Friday, 21 November 2025

 *పర్వదినాల మాసం మార్గశిరం*

మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.

మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.

మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!

శుక్లపాడ్యమి

ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.

విదియ తదియలు

ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

పంచమి

నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.

షష్ఠి

ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.

సప్తమి

దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.

అష్టమి

ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.

ఏకాదశి

మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

ద్వాదశి

నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.

చతుర్దశి

చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.

బహుళ పాడ్యమి

దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.

అమావాస్య

మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.

ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.

🕉️🕉️🕉️
 జీవిత రహదారులు.   !
    జీవిత రహదారుల వెంట 
    గమ్యం లేని అనంతమైన 
    ప్రయాణం     !
    అర్థరహితమైన జీవితానికి 
    అర్ధాన్ని వెతుక్కుంటూ 
    శ్రమైక  జీవన సౌందర్యాన్ని 
    ఆస్వాదిస్తూ
    ఎన్నో మజిలీలు    !
    కష్టాల కడలిని ఈదుతూ 
    అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ 
    అమాయకపు ప్రయాణం 
    అంతులేని దూరాలు.   !
    ప్రేమానురాగాల వెలువలో 
    కాలమిలా గడిచిపోయింది.    !
    స్నేహమాధుర్యంలో 
    లక్ష్యసాధన అన్వేషిస్తూ 
    కాలమిలా గడిచిపోయింది.   !
    ఎన్నో ఎడబాటులో 
    అమాయకత్వంగా బతికితే 
    జరిగిన మోసాలెన్నో.  !
    ఎవరిని నిందించిన ఏం ప్రయోజనం 
    ఎవరి స్వార్థం వారిదే కదా 
    ముందు చూపు లేని జీవితంలో 
    ఎదురయ్యే అగ చాట్లు ఎన్నో.   ?
    కాలం చాలా విలువైనది 
    స్థితిని నిర్ణయిస్తుంది 
    గతిని నిర్దేశిస్తుంది.  .!
    స్నేహమాధుర్యంలో లోటుపాట్లు 
    తెలియవు ఎప్పుడూ  !
    పుట్టినాము కాబట్టి జీవించాలి 
    జీవించడానికి ఒక మంచి మార్గాన్ని 
    ఎంచుకొని సాగిపోవాలి.   !
    అభివృద్ధికి సహకరించిన అందరికీ 
    కృతజ్ఞతలు తెలుపుకుంటూ 
    ఆవలి తీరం జీవితాన్ని 
    చేర్చాలి.   !    !                                   
                                    ___ రా జ్
 🕉 భజగోవిందం — తొలి పది శ్లోకాలు & సులభమైన అర్థాలు



**1️⃣ భజగోవిందం భజగోవిందం

గోవిందం భజమూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుక్రుంకరణే ॥**

అర్థం:
పండితానం, వ్యాకరణం, గ్రంథాలన్నీ చివరికి ఉపకారపడవు.
మరణ సమయం రాగానే గోవింద భక్తి మాత్రమే శరణు.
అందుకే భగవంతుని భజించు.



**2️⃣ మూఢ జహీహి ధనాగమ తృష్టిం

కురు సద్బుద్ధిం మనసి విత్రిష్టిమ్ ।
యల్లభసే నిహ కామేన
తేనా వినోదయ చిత్తం ॥**

అర్థం:
ధనం, కోరికలు, ఆశలు — ఇవన్నీ తగ్గించు.
నీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకో.
సుఖ–దుఃఖాలను సమానంగా స్వీకరించు.



**3️⃣ నారి స్తనభర నాభీ దేశం

దృష్ట్వా మా గా మోహావేషం ।
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్ ॥**

అర్థం:
శరీర సౌందర్యం చూసి మోహపడవద్దు.
అది కేవలం మాంసం—రేపు మారిపోతుంది.
శాశ్వతం కాని విషయాల వల్ల మనసు తప్పుదోవ పడకూడదు.



**4️⃣ నలినీ దల గత జలమతి తరలం

తద్వజ్జీవితం తిహ పచ్ఛల్పమ్ ।
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ ॥**

అర్థం:
పద్మపత్రంపై నీటి బొట్టు ఎంత నశ్వరమో, జీవితం కూడా అంతే క్షణికం.
అహంకారం, గర్వం అన్నీ వదలాలి.
శోకంతో నిండిన ఈ లోకంలో శాశ్వతం ఏదీ లేదు.



**5️⃣ యావద్విత్తోపార్జన సక్తః

స్తావన్నిజో పరिवारో రక్తః ।
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కొన పృచ్ఛతి గేహే ॥**

అర్థం:
ధనం ఉన్నప్పుడు కుటుంబం దగ్గరగా ఉంటుంది.
ధనం లేకపోతే అదే మనుషులు దూరమవుతారు.
సമ്പదపై ఆధారపడిన ప్రేమ నిలబడదు.



**6️⃣ యావత్పవనో నివసతి దేహే

తావత్ పృచ్ఛతి కుశలం గేహే ।
గతవతి వాయౌ దేహాపాయే
భార్యాపి న విచ్ఛతి తేషం గేహే ॥**

అర్థం:
శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ప్రీయమైన వాడిగా కనిపిస్తాం.
ప్రాణం పోయిన వెంటనే శరీరం కూడా ఎవరికీ అవసరం లేదు.
శరీరం నశ్వరమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.



**7️⃣ బాలస్థావే క్రీడాసక్తః

తరుణస్థావే తరు నీసక్తః ।
వృద్ధస్థావే చింతాసక్తః
పరమె బ్రహ్మణి కోఽపి న సక్తః ॥**

అర్థం:
బాల్యంలో ఆటలు, యౌవనంలో కామం, వృద్ధాప్యంలో ఆందోళన — ఇవే మనిషి జీవితం.
ఈ చక్రంలో ఆత్మజ్ఞానం ఆలోచించడానికి ఎవరికీ సమయం ఉండదు.
అందుకే తక్షణమే దైవచింతన మొదలుపెట్టాలి.



**8️⃣ కాఠేరౌ మను జాహి వికారం

రత్నసముప్లవ మజ్ఞం ।
సరసిజనాభ భవదేవం
వుపాసిహ వుపాసిహ చితం సమస్తమ్ ॥**

అర్థం:
కోపం, లోభం, మోహం, అహంకారం — ఇవన్నీ మనల్ని పతనంలోకి తోసేస్తాయి.
ఇవన్నీ వదిలితేనే మనసు స్వచ్ఛమవుతుంది.
స్వచ్ఛమైన మనసుతో దైవస్మరణలో నిలవాలి.



**9️⃣ గురుచరణాంబుజ నిరభరణం

భవమంగళం సద్వరణం ।
లోకానుగ్రహకారణం
గురుదేవం భజ భజ వత్స ॥**

అర్థం:
గురువు పాదసేవ భక్తికి మూలం.
గురువే జీవితం సరిదిద్దే శుభకారకం.
గురువు అనుగ్రహం పొందినవాడే జ్ఞానం పొందగలడు.



**🔟 శత్రౌ మిత్రే పుత్రే బంధౌ

మా కురు యత్నం విజితే రంధౌ ।
మాయమాయ మిదం అఖిలమ్
హిత్వా బ్రహ్మపదమ్ ప్రవిశ విద్యత్ ॥**

అర్థం:
శత్రువు, మిత్రుడు, బంధువు — అందరూ స్వార్థం ప్రకారమే ప్రవర్తిస్తారు.
ఇవన్నీ మాయా—శాశ్వతం కాదు.
దీనిని విడిచి ఆత్మతత్త్వాన్ని గ్రహించినవాడే విముక్తి పొందుతాడు.
 మనసు మాటల ముత్యాలు

🌹 అనుకోని ఆపదలు వచ్చినప్పుడే
అసలైన మిత్రులెవరో...
అర్థం అవుతుంది...
కాపాడేవారు ఎవరో...
కాదనుకునే వారు ఎవరో.....!!

🌹 శరీరానికి మరణం
ఒక్కసారి మాత్రమే..
కానీ మనసుకు
తప్పు చేసిన ప్రతిసారీ
మరణమే..!!

🌹 "అదృష్టం" అంటే..
ధనవంతులుగా అవడం
మాత్రమే కాదు 
చేతినిండా పని, 
కడుపునిండా తిండి,
కంటినిండా నిద్ర,
అవసరానికి ఆదుకునే ఆప్తులను
కలిగి ఉండడమే
అసలైన "అదృష్టం".

శుభోదయం
 *ఓం నమో నారాయణాయ* 🙏 

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం* । 
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్* 

 *భావం* : 

 *భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో దేనినైనా ఆచరించడం:* 

 *శ్రవణం* (దేవుని కథలు వినడం), *కీర్తనం* (నామ సంకీర్తన), *స్మరణం* (భగవంతుని తలవడం), *పాద సేవనం* (భగవంతుని సేవ), *అర్చనం* (పూజించడం), *వందనం* (నమస్కరించడం), *దాస్యం* (సేవకునిగా ఉండటం), *సఖ్యం* (స్నేహంగా ఉండటం), *ఆత్మ నివేదనం* (సమర్పణ).

 *మానవ జన్మ ప్రయోజనం:* 

 *ఈ నరజన్మ, కేవలం జంతువులు పొందే భోగముల కోసం కాదు. ఇది దివ్యమైన తపస్సు చేయడానికే ఉద్దేశించబడింది.*  

 *సారం* : 

 *మానవ శరీరాన్ని కేవలం భోగాల కోసం వినియోగించకూడదు, దైవచింతన, తపస్సు ద్వారా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం.* 

*ఆచార్య సద్బోధన*
                   
*జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?*

 *ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.* 

 *ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.* 

 *ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.* 

 *ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.* 

 *అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.* 

 *సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.* 

 *అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.* 
*ఈ పవిత్ర జీవనం కోసమే మనపెద్దలు ధర్మం ఆచరించమన్నారు.```* 

 *ఓం నమో భగవతే వాసుదేవాయః* 🙏
 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం*

 *"మార్గశిర మాసం" - ముక్తికి మార్గం*
                  
*మార్గశిర మాసం విశిష్టత*

 *చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.* 

 *ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.* 

*భగవద్గీతలోని విభూతియోగంలో - *"మాసానాం మార్గశీర్షం"* 

 *మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.* 

 *ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి* . 

 *అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.* 

 *ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి.  శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.* 

..  🍀 *"ఓం నమో నారాయణాయ'"* 🍀
 *అనే మంత్రాన్ని స్మరించాలి* .

 *ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని ,  'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.* 

 *మార్గశిర శుద్ధ షష్ఠి* - *'స్కంద షష్ఠి'.*

 *శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.* 

 *తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'*"" అని అంటారు* 

 *మార్గశిర శుద్ధ ఏకాదశి* - *'వైకుంఠ ఏకాదశి'.* 

 *దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు* . 

 *ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.* 

 *మోక్షదా ఏకాదశి* ... *"గీతాజయంతి".*

 *సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.* 

 *త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.*

 ఈ *"దత్తాత్రేయ జయంతి"* ని *మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.* 

 *మార్గశిర శుక్ల త్రయోదశినాడు*

*"హనుమద్‌వ్రతం",* *"మత్స్యద్వాదశి",* *"ప్రదోష వ్రతం"* *ఆచరించడం పరిపాటి* .

*ఈ మాసంలోనే....*

" *అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం* 

 *కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా  నిలుస్తుంది.* 

 *ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః* 🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

   శ్లో𝕝𝕝   *మాతరం పితరం భక్త్యా*
            *తోషయేన్న ప్రకోపయేత్* l
            *మాతృశాపేణ నాగానాం*
           *సర్పసత్రేఽభవత్ క్షయః* ll

      *--- _చారుచర్యా - క్షేమేన్ద్రః_ ---*

తా𝕝𝕝 *తల్లిదండ్రులను భక్తితో సేవించాలి.... వారికి సంతోషం కలిగించాలి...కోపం కలిగించరాదు....* తల్లికి ఆగ్రహం కలిగించి శాపగ్రస్తులై నాగసంతతి { సర్పయాగంలో హతులైనారు మిగిలిన వారు చెల్లాచెదురై }పాతాలమును చేరి దుస్థితిని అనుభవించారుకదా!!!

✍️VKS ©️ MSV🙏