Tuesday, 30 September 2025

@ కలి... కాలం @

వివేకంతో ప్రశ్నిస్తే 
చైతన్యం తో నిలదీస్తే
అండా సెల్ నిర్బంధాలు

భజనలు చేస్తే 
సాష్టాంగ పడిపోతే
అధికార పీఠాలు

******

నిజం మాట్లాడితే 
నిర్భయంగ సత్యం చాటితే
వ్యక్తిత్వ హననాలూ హత్యలూ 

అసత్యాలు వల్లిస్తే 
అవాస్తవాలను నిస్సిగ్గుగ ప్రకటిస్తే
పదవులూ బిరుదులూ ఘన సన్మానాలూ

*******

వనరుల దోపిడికి
అడ్డు గోడై నిలబడి కలబడితే 
ఎన్కౌంటర్లూ 

దోపిడీ పీడనా
అణచివేతల వత్తాసు పలికితే 
చట్ట సభల్లోకి ఎర్రని తివాచీలు

********

స్నేహం
ప్రేమా మానవీయతా 
జ్ఞానం విజ్ఞానం వివేకం వివేచనా

అన్నీ అన్నీ ..
కాలం చెల్లిపోయిన 
పురాతన విలువలిప్పుడు 

*****

వంచన 
ద్వేషం ఉన్మాదం
అజ్ఞానం అశాస్త్రీయతా మూఢత్వం 

ఇవే ఇవే
అందలమెక్కించే 
నయా నయా విలువలిప్పుడు

********

స్వేచ్ఛా
సమానత్వం 
సౌభ్రాతృత్వమూ
కాల గర్భంలో కలిసిపోయిన నినాదాలు 

బానిసత్వం 
అసమానతత్వమూ 
విభజనా విద్వేషమూ కపటం
విస్తరిస్తోన్న సరికొత్త నినాదాలు

********

యుగాంతమని 
సర్దుకు పోవాల్సిందేనా 
మనుగడ కోసం 

నవ యుగమంటూ 
తెగించి పోరాడాలా 
మానవ జాతి వికాశం కోసం 

చస్తూ బతకాలా 
చచ్చైనా జీవించాలా 
తేల్చుకోమంటోంది కలి ... కాలం

- రత్నాజేయ్ (పెద్దాపురం)
 తృప్తి అనేది ఒక మానసిక భావన. తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది. పాండవులు అయిదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ని నమ్మని అహంకారి దుర్యోధనుడు. అతగాడి మనసును అభద్రతా భావం, అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి, తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి. తృప్తి లేక పోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద, కలువ ముడుచుకోవడాన్ని గమనించక, ఊపిరాడక మరణిస్తుంది. తృప్తిలేని వాడికి ఏది దొరికినా, ఎంత దొరికినా సంతోషం కలగదు. జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది. ధన్యవాదాలు...
" అహం బ్రహ్మాస్మి 🤘 "
 *జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది*.. *అర్థమయ్యే వయసులో కన్నీళ్ళు తెప్పిస్తుంది*...

*మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు*.. 
*ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ,ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు*... 

*ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు*..
*జీవితం అంటే మనం బాధలో ఉన్నాఇంకొకరిని* *సంతోషపెట్టడమే*
*నిజమైన జీవితం*... 

*మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, వదులుకున్న అవకాశం,ఈ నాలుగు తిరిగి వెనుకకు తెచ్చుకోలేము*.. 
*అందుకని మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు  ఆలోచించుకుందాం, కాలం గడిచి పోకముందే వినియోగించుకుందాం, అవకాశం చేజారక ముందే ఉపయోగించుకుందాo*... 

*మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు,నాణ్యమైన మట్టి .అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి  సంపాదన కాదు సంస్కారంముఖ్యం*... 
 
*నేడు మంచిని విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు*.
*వెనక్కి లాగేవారు వెన్నంటే వుంటారు*...

*నీ మేలు కోరేవారు ఎక్కడో,ఒకరు మాత్రమే ఉంటారు..*
*అలాంటి స్నేహాన్ని,*
*నీ మాటలతో గాని,*
*చేతలతో గాని,దూరం చేసుకోకు*...

*నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కన్నా,*
*నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం*...

*దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది*..
*గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు ,వారు చేసే పనులతో చుట్టూఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు*...

       🌹🙏*శుభమధ్యహ్నం*🙏🌹
 యండమూరి వీరేంద్రనాథ్ గారి 
"" రన్ దీప్తీ రన్""  పుస్తకంలో 
"పడి లేచిన కెరటాలు" అన్న అధ్యాయం నుంచి.

ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి అవి ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా ఒక్కో స్థాయిలో ఉంటాయి... ఒక్కొక్కరికి ఆక్సిడెంట్ జరిగితే చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టవచ్చు... 
ఇంకొకరికి ఫ్రాక్చర్లు కావచ్చు...
ఇంకొందరు జీవితాంతం అంగ వైకల్యంతో బాధ పడవచ్చు... అలాగే ఉద్యోగ మరియు ఆర్థిక సమస్యలూ... 
వైవాహిక మరియు కుటుంబ సమస్యలు...
ఇప్పుడు ప్రధానంగా పిల్లలు వారి చదువులు వారిని స్థిరపరచడం...
ఇలా అనేక సమస్యలు...
అన్నీ ఒక్కొక్కరికీ ఒక్కో స్థాయిలో ఉంటాయి...
ఇవన్నీ మనం జీవించి ఉన్నంత కాలం సముద్ర కెరటాల లాగా వస్తూనే ఉంటాయి...
కానీ వాటిని మనం ఎలా తీసుకోవాలి... 
వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టే మన జీవితం... 
జీవితం తాలూకూ మాధుర్యం ఆధారపడి ఉంటుంది... 

ఇదంతా ఓపికగా చదవండి 
మీ సమయం వృథా కాదు... దానికి నాది హామీ... 

ఇవి చదివిన తరువాత వీరి జీవితంలో వచ్చిన కష్టాలతో మనవి కంపేర్ చేసుకొంటే మనవీ కూడా కష్టాలేనా వీటికే మనం ఇంత ఆందోళన చెందుతున్నామా అనిపిస్తోంది...
మనసు చాలా తేలిక పడుతుంది...
ప్రశాంత మైన మనస్సుతో ఆలోచిస్తే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది...
నేను ఇంతకు ముందు చెప్పినట్లు జీవితం మాధుర్యం ఆస్వాదించడం ప్రారంభిస్తాం....

(ఇక్కడి వరకూ నా సొంత కవిత్వం ఇక్కడి నుండి గురువు గారు చెప్పింది...)

1. ఒంటి కన్ను క్రికెట్ రాక్షసుడు
 
ఆటగాళ్ళతో విధి చాలా క్రూరంగా ఆడుకుంటుంది. అతడో నవాబు. ఇంగ్లాండు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేవాడు. యూనివర్సిటీ తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడి, ఆ రాత్రి తోటి క్రీడాకారులతో డిన్నర్కి వెళ్ళాడు. డిన్నర్ తర్వాత స్నేహితులు ‘నడిచి వెళ్దాం’ అ౦టే ‘అలసిపోయాను. కార్లో వెళ్ళిపోతాను’ అని వారికి క్షమాపణ చెప్పి స్నేహితుడి కారు ఎక్కాడు. 

వంద గజాలు కూడా వెళ్ళక ముందే, ఎదురుగా ఒక పెద్ద కారు వచ్చి ఢీ కొనడంతో కుడి భుజం బెణికింది. విండ్-స్క్రీన్ పగిలి అద్దం కంట్లో గుచ్చుకుంది. ‘ఈ భుజంతో తిరిగి మళ్లీ క్రికెట్ ఆడగలనా’ అనుకున్నాడు.  భుజాన్ని సెట్ చేయడం కోసం హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ డాక్టర్లు ‘మీకు నొప్పి తెలియలేదు కానీ మీ కుడి కన్ను పూర్తిగా పోయింది. ఇక ఆటకి పనికి రారు`” అన్నారు. 

అతడు నిరాశ పడలేదు. గమ్యం వైపు వెళ్తూన్న అతడి ప్రయాణాన్ని, ఆ ఆక్సిడెంట్ రెడ్-లైట్‌ వేసి ఆపలేదు. ఆ పై జీవితాంతం ఒంటి కన్నుతోనే ఆడాడు. అతడు సిక్సర్లు కొడుతూ ఉంటే ఎదుటి జట్టు ఆటగాళ్ళు బెంబేలెత్తి పోయేవాళ్ళు.
అతని అసలు పేరు మన్సూర్ అలీ ఖాన్. హర్యానాలోని గురుగావ్ జిల్లాలో ‘పటౌడీ’ అనే నగరానికి జమిందార్ కాబట్టి ‘నవాబ్ అఫ్ పటౌడి’ అని కూడా అంటారు. చాలా అందగాడు.
 
ఆ రోజుల్లో నవాబ్-ఆఫ్-పటౌడి గ్రౌండ్‌లో ఆడుతో౦టే, కేవలం అతన్ని చూడటానికే అమ్మాయిలు స్టేడియంకి వచ్చే వాళ్ళ౦టే అతిశయోక్తి కాదు. 

కాశ్మీర్-కి-కలి షర్మిలాటాగోర్ భర్త ఇతడు. ‘దేవర’ ఫేమ్ సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి.
ఒక కన్నుతోనే క్రికెటర్‌గా రాణించి, భారతజట్టుకి కెప్టెన్ అయ్యాడు. భారతదేశ క్రికెట్ చరిత్రలో, అతి చిన్న వయసులో ఒక దేశానికీ కెప్టెన్ అయినవాడుగా (21 ఏళ్ళు), ఎక్కువ సార్లు గెలిచిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు నవాబ్ ఆఫ్ పటోడి.
...

2. అతి చిన్నవయసులో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం (2004) చేసిన అతి కొద్దిమంది క్రీడాకారుల్లో సందీప్ సింగ్ ఒకరు. అప్పుడు అతడి వయసు 18 సంవత్సరాలు. తన కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఆడుతున్నప్పుడు, ప్రపంచ హాకీ చరిత్రలోనే అతడిది అత్యుత్తమ వేగం (గంటకి 145 కి.మీ) అని చెప్పుకునే వారు. పక్క ఆటగాడికి వేగంగా ‘పాస్’లు ఇవ్వటంలో ఆ రోజుల్లో అతడికి మించినవారు లేరని ప్రతీతి. 
 ‘బ్రతుకు చదరంగంలో అతి చిన్న పావులం మనం. ఎదుటి ఆటగాడికి 'షా' చెప్పి గెలిచామని అనుకునే లోపులో, ఓ మూల నుంచి ప్రత్యర్థి ఏనుగు వచ్చి మన రాజుని కూలదోస్తుంది. విధి కూడా అంతే. గెలిచి అందలం ఎక్కుతూండగా కాలు జార్చి మన గెలుపుకి ‘చెక్’ పెడుతుంది. మన పట్టుదలని పరీక్షిస్తుంది’ అంటాడు ఈ ఆటగాడు. 
 
ఒక దురదృష్టమైన రోజు (ఆగస్టు 22, 2006) విధి అతడిని వెక్కిరించింది. జర్మనీలో జరిగే ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనటం కోసం కల్కా-ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా, ఒక ఆర్.పి.ఎఫ్ అధికారి తుపాకి పొరపాటున పేలి, ఆ బుల్లెట్ అతడి వెన్నెముక గుండా శరీరపు దిగువ భాగంలో దూసుకు పోయి౦ది. 

దాని ఫలితంగా నడుము క్రింది భాగం అచేతనమై, దాదాపు రెండు సంవత్సరాలు వీల్‌చైర్‌ పై ఉన్నాడు. ఇక అతడు ఎప్పటికీ నడవలేడనీ, జీవితాంతం అలాగే ఉండ వలసి ఉంటుందనీ డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. 

ఆ నమ్మకాన్ని నమ్మటానికి అతడు నిరాకరించాడు. ‘ఫిజియో థెరపిస్ట్’ భుజం మీద ఒక చెయ్యి, ‘దృఢసంకల్పం’ మీద మరో చెయ్యీ వేసి అతడు నడవటం మొదలు పెట్టాడు..!

అతడు ఆసుపత్రిలో ఉండగా తమ్ముడు విక్రమ్ గీత్ సింగ్ అన్నయ్యకి హాకీ స్టిక్ ఇచ్చి వీలైనంత తొందరలో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టమని ప్రోత్సహించాడు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే, తిరిగి హాకీ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు..! అకుంఠిత దీక్షతో కృషి చేసి తిరిగి భారతజట్టులో స్థానం సంపాదించుకుని, కీలక ఆటగాడిగా కొనసాగాడు..! 
ఒక టోర్నమెంట్‌లో 12 గోల్స్‌ కొట్టి కొత్త రికార్డును నెలకొల్పాడు..! అంతే కాదు.

జాతీయ కోచ్‌ అయ్యాక భారతదేశానికి రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించాడు..! 

అలా.. వెక్కిరించిన విధిని చిరునవ్వుతో పరిహసించాడు.
...
3. జీవితంలో నదిని చూడని వానికి రోవింగ్ లో పతకం
 
దత్తు బోకనాల్‌కి నీళ్లు అంటే అమితమైన భయం. అతడు తన జీవితకాలంలో ఒక నదిని గాని, కాలువను గాని చూడలేదు. ఊరిలోని గ్రామస్తులందరికీ కలిపి తవ్విన ఒకే ఒక సామూహిక బావి (నుయ్యి)లో నీటిని మాత్రమే చూశాడు. మరోలా చెప్పాలంటే అతడు ఎప్పుడూ ‘ప్రవహిస్తున్న నీటిని' చూడలేదు. సముద్రమూ, కెరటాలూ అని ఎవరో చెప్తే విన్నాడు తప్ప అవి ఎలా ఉంటాయో తెలియదు.

భారతదేశంలోనే అత్యంత కరువు కాటకాలకు నెలవైన నాసిక్ జిల్లాలో తాలేగాఁవ్ గ్రామం దాటి అతడు ఎన్నడూ బయటకి వెళ్ళలేదు. అక్కడ వర్షం కూడా అరుదే. తాలేగాఁవ్ లాంటి చిన్న గ్రామంలో పుట్టిన దత్తు బోకనాల్‌కి పెద్ద పెద్ద కోరికలు లేవు. 

లోతైన నీటి గుంతల నుంచి నీటిని తీసుకెళ్ళి పొలాన్ని తడపటమే అతడి దినచర్య. వర్షం అక్కడో వరం. రైతుల ఆత్మహత్యలు సాధారణం. అతడి తండ్రి ఒక కూలీ. ఐదో తరగతి చదువుతున్న సమయంలో దత్తు తండ్రికి ఆర్థికంగా సహాయ పడాలని పగలు కూలి పని, రాత్రిళ్ళు పెట్రోలు బంకులో పని చేసేవాడు. 

తన జీవితంలో అతడు టెలివిజన్, రిఫ్రిజిరేటర్లతో బాటూ 'ఒలంపిక్స్' అనే పేరు కూడా వినలేదు. చిత్రమేమిటంటే అటువంటి వాడు రియో ఒలంపిక్స్‌లో భారతదేశం తరఫున సాగరక్రీడ (రోవింగ్) లో పాల్గొన్న “ఏకైక” క్రీడాకారుడిగా ఎదిగాడు..!
తండ్రి మరణించిన తర్వాత భవననిర్మాణంలో కూలీగా, ఆపైన మేస్త్రిగా, ఆ తర్వాత పెళ్లిళ్లలో భోజనాలు సర్వ్ చేసే వెయిటర్‌గా, ట్రాక్టర్ డ్రైవర్‌గా, ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి 2012లో సైన్యంలో చేరాడు. 

అతని ఎత్తు, శరీర దారుఢ్య౦ చూసి ఒక ఆర్మీ ఆఫీసర్ అతడిని పడవ పందాల్లో పాల్గొనమని సలహా ఇచ్చాడు. అక్కడి కోచ్ ప్రోత్సాహంతో అతడు వాటర్ గేమ్స్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అప్పుడు కూడా పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించాలన్నది అతడి ఆశయం కాదు. రోవింగ్‌లో కాస్త గుర్తింపు వస్తే సైన్యంలో ప్రమోషన్ వస్తుందనీ, గ్రామంలో తమ కుటుంబానికి డబ్బు మరి కాస్త ఎక్కువ పంపవచ్చనీ కోరిక. అంతే. అక్కడ గ్రామంలో అతడి కుటుంబ సభ్యులు అయిదుగురు అతడు పంపించే డబ్బు మీదే ఆధారపడి ఉన్నారు. 

"నాకు తండ్రి లేడు. అమ్మ పక్షవాతంతో మంచం మీద ఉంది. పొలాలకు నీళ్లు లేవు. పొలాల్లో పంటలు లేవు. కుటుంబానికి నేనొక్కడినే ఆధారం..! నా వృత్తే నాకు ఆధారం..! పోటీల్లో గెలిస్తే జీతం మరింత పెరుగుతుందని ఒకటే నమ్మకం" అనేవాడు బొకనాల్, 
ఆ సంవత్సరం ఒలంపిక్స్ ‘రియో’లో జరుగుతున్నాయి. ఒలంపిక్స్‌లో పాల్గొనే సమయానికి బకనాల్ వయస్సు 25 సంవత్సరాలు. 

రోవింగ్‌లో భారతదేశానికి ఇప్పటి వరకూ కేవలం ఒకే మెడల్ వచ్చింది. ఆ వచ్చిన ‘ఏకైక’ మెడల్ అతడి ద్వారానే లభించింది. 
అప్పటి వరకు సముద్రాన్ని గాని, నదిని గాని చూడని ఆ యువకుడు భారతదేశంలో తన కుటుంబాన్ని దరిద్ర సాగరం నుంచి బయట పడేయడానికి పడవ ప్రయాణం మొదలు పెట్టాడు. 
ఇండోనేషియాలోజరిగిన 18వ ఏషియన్ గేమ్స్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టాడు.
బోకనాల్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
...

4. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన హీరో. 2011 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు పూర్తి అవుతూ ఉండగా అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 
విపరీతమైన బాధతో విలవిలలాడి పోయేవాడు. బ్లడ్ వామ్టింగ్స్ చేసుకునేవాడు. 

ఆ సమయంలో అతడి తల్లి అతనికి గొప్పగా సేవ చేసింది. మొహం పై రక్తాన్ని తుడుస్తూ ‘ఎప్పటికైనా తిరిగి మళ్ళీ నువ్వు దేశానికి నీ సర్వీసెస్ అంద జేస్తావురా’ అంటూ ధైర్యం చెప్పేది.
 
రెండు సంవత్సరాలపాటు ఆటకు దూరంగా ఉండి, వైద్యుల సహాయంతో అతడు తిరిగి కోలుకున్నాడు. 

2015 ఐ.పీ.ఎల్‌లో ‘ఢిల్లీ డేర్ డెవిల్స్’ ఇతడిని 16 లక్షలకి కొన్నప్పుడు ఆ సంవత్సరపు ఐ.పీ.ఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 
మృత్యువుని క్లీన్ బౌల్డ్ చేసిన ఆ క్రికెటర్ యువరాజ్ సింగ్.... 
మనందరి అభిమాన క్రికెటర్... 

ఒక్క సారి ఆలోచించండి... 
మనం ప్రతి రోజు ఆందోళన చెందుతున్న విషయాలు ఇంత కఠినమైనవేనా... వాటినుండి మన ప్రయత్నంతో బయట పడలేమా... పోరాడుదాం పోరాడితే పోయేదేమీ లేదు... కష్టనష్టాలు తప్ప... వచ్చేది అంతా ఇంతా కాదు... 
గొప్ప ఆనందం మానసిక సంతృప్తి... 
విజయం సాధించి ఆనందపు శిఖరం పై జెండా ఎగరేసిన కిక్... 

ఓపికగా చదివినందుకు...
థాంక్యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్... 
ఆలోచించండి...
కొంచమైనా ఆచరణలో పెట్టండి...
విజయపు శిఖరంపై నుండి ఈ ప్రపంచాన్ని చూడండి...
 రాత్రిపూట మరణాన్ని నివారించడానికి డాక్టర్ల సూచనలు చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా రాత్రి పూట మరణించడం మనం వింటూ ఉంటాం " నిన్న వరకు బాగానే ఉన్నాడు ఎలా ఇలా చనిపోయాడు?" అనే ప్రశ్న తరుచుగా వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం రాత్రిపూట ఆకస్మికంగా మంచం నుండి లేచడం వల్ల మెదడుకు రక్త ప్రవాహము నిలిచిపోవడమే

     మానవ శరీరము విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. రాత్రిపూట టాయిలెట్ కు వెళ్ళాలి అన్న అవసరం వచ్చినప్పుడు మనం వెంటనే మంచం నుంచి లేచి దూకుతాం. ఈ వేగం కారణంగా మెదడుకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవిస్తుంది.
   
      దీనిని నివారించడానికి డాక్టర్లు " 3 1/2 నిమిషాల నియమము " పాటించమని చెబుతున్నారు. మీరు మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు బదులుగా ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి .ఇది చిన్న జాగ్రత్త అయినా పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు.

     మొదటి నిమిషం మంచం మీద పడుకున్నట్టుగానే ఉండాలి. తరువాతి అర నిమిషం  మంచం మీద నెమ్మదిగా కూర్చోవాలి. ఆపై అర నిమిషం కాళ్లు నేల వైపు దించి మంచం అంచున కూర్చోవాలి. మొత్తం మూడు నిమిషాలు గడిచాక నెమ్మదిగా లేచి నడవాలి 

  ఈ విధానము వయసుతో సంబంధం లేకుండా అందరూ పాటించాలి.  రక్త ప్రసరణ  సమస్య ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మేల్కొని తొందరగా  కదిలే  సమయము లో  ఇది జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త అవసరం.
  
 ఈ చిన్న అలవాటు వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ కొనసాగుతుంది. గుండె బలహీన పడకుండా ఉంటుంది. పడిపోవడం , ఆకస్మిక గుండె  పోటు ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే ఈ సమాచారాన్ని మన కుటుంబం స్నేహితులు బంధువులతో పంచుకోవాలి. 
ఒకరి జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని రక్షించగలదు

సేకరణ విషయంతో   యాసాల మల్లిఖార్జున్ ,రేచపల్లి , సారంగాపూర్ 9848729131.
 2912a5;92c6;122d5;1.10e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ముత్తయిదువ లక్షణాలు:* 
                      *మరియు*
                  *ఉపయోగాలు*
                  ➖➖➖✍️

*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*

*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*
*2). చేతులకి గాజులు*
*3). మెడలో మంగళసూత్రం*
*4). తలలో పువ్వులు*
*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..*


*1). మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*
```
*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది.

*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది.

*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*
```
*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!

*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.  అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

*అందునా పొలం పనులు, కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*
```
*దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.

*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని!  మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది.

*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.```


*4). ఇక నాల్గవది తలలో పూవులు..*```

*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.```


*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*```

*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్, పసుపు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

*ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
 237 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 25

కృతం దేహే న కర్మేదం న మాయా  శుద్దరూపిణా|
ఇతి చింతానురోధీ యః కురువన్నపి కరోతి న||

చైతన్యమయమైన ఆత్మౄ తన్నుతాను గుర్తిస్తూ తనలో సంస్కారానుగుణంగా కదిలే భావాల వల్ల శరీరము పనిచేస్తున్నదని తానేమి చేయడం లేదని తెలుసుకున్న జ్ఞాని కర్మలను ఆచరిస్తున్న చేయనట్లే.

కర్మ అనగానే కేవలము శరీర అవయవాల కదలిక మాత్రమే కాదు. ఆ కర్మను నిర్ణయించే బుద్ధి అహంకారం ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. గాఢ నిద్రలో నీ గురువును కాలితో తన్నినా సరే అది నీ పనిగా గుర్తింపబడదు. చిన్నపిల్లల పనులకు కూడా వారిని కర్తగా భావించి నిందించము. బుద్ధిలో కదలిన భావాల అనుగుణంగా అహంకారంతో గుర్తిస్తూ చేసిన పనులు మాత్రమే మన కర్మలుగా గుర్తింపబడుతాయి.

జీవన్ముక్తుడు కూడా సదా ఆత్మ జాగృతుడు అయి ఉండటముతో అతని మనశ్శరీరాలు వాసనానుగుణంగా పనిచేయటాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. సముద్రంలోని అలల వలె అతనిలోనే భావాలు కదులుతూ ఉండడానికి అతడే ఆధారమైన, అతని దృష్టిలో రెండవది ఏది లేనేలేదు .గుర్తించే అహంకారం లేకపోవడంతో కర్మ ఫలాన్ని స్వీకరించే వారు కూడా ఉండరు. కాబట్టి అష్టావక్రమహర్షి "కురువన్నపి కరోతి న"... అతడు పనిచేసిన చేయనట్లే అని అంటున్నారు.

భగవద్గీత అంతటా ఇదే భావము నిమిడీకృతమై ఉంది. ఉపనిషత్తులన్నీ ఇదే భావాన్ని దృఢంగా చెబుతున్నాయి. మనదేశంలో మహర్షులు మహాత్ములు అన్ని కాలాలలోనూ ఈ సత్యాన్ని అనుభవ సహితంగా అనేక విధాల అందించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనినే జీవన్ముక్తిగా వర్ణిస్తున్నారు.🙏🙏🙏