Saturday, 28 March 2026

 *మనము దేవుడిని, వెతికి కనుగొనలేము, మనము  (ప్రకృతిలో) కరిగిపోతే, ఉండేదంతా దైవమే.*

వ్యక్తిగతం పూర్ణత్వంను దర్శించలేదు. వ్యక్తిగతం నశిస్తేనే పూర్ణత్వం ప్రాప్తిస్తుంది.

ధ్యానం అంటే మంత్రోఛ్ఛారణ కాదు, మనసు ని, నిర్భంధించటం కాదు, నిశ్ఛలంగా ఎరుకతో మౌనంగా ఉండటం.

మనసుకి కొత్తదనం తెలియాలంటే, పాత జ్ఞాపకాల బరువును తొలగించుకోవాలి.

మనసే అన్వేషించమని, వెతకమని చెబుతుంది, మనసే వెతికే పని పెట్టుకొంటుంది, చైతన్యం ఎప్పుడు వెతకదు, స్వస్థితిలో ఉంటుంది.

జ్ఞాపకాలను నెమరువేయటం, ప్రతిదానికి ఉద్దేశాలు ఆపాదించటం, ఇది ఇలా అది అలా అనే అభిప్రాయాలు వెలిబుచ్చటం, బాధకు కారణం.

ఇతరుల వ్రాసిన శాస్త్రాలు, సిద్దాంతాలు, ఆలోచనలు, వాటిని పదే పదే వల్లించటం ద్వారా, మన మనసులు మత్తెక్కాయి. మనం వల్లించే వారుగా ఉంటున్నాము, ఇతరులు చెప్పిందే తిరిగి చెబుతున్నాం కానీ స్వతంత్రంగా ఆలోచించటం లేదు.

నమ్మకం అంటే, అసలు నీకు ఏమాత్రం తెలియని విషయాలపై, అభిప్రాయాలు, సమస్య పరిష్కారాలు ఐపోయాయి అని భావించటం.

మా ఆధ్యాత్మిక సంస్కృతి సిద్దాంతాలు, పిచ్చితనం అన్నా, మా పూర్వికులనే అనుసరిస్తాను, విదేశీ హింసా ఉపదేశకుల అబద్దాలు మాకు అవసరం లేదు.

మాయ అంటే ఏమిటి?, అల తాను సముద్రానికి వేరుగా ఉన్నానని భావించటం. నువ్వు పరమాత్మ ప్రకృతి కి, భిన్నంగా ఉన్నానని బావించటం.

ఈ శరీరాన్ని నేను అని చెప్పేదే అహంకారం, ఇదే భయం, కోరిక, బాధకు కారణం. ఈ శరీరాన్ని నేను, అనే ఆలోచన పోతే, శుద్ద చైతన్యావస్థలో ఉంటావు.

నాలుగు విషయాలు ఎప్పుడూ నిండవు, ఒకటి సముద్రం, రెండు స్మశానం, మూడు కోరికలు ఐపోవటం, నాలుగు మనిషి యొక్క మనసు తృప్తి పొందటం.

దేనికి ప్రతిస్పందించకుండా, (హృదయంలో సుఖదుఃఖ ద్వంద్వాలు కలగకుండా) జరిగే విషయాలకు ఇబ్బంది పడకుండా ఉండగలగటమే, ఆధ్యాత్మిక జీవితం.

No comments:

Post a Comment