🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(213వ రోజు):--
ఉపదేశాలూ, ఉదాహరణలూ ఒకదాని కొకటి తోడు కావాలి. విద్యా ర్థులు తమ అధ్యాపకుని స్నేహితుని గా, మార్గదర్శకునిగా, జీవనరహస్యా లు తెలిసిన జ్ఞానిగా చూడగలగాలి. పిల్లలు తాము విన్నదానికంటే చూచి నదానివల్లనే ఏదైనా విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. అందుచేత ఉపాధ్యాయునిలో శ్రద్ద, నిష్కపటత్వం చాలా అవసరం. ఈ కారణంచేతనే ప్రాచీన భారతదేశం లో విద్యనేర్పే బాధ్యత పరిపూర్ణమైన ధార్మికజీవనం గడిపేవారికే అప్పగిం చబడింది. శిష్యుల నడవడిని సరైన రీతిలో మలచటానికే అటువంటి వ్యక్తులు తమ జీవితాన్నంతనూ అంకితం చేశేవారు.
నైతికవర్తనంతో మెలుగుతూ ఆదర్శప్రాయమైన అధ్యాపకులుగా అందరిచేతా గుర్తింపు పొందేవిధం గా ప్రవర్తించాలనే ప్రోత్సాహవచనం తో స్వామీజీ తన ఉపన్యాసాన్ని ముగించారు. తర్వాతివారంరోజులూ పురాణాలూ, రామాయణం, భాగవ తం వంటి ఇతిహాసాలూ, గొప్పగొప్ప మహర్షుల జీవనచరితాలూ, వాటి భావార్థాలూ వివరించటం జరిగింది. పురాణగాథలు పిల్లలనైతికవర్తనాని కి ఆదర్శప్రాయంగా ఉండటం మాత్ర మే కాక, వాటిలో ఉపనిషత్తుల మూలసత్యాలు కూడా ఉంటాయి. 'అహం' తత్వపు లౌకికకాంక్షల నధి గమించి దివ్యత్వాన్ని చూరగొంటానికి శ్రమించే మానవుని క్లిష్టమైన వ్యక్తిత్వ పు వివిధ అంశాలకు ఈగాథల్లోని వివిధపాత్రలు ఏ విధంగా చిహ్నా లౌతాయో తెలుసుకున్నారు ఉపా ధ్యాయులందరూ. శివుడూ,గణేశు డు, పార్వతి వంటి పిల్లలందరికీ తెలిసిన దేవతల గురించిన లోతైన, ఆధ్యాత్మిక పరమైన అంతరార్థం వివరించబడింది.
ఆత్మవికాసం చాలా నిదానం గా జరిగే ప్రక్రియ అని అందరికీ గుర్తు చేస్తూ స్వామీజీ రెండవవారపు ఉప న్యాస కార్యక్రమాన్ని ముగించారు. విద్యార్థులకు ధార్మికవిద్యనేర్పే ప్రయ త్నాలు వెంటనే ఫలితాలనీయవనీ, వారి వైఖరి వెంటనే మారకపోవచ్చ నీ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి కాని, విత్తనాలు నాటడం జరిగితే, అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలేజీచదు వులో విద్యార్థులు విలాసజీవితాన్ని చవిచూచినా, తర్వాత వృత్తిలో కష్టా ల్నీ, స్పర్థలని ఎదుర్కొంటున్నపుడు, తాము ఇదివరలో నేర్చుకొన్న విష యాలను గుర్తుకు తెచ్చుకొని, వాటి నుంచి సహాయం పొందవచ్చు. చిన్నతనంలోనే మనసులో వ్రేళ్లూ నిన జీవనసూత్రాలు తర్వాతికాలం లో పుష్పించి, వారిని మంచి పౌరు లు గానూ, మంచిమానవులు గానూ చేస్తాయి.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment