Friday, 21 November 2025

 హరి ఓం  ,                     
                                       *.            *వందే మాతరం* 
దేశ స్వాతంత్ర్య సంగ్రామం లో ఉర్రూతలూగించిన నినాదం గా మారిన గీతం ‘వందే మాతరం’.  ఈ గీత రచయత  బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ. ఆయన రచించిన  ‘ఆనంద్ మఠ్’  అనే నవలో  దీనిని ఉపయోగించడం  జరిగినది.  

1857 విప్లవం విఫలం అవ్వడానికి చారిత్రిక కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రజలలో జాతీయ స్పూర్తి కొరవడటం  ముఖ్య కారణం.  అందుచేత ఆ విప్లవసమయం లో పెక్కు మంది స్తబ్దు గా ఉండిపోయారు.   బ్రిటిష్ వారికి మద్దతు పలికినవారు కొంతమంది. 

 ప్రజలలో జాతీయ భావాలు రేకెత్తించిన వారిలో ముఖ్యులు బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ.  ఆయన రచించిన నవల ఆనంద్ మఠ్ బహుళ ప్రచారం పొందినది. అలాగే అందులోని వందేమాతరం గీతం కూడా బహుళ ప్రచారం పొందినది.   

1763-1800 మధ్య లో బెంగాల్ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా ‘సన్యాసుల తిరుగుబాటు’ జరిగినది.  బ్రిటిష్ వారు అతి కష్టం మీద ఆ తిరుగుబాటును అణచగలిగారు.   బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ ఈ ఇతివృత్తం నేపధ్యం గా తీసుకొని, బ్రిటిష్ వారి వేటు పడకుండా ఉండటానికి, ఆ నవలను ఒక చారిత్రిక ఆధ్యాత్మిక నవలగా రూపొందించారు.  అందులో భారత దేశాన్ని ఆయన భారత మాత గా దుర్గ, లక్ష్మి సరస్వతి గా కీర్తించడం జరిగినది.   

ఆ రోజుల్లో కాంగ్రెస్ సమావేశాలలోనూ, ముఖ్యమైన సభల్లోనూ  – వందేమాతరం గీతాన్నే అలపించేవారు.   1896 కాంగ్రెస్ సమావేశం లో రవీంద్రనాథ టాగూరు గారు ఈ గీతాన్ని స్వయంగా పాడారు.  బెంగాల్ విభజన కు వ్యతిరేకం గా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని  వందేమాతరం ఉద్యమమనే పిలుస్తారు.  వందేమాతరం అని గట్టిగా నినదిస్తే బ్రిటిష్ దొరలు ఉలిక్కి పడేవారు.  అలా నినాదం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునేవారు.   స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, తాను రాజమండ్రి లో చదువుకుంటూ ఉండగా, వందేమాతరం అనే నినాదం చేసినందుకు, ప్రిన్సిపాల్ ‘హంటర్’  ఆయనను కాలేజీ నుండి బహిష్కరించాడు.  మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన అనర్హుడుగా ప్రభుత్వం ప్రకటించింది.   

మనకు స్వాతంత్ర్యం వచ్చినపుడు జాతీయ గీతం ఏది ఉండాలనే చర్చ వచ్చినది.   వందే మాతరం బహుళ ప్రచారం పొందిన గీతం అయినప్పటికీ,  ముస్లిం నాయకుల, సెక్యులర్ నాయకుల అభ్యంతరాల వల్ల,  ముఖ్యంగా నెహ్రూ గారి చొరవతో జనగణ మన .. గీతాన్ని జాతీయ గీతం గా స్వీకరించడం జరిగినది.    ఐనప్పటికి వందేమాతరం గీతానికి జాతీయ గీతం తో సమాన  హోదా ఇవ్వటానకి అంగీకరించారు.   ఈ గీతం లో మొదటి రెండు చరణాలు పాడటానికి నిర్ణయం జరిగినది.  
**
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ గారు ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం యావత్తు భారత మాత కు వందేమాతరం అంటున్నది ..........              
              *సేకరణ*.                  
              🙏🙏 ...                
  వలిశెట్టి  లక్ష్మీశేఖర్ ...                              
  Ph.98660 35557..       
  HYD. 21.11.2025.

No comments:

Post a Comment