శుభ్రం చేసే సిన విషయం ధర్మరాజు ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని పట్టుకుని బాగా వెతికి, అందులో ఒక మూల దాగి ఉన్న ఒక అన్నం మెతు కుని తీసుకుని తింటాడు. సకల భువనభాండాల్నీ తనలో ఇముడ్చుకున్న భగవంతు డికి కడుపు నిండిపోయింది. అంటే సమస్త జీవకోటికి ఆకలి తీరిపోయింది. అక్కడ నదీస్నానానికి వెళ్లిన దుర్వాసుడు, ఆయన శిష్యులు ఏమీ తినకుండానే భుక్తాయా సంతో ఆపసోపాలు పడసాగారు. ఆ విధంగా పాండవులను కాపాడాడు శ్రీమన్నా రాయణుడు. తనని నమ్ముకున్నవారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుం టానని (యోగక్షేమం వహామ్యహం) శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి తెలిపాడు.

ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
 .. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం............... మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?
కొన్ని కొన్ని సార్లు మనం కాకులను ఏమీ అనకపోయినా అవి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్లిపోతుంటాయి. ఇలా కాకి తన్నిన వెంటనే చాలా మంది తలస్నానం చేసేసి గుడికి వెళ్తుంటారు. అసలు ఇలా కాకులు ఎందుకు తన్నుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? 

జ్యోతిష్యుల ప్రకారం.. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 




కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?
కాకి తలపై కొడితే చేయవలసిన పరిహారం : కాకి తలపై తగిలితే మీరు ఇంటికి వెళ్లి తలపై నువ్వుల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించండి. అలాగే శనిదేవున్ని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయండి.

ఆ తర్వాత నిష్టగా భక్తి, శ్రద్ధలతో శనిదేవుని గుడికి వెళ్లి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై ఖచ్చితంగా దయ చూపుతాడు. అలాగే కాకికి అన్నం కూడా పెట్టండి. 

అలాగే రాబోయే అమావాస్య నాడు మర్చిపోకుండా మీ పూర్వీకులకు పిండం పెట్టి  వారిని మనస్ఫూర్తిగా పూజించండి. అలాగే ఇతరులకు మీకు చేతనైనంత సహాయం చేయండి.
 *మన నమ్మకాల వలలో మన మనస్సు!*

ఒకరోజు రామయ్య రాత్రి భోజనం చేసిన తర్వాత, అకస్మాత్తుగా అతని వెన్నునొప్పి ప్రారంభమైంది. వెంటనే అతని మనస్సులో ఒక భయం మొదలైంది –

👉"నేను 50 సంవత్సరాలు దాటేశాను... వయస్సుతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ... ఇది గుండె నొప్పేనా?"

రామయ్య మనసులో సిలొగిజం ఆట మొదలైంది:

🌿"50 ఏళ్లు దాటినవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ."
🌿"నేను 50 ఏళ్లు దాటేశాను."
🌿"అంటే నాకొచ్చిన నొప్పి గుండె నొప్పే అయి ఉండాలి!"

👉ఈ ఆలోచనతోనే అతను మరింత భయపడిపోయాడు. భయంతో ఊపిరి బిగుసుకున్నట్లు అనిపించింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు ECG, బీపీ, బ్లడ్ టెస్టులు అన్నీ చేసారు. రిపోర్టులు చూసి డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు –

"మీ గుండె బాగా ఆరోగ్యంగా ఉంది రామయ్యగారూ! ఇది కేవలం గ్యాస్ నొప్పి."

🍁నమ్మకం ఎలా ఏర్పడుతుంది?

రామయ్యకు నిజంగా గుండె సమస్య లేదు. కానీ "50 ఏళ్లు దాటినవారికి గుండె సమస్య వచ్చే అవకాశం ఉంది" అనే సామాజిక నమ్మకం, కొన్ని ఉదాహరణలు, పరిసరాలు కలిపి ఆయన మనసులో భయాన్ని నాటాయి. ఆ భయం ఆయన్ని ఆసుపత్రి వరకు లాగింది.

👉ఈ తర్క పద్ధతి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది:

🌿"నల్ల పిల్లి నా దారి దాటింది. తప్పకుండా ఏదైనా అపశకునం జరుగబోతుంది!"
🌿"నిద్రపోతూ కాలు ఒక్కసారిగా లాగినట్లయింది... ఓహ్! నాకేదైనా చెడు శకునం తగిలిందా?"
🌿"పొద్దున్నే ఇంటి ముందు పసుపు నిమ్మకాయలు పడేశారు. ఇది ఏమిటో!"
🌿"నిద్రలో ఎవరో పేరు పిలిచినట్లు అనిపించింది. వాస్తవంగా ఎవరు పిలవలేదు... ఇలాంటి సంఘటనలు చెడు సంకేతమంటారు కదా?"

👉మన నమ్మకాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి. మనం నమ్మిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు. కానీ మనం నమ్మినట్లు మన మనస్సు స్పందించటం ప్రారంభిస్తుంది.

🍁అయితే, పరిష్కారం ఏమిటి?

ఇలాంటి అర్ధసత్యాలు, అపోహల నుంచి బయటపడటానికి "థాట్ రీప్లేస్మెంట్" (Thought Replacement) అనే మానసిక సాధన చాలా ఉపయోగకరం.

🍁ఏమిటది?

👉ఒక ప్రతికూల ఆలోచన మన మెదడులో వేగంగా అల్లుకోవడం మొదలైతే, దానికి ప్రత్యామ్నాయంగా సానుకూల ఆలోచనను పెట్టుకోవడం.

🍁రామయ్య ఉదాహరణలో ఇలా చేస్తే?

❌ "నాకు గుండె నొప్పే" అనుకోవడం కాదు.
✅ "నా ఆరోగ్యం బాగుంది. నేను నిత్యం నడుచుకుంటా, ఆరోగ్యంగా ఉన్నా. ఇది కేవలం అలసట వల్ల వచ్చిన చిన్న నొప్పి మాత్రమే."

👉ఈ చిన్న మార్పే అతని మానసిక స్థితిని మార్చేది. ఎక్కువమంది మానసిక భయాల వల్లే అనవసరమైన పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు, ఒత్తిడికి గురవుతున్నారు.

🍁ఇది నిజమైన మాయ

మన ఆలోచనలే మనపై ప్రభావం చూపుతాయి. మీ చుట్టూ ఉండే సమాజం ఇచ్చే "సజెషన్స్" మిమ్మల్ని మానసిక ఊబిలోకి లాక్కెళ్తున్నాయా?

నిజంగా భయం ఉన్నదా, లేక మనం ఊహించుకున్నదా? ఆలోచించండి.
మీరు నమ్మే విధంగా మీ జీవితాన్ని మలుచుకోవచ్చు.

మనస్సును మాయచేయనివ్వకండి! మీ నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 🍁.         
*ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు శబ్ద స్పర్శ రూప రస
గంధాలనే గుణములతో కూడుకుని ఉంటాయి. ఆకాశం నుండి వరుసగా ఒక్కొక్కటీ పుడతాయి. నాశనమయ్యేటప్పుడు భూమి నుండి వరుసగా ఒక్కొక్కటీ లయమవుతాయి. చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అనే ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలనే భావాలను పొందుతాయి. ఐదు ఇంద్రియాలు కాక ఆరవది మనస్సు, ఏడవది బుద్ధి, ఎనిమిదవది అహంకారం అవుతాయి. సత్వము రజస్సు తమస్సు గుణాలవుతాయి. ఇవన్నీ భౌతిక ప్రపంచంలో అవ్యక్తంగానే ఉంటూ పుడుతూ పోతూ ఉంటాయి. అవ్యక్తాలుగా ఉన్న గుణాలన్నీ ఇంద్రియ వ్యవహారాదుల ద్వారా వ్యక్తమౌతుంటాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాదుల భావనను పొంది ఇష్టము వచ్చినట్లుగా చరిస్తాయి. మానవుడు ఆ విషయం తెలుసుకొని వాని నుండి దూరంగా ఉండడం మంచిది.            

Thursday, 20 November 2025

 జ్ఞాన వారధి .

చదువరి నువ్వైతే, చేతిలో అక్షరమే దీపమై వెలుగుతుంది.
పుస్తకమే నీ గురువై, అజ్ఞానపు చీకటిని తరిమేస్తుంది.
ప్రతి పేజీ తిరిగే కొద్దీ, అనుభవాల సారాన్ని ఆస్వాదిస్తావు,
విశ్వంలోని రహస్యాలను నీ మనసులో నింపుకుంటావు.
నీవు చదివిన జ్ఞానం కేవలం నీకోసం కాదు.
నిధి దాచినట్లు నీలోనే ఉంచుకోకు, అది ధర్మం కాదు.
నువ్వు నేర్చిన విద్యను, తొణికిసలాడే నదిలా ప్రవహింపజేయాలి,
తృష్ణతో ఎదురుచూసే ఆ నాలుగు దిక్కులకు పంచివేయాలి.
మాటల్లో మాధుర్యాన్ని, సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తావు,
నీ ఉనికితోనే లోకంలో సకారాత్మక శక్తిని నింపుతావు.
నీవు కేవలం చదువుకున్న వ్యక్తివి కాదు, ఓ మార్గదర్శివి,
సమాజపు మలుపులో నిలబడిన ఓ నిశ్చలమైన శిఖరం. 
భవిష్యత్తు తరానికి నువ్వే బలమైన వారధివి,
గతం నుండి వర్తమానానికి, వర్తమానం నుండి రేపటి ఉదయానికి!
నీ మాటల్లో వెలుగులు, నీ చేతల్లో సత్యం ప్రతిఫలిస్తాయి,
నీ వల్లే యువతరం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాయి.
చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక జీవనయానం,
అందుకే చదువరిగా ఉండు, జ్ఞానాన్ని పంచు,
నూతన తరానికి ప్రేరణగా నిలువు!
Bureddy.