Wednesday, 10 September 2025

 217 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 5 

న దూరం న చ సంకోచాతై 
లబ్దమేవాత్మనః పదమ్|
నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం||

కేవలమూ, అప్రయత్నము, పరిణామరహితము, నిష్కలంకము అయిన ఆత్మ ఎక్కడో దూరంగా అందరినిగా లేదు. దీనికి పరిమితులు లేవు, అసాధ్యము కాదు ,ఇది నిత్యసిద్ధమైనది.

శుద్ధ చైతన్యం స్వభావతః నిష్కలంకమైనది. ఇందులో ఏ విధమైన కోరికలు భావాలు వాసనలు లేవు. ఇంద్రియాలతో ప్రపంచాన్ని గుర్తించటం మనసులోని ఉద్రేకాలు బుద్ధిలోని ఆలోచనలు కూడా శ్రమతో కూడినవి, కాబట్టి ఈ ఉపాధులతో పని చేయడానికి ప్రయత్నం కావాలి. ఆత్మ ఇక్కడ నిరాయాసంగా వర్ణించబడింది. ఉపాధులైన మనశ్శరీరాలను అధిగమించి అహంకారం అంతరంగంలో లయమయి సత్య ద్రష్టగా సత్యంగా జాగ్రత అయినప్పుడు ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇందుకు ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. ఈ మహోన్నత స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి ఇది మనకు దూరంగా లేదు. ఈ స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి సాధించవలసిన పనిలేదు. ఇది నిత్య సిద్ధమే. 

పరిమితమైన మన ఉపాధులతో మనము సాధించగలిగినది కూడా పరిమితమే. ఆత్మ అనంతమైనది కాబట్టి అది అపరిమితమైనది కూడా. కాబట్టే ఇది అసాధ్యము. మనలో ఉండే నిజమైన నేను ఇదే. సత్ గా సంతతము ఉంటూ చిత్తుగా తెలుసుకుంటున్నది ఇదే, అందుచేత ఇది మన నుండి ఎప్పుడూ దూరము కాదు. అదే నేను. ఇది నిత్య సిద్ధంగా ఉండనే ఉంది. అయితే మన భ్రమా జ్ఞానము వల్ల ఈ ఆత్మసాన్నిద్యాన్ని తెలుసుకోలేక పోతున్నాము.

ముండ కోపనిషత్తులో మహర్షి మేఘ గంభీర గర్జన రావమ్మతో ఇలా అంటున్నారు.

దూర తమమైన దానికంటే సుదూరమైనది, ఇక్కడే ఈ శరీరంలోనే ఉంది. యోగి తన జీవితంలో తన హృదయములోనే దీనిని దర్శించగలడు.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(213వ రోజు):--
        ఉపదేశాలూ, ఉదాహరణలూ ఒకదాని కొకటి తోడు కావాలి. విద్యా ర్థులు తమ అధ్యాపకుని స్నేహితుని గా, మార్గదర్శకునిగా, జీవనరహస్యా లు తెలిసిన జ్ఞానిగా చూడగలగాలి. పిల్లలు తాము విన్నదానికంటే చూచి నదానివల్లనే ఏదైనా విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. అందుచేత ఉపాధ్యాయునిలో శ్రద్ద, నిష్కపటత్వం చాలా అవసరం. ఈ కారణంచేతనే ప్రాచీన భారతదేశం లో విద్యనేర్పే బాధ్యత పరిపూర్ణమైన ధార్మికజీవనం గడిపేవారికే అప్పగిం చబడింది. శిష్యుల నడవడిని సరైన రీతిలో మలచటానికే అటువంటి వ్యక్తులు తమ జీవితాన్నంతనూ అంకితం చేశేవారు. 
       నైతికవర్తనంతో మెలుగుతూ ఆదర్శప్రాయమైన అధ్యాపకులుగా అందరిచేతా గుర్తింపు పొందేవిధం గా ప్రవర్తించాలనే ప్రోత్సాహవచనం తో స్వామీజీ తన ఉపన్యాసాన్ని ముగించారు. తర్వాతివారంరోజులూ పురాణాలూ, రామాయణం, భాగవ తం వంటి ఇతిహాసాలూ, గొప్పగొప్ప మహర్షుల జీవనచరితాలూ, వాటి భావార్థాలూ వివరించటం జరిగింది. పురాణగాథలు పిల్లలనైతికవర్తనాని కి ఆదర్శప్రాయంగా ఉండటం మాత్ర మే కాక, వాటిలో ఉపనిషత్తుల మూలసత్యాలు కూడా ఉంటాయి. 'అహం' తత్వపు లౌకికకాంక్షల నధి గమించి దివ్యత్వాన్ని చూరగొంటానికి శ్రమించే మానవుని క్లిష్టమైన వ్యక్తిత్వ పు వివిధ అంశాలకు ఈగాథల్లోని వివిధపాత్రలు ఏ విధంగా చిహ్నా లౌతాయో తెలుసుకున్నారు ఉపా ధ్యాయులందరూ. శివుడూ,గణేశు డు, పార్వతి వంటి పిల్లలందరికీ తెలిసిన దేవతల గురించిన లోతైన, ఆధ్యాత్మిక పరమైన అంతరార్థం వివరించబడింది. 
         ఆత్మవికాసం చాలా నిదానం గా జరిగే ప్రక్రియ అని అందరికీ గుర్తు చేస్తూ స్వామీజీ రెండవవారపు ఉప న్యాస కార్యక్రమాన్ని ముగించారు. విద్యార్థులకు ధార్మికవిద్యనేర్పే ప్రయ త్నాలు వెంటనే ఫలితాలనీయవనీ, వారి వైఖరి వెంటనే మారకపోవచ్చ నీ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి కాని, విత్తనాలు నాటడం జరిగితే, అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలేజీచదు వులో విద్యార్థులు విలాసజీవితాన్ని చవిచూచినా, తర్వాత వృత్తిలో కష్టా ల్నీ, స్పర్థలని ఎదుర్కొంటున్నపుడు, తాము ఇదివరలో నేర్చుకొన్న విష యాలను గుర్తుకు తెచ్చుకొని, వాటి నుంచి సహాయం పొందవచ్చు. చిన్నతనంలోనే మనసులో వ్రేళ్లూ నిన జీవనసూత్రాలు తర్వాతికాలం లో పుష్పించి, వారిని మంచి పౌరు లు గానూ, మంచిమానవులు గానూ చేస్తాయి.
         🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 3️⃣2️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దనl*
 *బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ll*

ఈ నిష్కామ కర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు.

ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్రయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావము ఉండకూడదు. అలాగే నిశ్రయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూతద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడి విడిగాఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.

వ్యవసాయాత్మికా బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం స్థిరంగా ఉంచుకోవడం ఎవరికైనా బుద్ధి స్థిరంగా, నిశ్చయం లేకుండా, చంచలంగా ఉంటే వాడు ఏ పనీ సక్రమంగా చేయలేడు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్రయమైన బుద్ధి అవసరము. అంటే మన మనసును, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చేసే పని మీదనే ఉంచాలి. అటుఇటుపోనివ్వకూడదు. మనం ఏం చెయ్యాలి. ఏం సాధించాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి. తరువాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి. అంతే కానీ ముందు ఏదో ఒక కర్మ మొదలు పెట్టి దాని మీద మనసుపెట్ట కుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము. అలా కాకుండా ఒక నిశ్చయం, లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. ఏ పనిమీదా ధ్యాన ఉండదు. అన్ని పనులు మొదలు పెడతాడు. ఏ పనీ పూర్తిగా చేయడు. తుదకు అభాసుపాలవుతాడు.

ఏ మానవుడికైనా జీవితాశయము ఒకటి ఉండాలి. దానిని బట్టి అతని జీవన విధానము ఉంటుంది. ఉన్నతమైన ఆశయములు కలవారి జీవన విధానము కూడా ఉన్నతంగా ఉంటుంది. అతడు ఉన్నత శిఖరములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా అల్ప బుద్ది కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి. వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి. కొంతమంది ఈ జీవితం అశాశ్వతము, క్షణికము అని దీని గురించి ఆలోచించరు. చచ్చిన తరువాత స్వర్గలోక సుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆ స్వర్గలోకము కూడా శాశ్వతము కాదు అని వారికి తెలియదు. మరి కొంతమంది ఇవేమీ కాదు మోక్షమే అసలైన పరమ పదము అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గం అనుసరిస్తారు. ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులు కలిగి ఉంటారు.

అందుకని మానవులను రెండు విధములుగా విభజించాడు కృష్ణుడు. వ్యవసాయాత్మికా బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మికా బుద్ధి కలవారు. వ్యవసాయాత్మికా బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏకా భవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మార్పు చెందదు. స్థిరంగా ఉంటుంది. అవ్యవసాయినామ్ అంటే స్థిరమైన బుద్ది లేని వాళ్లు. వారి బుద్ధి బహుశాఖా అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అనంతంగా ఉంటుంది. అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది. ఏ ఒక్కదాని మీదా బుద్ధినిలువదు. మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే ఎక్కువగా కనపడుతుంటారు. ఏపనీ నిలకడగా చెయ్యరు. పూర్తి చెయ్యరు. ఎవరు ఏది చెబితే దానిని నమ్ముతారు. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాము కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీదా నిలకడగా ఉండదు. దేవుళ్లలో భేద బుద్ధిని కల్పిస్తాడు. ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే దేవుళ్లను మారుస్తుంటాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు. పరమాత్మ ఒక్కడే అని తెలిసినా, దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు. ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తాడు. అటువంటి వారు ఎలా ఉంటారో మనకు రాబోవు శ్లోకాలలో కృష్ణుడు వివరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P90
 రమణుల ఉపదేశ సారము
“హృదయ కుహరమధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
ఆహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృదివిశ మనసా త్వం చిన్వతా మజ్జతా వా
పవనచలన రోధాదాత్మనిష్ఠో భవ త్వం.”
(హృదయ కోశము నందు అహం స్ఫురణతో కేవల బ్రహ్మము ఆత్మస్వరూపమై భాసించుండును. విచారణచే కాని, మనస్సును హృదయము నందు లీనము చేసికొని కాని, లేదా శ్వాస నియమము చే (మనస్సును నియమించుకొని) కాని, ఆత్మనిష్ఠుడవు కమ్ము.)
ఈ శ్లోకము మహర్షి కృతమే. రమణ మహర్షి శిష్యులలో ఒకరైన జగదీశ్వర శాస్త్రి, సంస్కృత పండితుడు, కవి, “హృదయ కుహర మధ్యే “ అని ప్రారంభించి తర్వాత వ్రాయవలసినది తోచక, ఆ కాగితం అట్లే మహర్షి కూర్చునే స్థానంలో దిండు క్రింద పెట్టి, ఏదో పనిపై వెళ్లి పోయారట. ఆ తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, మహర్షి శ్లోకమును పై విధంగా పూరించి ఉంచారు!
వాశిష్ట గణపతి ముని పై శ్లోకమును రమణ మహర్షి బోధనా సారాంశంగా తీసుకొని, వారి రమణ గీత లో, ఒక అధ్యాయమంతా వ్యాఖ్యానించారు. వారీ శ్లోకము గురించి చెప్పినది:
“శ్లోకం భగవతో వక్త్రాన్మహర్షేరిమముద్గతం,
శ్రుత్యంత సారం యో వేద, సంశయో నాస్య జాతు చిత్ “
“భగవాన్ ముఖతః వెలువడిన ఈ శ్లోకము వేదాంత సారమని, నిస్సంశయముగా గ్రహింపవలెను.”    
 *🕉️ Day 19 – “మనస్సు ఎలా అదుపులోకి తేవాలి?”*  
*(భగవాన్ రమణ మహర్షి ఉపదేశాల ఆధారంగా)*

---

*❖ ప్రశ్న:*  
*“భగవాన్ గారు, నా మనస్సు చాలా చెదిరిపోతుంది. దాన్ని ఎలా కట్టడి చేయాలి?”*

*❖ భగవాన్ సమాధానం:*  
> **“మనస్సు కట్టడి చేయాలనుకోవడం కంటే, దాని మూలాన్ని తెలుసుకోవాలి.  
> మనస్సు ఎక్కడ నుంచి వస్తుంది అని జాగ్రత్తగా పరిశీలించండి.  
> మూలం తెలిసినపుడే మనస్సు నశిస్తుంది.”**

---

*➤ మనస్సు అదుపులోకి తెచ్చే మార్గం:*

- మనస్సుతో పోరాడొద్దు — దానిని పరిశీలించండి.  
- మనస్సు ఎప్పుడూ *బయట* చూసే ప్రకృతి కలది.  
  దానిని *లోపలికి తిప్పాలి* – “మనస్సు ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది?”, “ఇది ఎక్కడ నుంచి వస్తోంది?” అని ప్రశ్నించాలి.  
- ఇలా చేసేవాళ్లకు, మనస్సు తానుగా అదుపులోకి వస్తుంది.

---

*🧘‍♀️ సాధన సూచన:*

1. ప్రతిసారీ మనస్సు చెదిరినప్పుడు, *“ఇది ఎవరిది?”* అని ప్రశ్నించండి.  
2. ఆ ప్రశ్నను అర్థపూర్వకంగా విచారిస్తే, మనస్సు శాంతిస్తుంది.  
3. క్రమంగా, “మనస్సే లేదు” అనే స్థితి – సహజ స్థితి గా మారుతుంది.

---

*🪔 భగవాన్ వాక్యం:*  
> **“తాను తానే ప్రశ్నించుకునే శక్తి — అదే మనస్సు నియంత్రణకు మార్గం.  
> అది బయట వేటకు వెళ్లినప్పుడు బంధం, లోపలికి వచ్చినప్పుడు ముక్తి.”**

---

👉 *Day 20 లో – “మౌనం అంటే ఏమిటి?” అనే ప్రశ్నకి భగవాన్ సమాధానం తెలుసుకుందాం.*

*🙏 Arunachala Siva, Arunachala Ramana 🕉️*
 అరుణాచల శివ 👏
ఈశ్వర తత్వం.....
భగవాన్ రమణులు గారిని ఓక విదేశీ శిష్యుడు ఇలా అడిగాడు... 
మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు... 
అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది'...
అప్పుడు భగవాన్ రమణులు వారు... "ఏది ఉలకదో, ఏది పలకదో, నీతో సంభాషించదో, నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో అదే ఈశ్వర తత్వం" అని జవాబిచ్చారు...