Thursday, 20 August 2026

 🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍

*🌾🌹పితృ దేవతా🌾🌹 జ్ఞానం*

*🌾🌹దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే.*
             🌾🌾🌾🌾
 *🌹మాసికాల రహస్యం ఇదే*!
 *మాసికాలు ఎందుకు పెట్టాలి?*
*అన్ని మాసికాలు పెట్టాలా?*
*కొన్నిమానేయవచ్చా?*
        🌾🌾🌾🌾🌾
 

*🌹🌾వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే*

 *🌹🚩🌾చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ* *సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.*
*దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.* 

*🌹🌾అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*



*🌾కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 

*🚩🌹చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?* 

*🚩🌾మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి?*

*🌈🌹దేవతగా ప్రేత ఎలా మారుతుంది?*

*🌹పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి*? 

*🚩అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.*

*🌾వీటికి సమాధానం ఒక* *ఉపనిషత్తు చెబుతోంది.*
*ఆ ఉపనిషత్తు పేరు* *పిండోపనిషత్తు*. 

*🌈🌾ఇది అథర్వణ వేదశాఖకు చెందినది.* 
*ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది*.
 
*🌾ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది*. 

*🚩దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు*.

*🌎బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు*.

*🌹🌾మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?* 
*అనే ప్రశ్నలు వేశారు.*

*🌈🌾దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు*.

*🌈మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 

*🌈ఈ శరీరం*
*భూమి,* 
*నిప్పు,* 
*నీరు,* 
*గాలి,* 
*ఆకాశం* 
*అనే మహాభూతాలతో ఏర్పడింది*.

*🌹ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.* 
ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.

*🌹ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం).* 
*దాని వలన పంచప్రాణాలు పోతాయి.* 

*🌹గాలి తరువాత అగ్ని పోతుంది.* 
*శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.* 

*🌈తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.* 

*🌹🌾ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి.* 

*🌈ఇవి భూమిలో కలిసిపోతాయి.* 

*🌹శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది.* 

*క్లుప్తంగా జరిగేది ఇదే.* 

*🌏ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

*🌹నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ*
*కారణ శరీరం,* 
*యాతనా శరీరం*
*అని ఉంటాయి*

*👉🏾🌈కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం.* 
*తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది.* 
*అదే నూతన శరీరం పొందుతుంది.*

*🇮🇳🍃యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది.* 

*ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*🌈ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది.* 
*ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*🌹దీని తరువాత పదోరోజున* 
*సపిండులు,* 
*సగోత్రీకులు,* 
*బంధువులు,* 
*స్నేహితులు* 
*వచ్చి, వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి.* 
*వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*💥🇮🇳అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.* 
*పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ,   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది*.*

*🌈సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో,* 
*తన తండ్రి తాత ముత్తాతల్లో,* 
*ముత్తాతను ముందు జరిపి,* 
*ఆయన ఖాళీలో తాతను,* 
*తాత స్థానంలో తండ్రిని,* 
*తండ్రి స్థానంలో తాను* 
*చేరుకుంటుంది.* 
*పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది.* 

*🌺నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*🌹వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది.* 
*దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం, చర్మం, రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

🌈*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 

*🌺ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*

*🌹ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.** 

*🌈ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*

*🌹ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన, పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం, పిండాల వలన కలుగుతుంది.* 

*🌺ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*
 
*🍃నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*

*🌈వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది.* 

*🌹మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*🌈అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*🌹ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది.* 
*ఆ తరువాత* 
*అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*🌈కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే.* 

*మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

🌹*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది.* 

*🌹మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము.* 
*మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది.* 

*సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

*ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు*.   

*ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి*.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన* 
*కురుక్షేత్రం,* 
*ప్రయాగ,* 
*కాశీ,* 
*గయా,(* 
*వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము.* 
*దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది.* 

*వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

*🌹🌾పిండాలు ప్రేతాలకు వెళతాయా?* 

*అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు*🌈.* 

*🌈🌹నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు.* 
*అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 

*🌈అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు*. 

*🌈వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు*. 

*🌎గయలో ఎందుకు చేయాలి?*
*ప్రయాగలో ఎందుకు చేయాలి?*
*అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు*. 

*🌈పుణ్యక్షేత్రాలుగా* *చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు.* 
*ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.* 

*ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.*

*వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.*  

*వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు*. 

*ఉదాహరణకు* *మాఘపౌర్ణమి చాలా మంచిది.* 
*దాన్ని మాఘపౌర్ణమి,* *మహామాఘి అంటారు*. 

*ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి.* 

*🌹ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం*.  

*🌈ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.*

*🌈ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.*

No comments:

Post a Comment