Tuesday, 22 April 2025

 హిందువుల ఐక్యతకి మార్గం – అన్నసంతర్పణ కాదు, జ్ఞానసంతర్పణ కావాలి!

శ్రీరామనవమి, వినాయక చవితి, దుర్గాపూజలన్నీ – అన్నసంతర్పణతో గడుస్తున్నాయి...

కానీ మన జాతి మేలుకోలేక పోతోంది.

ప్రశ్నించాలి:

ప్రతి పండుగకు అన్నమే కావాలా?
పండుగకు పరమార్థం ఉండకూడదా?

ప్రతి దేవాలయ ట్రస్ట్ నిర్ణయించాలి:

అన్నసంతర్పణ తగ్గించాలి,
పుస్తకసంతర్పణ ప్రారంభించాలి.

భగవద్గీత, 
రామాయణం, 
మహాభారతం, 
 ప్రతి ఇంటికి అందాలి.

ప్రతి ఊరిలో ధర్మ జ్యోతి వెలగాలి.
ప్రతి హిందువు జ్ఞానవంతుడు కావాలి.

అన్నం తినేవారిని పోషిస్తుంది –
పుస్తకం చదివేవారిని మేల్కొలుపుతుంది.

అన్నం తినేది ఒక్క రోజు...
జ్ఞానం నిలిచేది నిరంతరం!

ఒక్క పూట కడుపు నిండుతుంది –
ఒక్క పుస్తకంతో  జీవితం మారుతుంది!

మన జాతి ఇంకా మేలుకోకపోతే...

"దశాబ్దంలోనే మనం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాం!"

#భగవద్గీత

 #రామాయణం 

#మహాభారతం

#HinduUnity 

# knowledge డొనేషన్

 #Dharma

No comments:

Post a Comment