Wednesday, 23 April 2025

 🙏🪷జై శ్రీరామ్ 🪷🙏

 "సుగుణం నిన్ను రాజును చేస్తే!
" మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది!

*🍁నీవు మనస్సుకు లొంగిన  క్షణాల్లో  నీవే రాక్షసుడవు.*
     *ఆ మనస్సు నీకు లొంగిన క్షణాల్లో నీవే దేవుడవు.*🍁
 
     🍃🍁 మంచి మాట 🍁🍃
•<>•<>•<>•<>•<>•<>•
      శాంతాన్ని మించిన తపస్సు లేదు,
  సంతోషానికి సమానమైన సుఖంలేదు.
    కోరికలను మించిన అనారోగ్యం లేదు,
         కరుణను మించిన ధనం లేదు.
      మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి 
           కూడా ఆరోగ్యంగా ఉంటాడు..
         మనసు ఆరోగ్యంగా ఉండాలంటే 
         గతాన్ని తక్కువగా ఆలోచించాలి
      భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి
                 అదే మానవ జీవితం.

:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
     🌸🌟🍁మంచి మాట 🍁🌟🌸
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
          ఉప్పుని కూరలో వేస్తే రుచిని
       ఇచ్చింది కదా అని పాలలో వేస్తే 
             పనికి రాకుండా చేస్తుంది
           పదార్థాన్ని బట్టి అవసరము 
     పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి
      కనుక మనమెంత  గొప్పవారిమైనా 
    మన అవసరం లేని దగ్గర మౌనంగా    
ఉన్నప్పుడే మన విలువ పెరుగుతుంది.   
   🌹✨🌹✨🌹✨🌹✨🌹✨🌹
        🪴🙏 *శుభోదయంతో*🙏🪴
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈

 *తప్పకుండా చదవాల్సిన గొప్ప నీతి కథ....*
*గొప్ప నీతి కథ..*

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.

*అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను 
చ* చ్చిపోతాను కదా!* కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. 

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా? 

నీ శరీరానికి *డయాబెటిస్* కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి *బీపీ* సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను. 

ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. 

*నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట*

అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. 

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? 

*ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?*

*నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం*?

నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే. 

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

*అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు*.  నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? 

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? 

*ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు*. 

ఇంకొకడిని అణగతొక్కడానికి  నాతో కుట్రలు చేయించావు. 

ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో. 

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? 
*ఇక నేనుండలేను వెళ్తున్నా!*

 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది. 
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు. 
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?
 కథ పేరు...

*ఒక్కసారి*ఆలోచించండి* !

*******************
"నమస్కారం సార్!"
తలెత్తి చూసాను. ఎదురుగా ఓ యువజంట.
"సార్! విడాకులుకు అప్ప్లై చేయాలని వచ్చాం. మీరు లాయర్ రావుగారే కదా!" 
నాకేసి చూస్తూ అడిగాడతను. 
చూస్తే చూడముచ్చటగా ఉన్నారనిపించింది.
"యస్! లాయర్ రావును నేనే. బై ది బై ఫ్యామిలీ కౌన్సిలర్ ని కూడా "

అంటూ 
వచ్చిన ఆ ఇద్దరినీ తేరిపారా చూశాను. 
ఇద్దరి వయసూ దాదాపు  ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య ఉండవచ్చేమో ?
ఆమె  ఎదురుగా కనిపిస్తున్న    గదిలోని గోడలను చూస్తోంది. అతను నాకేసి చూస్తున్నాడు.
నేను ఇద్దరినీ పరిశీలిస్తూ "ముందు కూర్చోండి !"అంటూ నా టేబుల్ కు ఎదురుగా ఉన్న కుర్చీలను చూపించాను.
"తన పక్కన కూర్చోను!" అంటూ అతను కుర్చీని కొంచెం దూరంగా జరిపి కూర్చున్నాడు.
"నాకు మాత్రం ఇష్టమా!" అంటూ ఆమె కూడా కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది.
ఇద్దరూ కోపంగానే ఉన్నారు.
సమానంగానే తగవు లాడుకుంటున్నారని అర్ధమైంది.
"అబ్బాయ్ !నీ పేరు?" అన్నాను.
"సుధీర్ సార్!" అన్నాడు.
"అమ్మాయి! మరి నీ పేరు ?"
"సరళ !సార్."
"పేర్లు కలిశాయి. చూస్తుంటే వయసు దగ్గరగానే కుదిరినట్లుంది. ఇంక దేనికి విడాకులు ?" ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.
"మనసులు కలవలేదు సార్!" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"మీది పెద్దలు కుదిర్చిన వివాహమా ?"
"కాదు ...లవ్ మ్యారేజ్ సార్!" సుధీర్ అన్నాడు.
"ప్రేమికులు దంపతులయ్యారు. కానీ దంపతులయ్యాకా ప్రేమ కొరవడిందా ?"
నా ప్రశ్నతో ఇద్దరూ నాకేసి విచిత్రంగా చూశారు.
"పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మనసులు కలిస్తే చాలు. ఇక వేరే కారణంతో పని లేదు. కానీ విడిపోవడానికి బలమైన కారణం ఉండాలి. ప్రేమించుకున్నప్పుడు కలిసిన మనసులు పెళ్లయ్యాక ఏమయ్యాయి ? సరే..ఇప్పుడు చెప్పండి. విడాకులు ఎందుకు కావాలంటున్నారు ?"
నేను సూటిగా అడగడంతో వాళ్లిద్దరూ ఒకేసారి...ఒకరి నొకరు వేలెత్తి చూపించు కుంటూ..."తనకు ఇగో, సార్ !"అన్నారు.
నాకు నవ్వొచ్చింది.
"ఎందుకు సార్ నవ్వారు ?" ఒక్కసారిగా ఇద్దరూ  నన్నడిగారు.
"ఏం లేదు. కలిసి ఉండలేమంటున్నారు. కానీ కలసి  సమాధానం ఒకటే చెప్పే సరికి నవ్వకుండా ఉండలేకపోయాను.
లేడీస్ ఫస్ట్ అంటారు. సరళ ముందు చెబుతుంది. సుధీర్ నువ్వు మాత్రం మధ్యలో అడ్డు రాకూడదు !" అంటూ సరళ వైపు  చెప్పమన్నట్టుగా చూశాను.
"ఆఫీసునుండి రాగానే హాల్లో సోఫాలో ఒరుగుతూ తను టి.వి.ముందు దర్జాగా కూర్చుంటాడు. నేను మాత్రం కిచెన్ రూమ్ లోకి వెళ్లి చెమటలు కార్చుకుంటూ వండి పెట్టాలి..
నేను కాఫీ కలిపిస్తే అతను హ్యాపీ గా సిప్ చేస్తాడు. ఖాళీ కప్పు కూడా సింక్ లో పడేయడు.
అటు ఆఫీసులో....ఇటు ఇంట్లో పని తప్పడం లేదు.
సుధీర్ తో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. కనీసం నాతో సమానంగా అతను పని చేయడా ?
ఈ కంజెస్టెడ్ జీవితం నాకు వద్దు. నాకూ చదువుంది. ఉద్యోగం ఉంది. అందం ఉంది. హోదా ఉంది. అన్నీ ఉండి కూడా పాతకాలపు ఇల్లాలుకు మల్లె ఉండాల్సిన ఖర్మ నాకేంటి ? నా పేరెంట్స్ 'నీ వెనుక  మేమున్నాం' అన్నారు. నో వే సార్.. ఐ వాంట్ డైవర్స్"
గుక్క తిప్పుకోకుండా మనసులో మాటలన్నీ ఏకరువు పెట్టింది.
"ఓకే! సరళ..సుధీర్! ఇప్పుడు నువ్వేమంటావ్?" అంటూ సుధీర్ వైపు చూశాను.
"సార్! తను నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అహంకారం. అందుకే నన్ను ఇంటి చాకిరీ పంచుకో మంటుంది. నేను మగాన్ని ...సింహంలా బతికాను. దర్జాగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తే  తప్పేంటి ? నాకంటే ఎక్కువ సంపాదిస్తోందని పనిలో ఇంటిపనిలో వాటా వేస్తే ఎలా?ఇలా అయితే రేపు కన్సీవ్ అయ్యాకా పదిలో సగం ఐదు నెలలు నన్ను మోయమంటుంది కూడా. ఎవరు చేసేపని వాళ్ళు చెయ్యాలి.
సమ విభజన కోసం సైన్స్ కే విరుద్ధంగా మాట్లాడుతుంది. అన్ని పనులూ చేస్తే ఆడంగి వాడంటారు..ఎప్పుడైనా పొరపాటున కాఫీ కలిపితే ఊరుకుంటారా ?బావుందంటారు. కిచెన్ రూమ్ లో వాటా పెడతారు. నువ్వు కూరలు తరుగు. నేను వంట చేస్తానంటారు. నువ్వు బియ్యం కడుగు. నేను కుక్కర్ పెడతానంటారు.
"మగాడివి, మహారాజులా ఉండు. భార్యకు బానిస కాకు" అని నా పేరెంట్స్ పెళ్లికి ముందే  చెప్పారు.
నాకు సరళకు సరిపడలేదు సార్! ఐ టూ వాంట్ డైవర్స్. సుధీర్ కూడా అంతే గట్టిగా చెప్పాడు.
ఇద్దరూ ఒకరికేసి ఒకరు కోపంగా చూసుకున్నారు.
"బిడ్డను కనడానికి  సర్రోగసి సిస్టం ఉంది తెలుసుకో" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"చూసారా సార్! అంటే తను కనలేనని ముందే షరతుగా చెప్పేస్తోంది. అమ్మ కావడం కన్నా, అందంపై మోజే మిన్న సార్ తనకూ. నాకు వద్దు సార్!"
సుధీర్ అన్నాడు ఆవేశంగా.
"ఏయ్! మిస్టర్! నేను మార్గం చెప్పాను. కానీ ఆ మార్గంలో వెడతానని అనలేదే.
మాటలను సరిగ్గా అర్ధం చేసుకోని మొండివానితో నేను వేగలేను సార్! నాకు అతనితో 
విడాకులు ఇప్పించండి. ప్లీజ్" సరళ బతిమాలే ధోరణిలో నా వైపు చూస్తూ చేతులెత్తింది.
"ఉష్ ...గొడవలు పెట్టుకునే వచ్చారు. మళ్లీ ఇక్కడ కూడా గొడవలా ?..మీరు సైలెంటుగా ఉంటేనే మాట్లాడుతా. నాకు టైం లేదు. మరో కేసు బయట సిద్ధంగా ఉంది. నా మాట వింటారా ? లేక వెళ్లిపోతారా ?" నేను గట్టిగా అడగడంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగారు.
తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది.
ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నేను అందుకున్నాను.
"చూడండీ! మీరిద్దరూ మాట్లాడారు. 
నేను విన్నాను. ఫ్యామిలీ కౌన్సిలర్ ని కదా. ముందు నా మాట కూడా మీరు వినాలి. 
ఆ పై మీ అభిప్రాయం. సరేనా!" అంటూ ఇద్దరికేసి చూశాను.
వాళ్ళు మళ్లీ ఒక్కటిగా "ఒకే సార్!" అన్నారు.
ఈసారి పైకి నవ్వు కనబడకుండా ...లోపల నవ్వుకున్నాను.
"అమ్మానాన్నా, తోబుట్టువులూ గాడ్స్ గిఫ్ట్...ఎలా ఉన్నా ఒప్పుకుంటాం. జీవితాంతం వారితో బావుంటాం. బాగానే చూస్తాం. కానీ భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి
చిన్న కారణానికే...అంటే  కుక్కర్ పొయ్యిమీద పెట్టలేదని, అడిగిన డిష్ చేయ లేదని, కూల్ డ్రింక్ తేలేదని, నేనంటే ప్రేమే లేదని, ఇలా సిల్లీ పాయింట్స్ నే సీరియస్ గా తీసుకుంటున్నారు. నచ్చలేదని జీవిత భాగస్వామిని వదులు కోవడానికి సిద్ధపడి పోతున్నారు..."
"సార్, అదీ..."సుధీర్ ఏదో చెప్పబోయాడు.
"ప్లీజ్...లెట్ మి టెల్ యూ" అనగానే చెప్పమన్నట్టుగా  మౌనం వహించాడు.
"అటుగాని, ఇటుగానీ, ఒకప్పుడు నచ్చచెప్పి కాపురానికి పంపించే పేరెంట్స్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.
అగ్ని కి ఆజ్యం పోస్తున్నట్లుగా 'విడిపోయినా నీకేం పర్వాలేదంటూ' భరోసా ఇస్తున్నారు.
అయినా వస్తువును సృష్టించ డానికి కష్టపడాలి గానీ, నాశనం చేయడం ఎంతసేపు ?నేలకేసి గట్టిగా కొట్టినంతసేపు పట్టదు.
అవునా ? కాదా ?" ఇద్దరినీ అడిగాను.
వాళ్లిద్దరూ బదులు ఇవ్వలేదు. నా మాటలు వింటున్నారని పించింది. ఆలోచనలో పడుతున్నారని అర్థమయ్యింది.
ఇదే సరైన సమయం అని భావించాను.
"ఆమెకు ఒంట్లో బాగో లేకపోతే కూర చేయాలా ? కర్రీ పాయింట్ నించి తెప్పించడానికి వర్రీ ఎందుకు ? అతనికి ఒంట్లో నలతగా ఉన్ననాడు ఈరోజు శనివారం...షికారుకు రా' అని పిలవడం దేనికి ? ఒక శనివారం పోతే, మరో  శనివారం రాదా? ఆరోగ్యమే  మహాభాగ్యం అని గుర్తించాలి కదా!..గొడవలు తవ్వుకుంటే ఇద్దరి మధ్య  పూడ్చలేని గొయ్యి మిగులుతుంది. కానీ సర్దుబాటు మొదలైతే సమాధానం దొరుకుతుంది. సఖ్యత పెరుగుతుంది. పరిష్కారం లభిస్తుంది. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన మొదలవుతుంది." అని ఆగి ఇద్దరికేసి చూసాను. మౌనంగా వింటున్నారు.
"కృష్ణ అని నా  ప్రాణ స్నేహితుడు, పెళ్ళైన కొత్తలో భార్యను బాగా చూసుకునే వాడు. భార్య ఎదురురానిదే బయటకు వెళ్లేవాడు కాదు. అయితే అతని వృత్తిపరమైన బాధ్యత, బాగా సంపాదించాలనే ఆత్రుతతో భార్యకు సమయం కేటాయించలేక పోయాడు. పోనుపోనూ డబ్బును ప్రధాన లక్ష్యం చేశాడు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. భార్య 'నన్ను భార్యగా చూడండి' అంటూ అభ్యర్ధించింది. కానీ కృష్ణ అందుకు సమయం లేదన్నాడు. మీరు నాకు సరి పడరంటూ, ఆమె కృష్ణనుండి విడాకులు తీసుకుంది.
కోల్పోయకా మనిషిని గుర్తుకు తెచ్చుకున్నట్లుగా, వెళ్ళిపోయాక కృష్ణకు భార్య విలువ తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె రెండో  జీవితం మొదలు పెట్టింది.
'సమయాన్ని సర్దుబాటు చేస్తే ఎంత బాగుండేదో ?' అని కృష్ణ బాధపడ్డాడు. కానీ ఆ బాధకు  ప్రయోజనం లేదు.
ఇతరుల పట్ల ఆకర్షణ, జీవిత భాగస్వామివద్ద నిరాదరణ, కారణాలు మొదట్లో చిన్నవిగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. గతంలోనూ ఇవి ఉన్నాయి.కానీ కుటుంబంలో పెద్దలు సర్ది చెప్పేవారు. విడాకుల వరకూ వెళ్లకుండా తిరిగి కలిపేవారు. ఇప్పుడు వాళ్ళూ వెనకేసు కొస్తున్నారు. గుమ్మానికి వాడిపోయిన మామిడాకులను తీసేసినంత సింపుల్ గా విడాకులను తీసుకోమంటున్నారు. పేరెంట్స్ సర్దిచెబితే.. కౌన్సిలర్ అవసరం దేనికి ?
ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరంటే మరొకరికి గౌరవం, సహకార భావన ఈ నాలుగూ దాంపత్యానికి పునాదులు. బీటలు వారితే వారిమధ్య సంబంధం సమాధి అవుతుంది. ఏ కాలంలోనైనా దాంపత్యానికి ప్రధాన సూత్రాలు రెండే రెండు. ఒకటి అర్ధం చేసుకోవడం. రెండు సర్దుకు పోవడం. సంపాదన కంటే సమయం గొప్పది. ఆ సమయాన్ని భార్యాభర్తలు కలసి సర్దుబాటు చేసుకుంటే అది  ర"సమయం" అవుతుంది. లేకపోతే విషమయానికి దారి తీస్తుంది.
విడిపోదాం, విడాకులు తీసుకుందాం అని వచ్చారు.అప్పుడు  ఆవేశం తప్ప ఆలోచన ఉండదు.
ఒక్కరోజు "కలిసుందాం" అని అనుకోండి. సర్దుబాటు మొదలవుతుంది. ఆలోచన ఆచరణ అవుతుంది.
అడవిలో పుట్టిన కవ్వం మనింటికి వస్తుంది. పాలతో బంధం ఏర్పర్చుకుంటుంది. సున్నితమైన వెన్నను ఇస్తుంది.ప్రాణం లేని వస్తువులే  ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రేమనే ప్రాణంగా చేసుకుని ఒక్కటయ్యారు.
ఒక్కసారి ఆలోచించండి ! 
విడిపోవడానికి కాదు, కలిసుండటానికి.
అప్పుడు రండి. మీరు కాదూ,  కూడదంటే  విడాకులు  ఇప్పించడం పెద్ద పని కాదు. నిర్ణయం మీదే. ఇప్పుడు దయజేయండి" అన్నాను.
నా మాట విన్నట్టుగా వాళ్ళు లేచారు.
"వస్తాం సార్!" అంటూ లేచారు.
"ఆవేశంతోనా ? 
ఆలోచనతోనా ? " అన్నాను నవ్వుతూ.
"ఆచరణతో సర్!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
ఈసారి "వెళ్లండి, కానీ రావద్దు" పైకి నవ్వుతూ అనేసాను.

ముందుకు వెడుతున్న సుధీర్ ఒక్కసారిగా ఆగి నా వైపు చూశాడు. 'ఎందుకు ?' అన్నట్లుగా చూసాను ?
"మాలో మార్పుకోసం ఎన్నో చెప్పారు. ఆలోచించుకోమంటూ సలహా ఇచ్చారు. మరి ప్రాణ స్నేహితుడు కృష్ణ విషయంలో మీరు ప్రయత్నం ఎందుకు చేయలేక పోయారు సార్ ?" అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ 
"నా అసలు పేరు కృష్ణా రావు. కానీ నన్ను అందరూ "రావు" అనే పిలుస్తారు!" అన్నాను.

"సారీ, సార్!" అంటూ సుధీర్ ముందుకు కదిలాడు. సరళ అతన్ని అనుసరించింది.
****************
అయిపోయింది
********
తెలుగుతల్లి ...కెనడా, అంతర్జాల మాస పత్రిక వారు, 2024 లో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఏప్రిల్ 2025, తెలుగుతల్లి కెనడా, మాస పత్రికలో ప్రచురితమైన కథ.
********
రచయిత.. కె.వి.లక్ష్మణరావు
మానేపల్లి
 *జానకీకారుణ్యం..🏕️ఇంటింటిరామాయణం* 
🕉️🌻🦚💎🌹💜🌈

 *🍁జానకీ..నీకు ఎన్నిసార్లు చెప్పనూ ఇంత నెయ్యి వెయ్యద్దు ఇడ్లీలమీద అని..నీకు మంచిది అనిపిస్తే చాలా నాకు తినాలనిపించద్దా..ఆ..అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య..* 

 *నెయ్యి బలమూ, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేనూ చెప్తూనే ఉంటా రోజూ మీకూ..* 
 *మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు నాకు తెలుసులెండీ* *మీ ఉపాయం అంది జానకి మూతి మూడువంకర్లు తిప్పుతూ..హబ్బా పల్లెటూరి పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు కారుణ్య* ..

 *అబ్బబ్బా మొద్దులా ఏంటీ ఈ అవతారం..ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా..కాస్త స్టయిలుగా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా, రెండుమూరల పూలొకటి అదనంగా..ఓ గులాబీ పువ్వు సింపులుగా పెట్టుకుంటే సరిపోతుంది, కళ్ళకు కాటుక, అమ్మోరులా ఇంతపెద్ద బొట్టూ..అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే..* 

 *నాన్నా అమ్మకి ఇష్టమైనట్టు తయారయ్యింది..ఆ మాత్రం స్వాతంత్రం లేదా అమ్మకి ..ఊ..అని నేటితరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది..* 

 *బాస్ ఇంట్లో షష్టిపూర్తి ఫంక్షను..సరదా సరదా పోటీలు జరుగుతున్నాయి...అచ్చతెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు...జానకి నెగ్గింది...అయిదుగ్రాముల బంగారు నాణెం, బాసు దంపతులు, జానకికి బహుకరించారు..* 

 *ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యని చూసి..సరే ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య...వచ్చేముందు జానకి బాసు భార్యకి ఒక బాక్సు ఇచ్చింది..ఆవిడ బాక్సు తీసి చూసి అబ్బో పూతరేకులు మీరే చేసారా అంది..అవునని తలూపింది జానకి..అరే నాకూ ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని ఆహా ఏమి రుచి బాగా చేసారు థాంక్యూ అన్నాడు..ఏనుగు అంబారీ ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి..ప్రేమగా జానకి చెయ్యిపట్టుకుని థాంక్స్ అన్నాడు నిజాయితీగా భార్యను మనసారా మెచ్చుకుంటూ..* 

 *కూతురుకి పెళ్ళయ్యింది...కొడుకుకీ పెళ్ళయ్యి కోడలొచ్చింది..కోడలు ఉద్యోగం, జానకి ఉండీలేని ఆరోగ్యం..ఇంట్లో కోపాలు, చిరాకులు షరా మామూలుగా..* 

 *జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్ధమయ్యింది కారుణ్యకి...కోడలుకి కూడా ఆఫీసు బాధ్యతలు, పైగా ఇంటిపనులు సరిగ్గా రావు..నిత్యం ఏదో ఒక గొడవే జానకికి, రూపిణికి..* 

 *ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా, భార్య నైసుగా లేదని పోల్చుకుని చిరాకుగా ఉండేవాడు కారుణ్య...రిటైరయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాని తనం చూసి..జానకి ప్రత్యేకత కారుణ్యకి అర్ధం అయ్యింది..* 

 *రూపిణికి పెళ్ళయ్యి నాలుగేళ్ళయినా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని జానకికి కోపం వస్తోంది..ఒకరోజు కొడుకు వంశీని, రూపిణిని నిలదీసింది..చూడండర్రా మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను, ఓపిక పొయ్యాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనపాలన కష్టం అవుతుందిగా మరి..అని..* 

 *రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు..ప్రమోషన్ వచ్చేలా ఉంది..ఇప్పుడు కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ వచ్చే చాన్సు ఎక్కువ, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్టు అయిపోతుందని రూపిణికి బాధ..* 

 *ఇంకో రెండేళ్ళకు రూపిణి శుభవార్త వినిపించింది...అంతే జానకి రూపిణికి సర్వ సపర్యలూ చేస్తోంది..అంతేలెండి నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీనూ, నేను మోసే యంత్రాన్ని కదా మరి అందుకే ఇన్నిరోజులూ లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడూ అని అంది రూపిణి బాధగా...అది కాదమ్మా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు..నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అనిబేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసిన కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది...పొద్దున్నే రూపిణికి దానిమ్మపండు గింజలు వలిచి ఇచ్చేది...లంచ్ బాక్సులోకి యాపిల్ ముక్కలొకరోజు జామకాయ ముక్కలొకరోజు ఇచ్చేది..సాయంత్రం రోజూ మొక్కజొన్నె తినిపించేది..రాత్రిపూట పెద్దగ్లాసు పాలు ఇచ్చేది ఓ నేతిచుక్క వేసి మరీ...* 

 *రూపిణి నిండుగా తయారయ్యింది..ఈ మధ్య రోజూ కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది జానకి...* 

 *ఆ రోజు సాయంత్రం జానకీ అంటూ ఇంకా టీ తేలేదేంటీ అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు...జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది...జానకీ అని నీళ్ళు మొహం మీద చల్లాడు..స్పృహలో లేదు జానకి..అయ్యో అనుకుని అంబులెన్సు పిలిచి హాస్పిటలుకి తీసుకెళ్ళారు జానకిని..* 

 *హార్ట్ అటాక్ మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని...ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి..తిండిలో కట్టుబాట్లు పనిచెయ్యటంలో ఆంక్షలు..ఇది చెయ్యొద్దు అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది జానకికి..* 

 *కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు...నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది..ఆ చేతిస్పర్శకి కారుణ్యకి అనిపించింది..మొన్నేమన్నా జరిగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా...తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా..పెళ్ళయ్యి ముప్ఫయేళ్ళు నాకు అంతగా నచ్చని నా భార్య ఈ రోజు ఇంత ముఖ్యం అనిపిస్తోందేంటీ...కాలంతో పాటూ బంధాల విలువ, బంధం తాలూకు అవసరం* *తెలిసొస్తాయన్నమాట...అనుకున్నాడు కారుణ్య...* 

 *సంవత్సరం తరువాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటోంది ..చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలాకిలా నవ్వుతోంది...* 

 *కొన్నిరోజులకి జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది..మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు..రూపిణి ప్రియని వాళ్ళ అమ్మదగ్గరికి పంపించెయ్యాలని అనుకుంటోంది..* 

 *జానకికి బెంగగా అనిపిస్తోంది..ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని..రూపిణీ మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా..నువ్వు ఉద్యోగం మానెయ్యగలవా..ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకి రూపిణి దగ్గర...చాలా టెన్షన్ అనిపించింది రూపిణికి..జాబ్ వదలటం ఇష్టం లేదు అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యాలనీ లేదు...ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది..మరి ఈ రోజు ఆవిడకి తన అవసరం ఉంది కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు..ఆర్ధికభద్రత, తనకంటూ ఒక హోదా ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపిణికి...* 

 *సాటి ఆడదాని బాధ అర్ధం చేసుకునే తత్వం సరయుది అని వదినకి ఫోన్ చేసి ఇదీ విషయం అని చెప్పి సలహా అడిగింది రూపిణి..తల్లి ఆరోగ్యం గురించి తనకీ తెలుసు సరయూకి...* 

 *పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మప్రేమ దూరమైతే తట్టుకోలేను ..సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది...భర్తతో మాట్లాడింది...తండ్రితో ఆలోచన చేసింది...* 

 *వారి ఊరిలో త్రీ స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరయు వాళ్ళు..భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేసారు సరయూ వాళ్ళు,* 
 *ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేసారు..* 

 *అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు...ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరయూ వాళ్ళకి...సరయు ఇంట్లో ఉండి జానకిని ప్రియని తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది...సరయు అత్తామామా తమ ఇద్దరి కొడుకుల దగ్గరా చెరో ఆరునెలలు ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు...సరయూ వాళ్ళ దగ్గర ఉండే ఆరునెలలు జానకికి, తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకురావటం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామే అయ్యేది అలాంటప్పుడు జానకికి చెప్పేది అమ్మా ప్రియ నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లీ అని..దానితో కొన్నిరోజులు జానకి కుదురుగా ఉండేది...కారుణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది... ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది...ఇంకో పదేళ్ళకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తోంది చెయ్యిచెయ్యీ కలుపుకుని....*

 *_🌹సేకరణ 🌹_* 

🕉️🌻🦚🌹💜💎🌈
 23/4/ వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే ప్రపంచ పుస్తక దినోత్సవం
విలియం షేక్స్పియర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో వరల్డ్ బుక్ డేగ ప్రకటించింది. షేక్స్పియర్ ఇంగ్లాండ్లో ఇదే రోజు 1564 లో జన్మించాడు 20వ ఏటా తనకంటే వయస్సులో పెద్దయిన యాని నీ వివాహం చేసుకున్నాడు షేక్స్పియర్ కు 15 వేల ఇంగ్లీష్ పదాలు తన నాటకాల్లో కవితల్లో పొందుపరిచాడు ఇంగ్లీషులో 37 నాటకాలు 154 కవితలు రాశాడు తన నాటకాల్లో ప్రపంచంలో ఎన్ని వృత్తులు గలవారు వారు ఉన్నారొఅన్ని రకాల పాత్రని సృష్టించాడు వినోదం కన్నా విషాదాంతమైన నాటకాలే అధికం మర్చంట్ ఆఫ్ వెన్ ఇస్ యు యు లైక్ ఇట్ కింగ్లీ నైట్ వొధ్లొలొమేక్ హమ్లెట్ మొదలైనవి ప్రముఖ 
నాటకాలు. షేక్స్పియర్ తాను పుట్టినరోజు మరణించడం ఒక వింత ఆయన మరణించిన సంవత్సరం ఏప్రిల్ 23 16 16 వ సంవత్సరం
 🍂💦😊 'సైంధవలవణం' 😊💦🍂
(ఇది నా రచన కాదు.. మీ కోసం ..నేను తెచ్చిన
...నవ్వుల నజరానాలో ప్రచురితమైన కథ.)
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
'' చూడండీ!..మీకిదే చెప్తున్నా..
నేను ఆ డాక్టర్ చెప్పిన పాపిష్టి తిళ్ళూ తినను,.అట్లాంటి డాక్టర్ చెప్పిన మందులూ మింగను. అసలు ఇంకోసారి నన్ను అలాంటి అస్తవ్యస్తపు డాక్టర్లు దగ్గరకి తీసుకువెళ్లారంటే నేను రమణమహర్షి ఆశ్రమానికి పోతా " ఇంటికి వస్తూనే విరుచుకుపడింది శాంతమ్మ గారు.
ఆ మాట అంటూనే హాల్లోనుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది ,మారుమాట్లాడే అవకాశం రామారావు గారికి ఇవ్వకుండా..
వంటింట్లోకి వెళ్లేముందు శాంతమ్మ గారు గుమ్మంలోనించే చెప్పులను కాళ్లతోనే డైరెక్ట్గా షూ రాక్ లోకి విసుగ్గా విసిరిన విసురు చూసి... మాంచి ప్రావీణ్యత గల ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టే విధానం గుర్తొఛ్చి...
కొంత దిగ్భ్రాంతికి మరింత భయ భ్రాంతికీ గురయ్యాడు రామారావు గారు.
వంటిట్లోకి వెళ్లిన శాంతమ్మగారు అదే విసురుని వంటింట్లోని పాత్రలపై ప్రదర్శిస్తున్నట్లుంది ,
'ఆకాశం నుండి స్టీలుగిన్నెల వర్షం పడుతోందా' ! అన్నట్లు శబ్దం రాసాగింది వంటింట్లోనుంచి.
ఈ హడావిడికి ..ఏంజరుగుతోందా అన్న ఖంగారుతో తన గదిలోంచి అమాంతం హాల్లోకి దూకాడు, వాళ్ళ అబ్బాయి కృష్ణ ..'ఉడికే ఉడికే బాండీ లోంచి బయటకు చిందిన కూరముక్క లాగా' .
"ఏమయ్యింది నాన్నా? " అడిగాడు ఆల్మోస్ట్ అచేతనావస్థలో నిలబడ్డ తండ్రిని కుదుపుతూ..
''ఏమయ్యిందా ? మొన్ననే 70 నిండి 71వ ఓవర్లోకి ప్రవేశించిందా మీ అమ్మ, టెండూల్కర్ లాగా డబల్ సెంచరీ కొట్టింది ,బీపీ లో .. 200 130 ఉన్నది .. ఆ డాక్టర్ ఒక పక్క అర్జెంటు గా మందులు మొదలుపెట్టమని మందులు రాసిస్తే ..వద్దంటే వద్దని నా రెక్కలు పట్టుకుని లాక్కొచ్చింది . అదేమంటే ఏమీ చెప్పకుండా ఆ డాక్టర్ ని తిట్టిపోస్తోంది .. మీ అమ్మ పెంకి తనానికి తోడు ఈ బీపీ ఒకటి , అసలే కోతి- ఆపై కల్లు తాగింది అన్నట్లుంది వ్యవహారం.." వాపోయారు రామారావు గారు
"మీరు నన్ను కోతి అనుకోండి,, పిల్లి అనుకోండి,.. కానీ ఆ డాక్టర్ పేరు నా ముందు ఎత్తకండి". వంటింట్లోనుంచి రివ్వున వస్తూ అన్నది రామారావుగారి మీద ఓ చెవి వేసుంచిన శాంతమ్మ గారు.
''ఏంటి నీ గోల శాంతం? అంత మంచి డాక్టర్ నీకెందుకు నచ్చలేదు అసలు?'' విసుక్కున్నారు రామారావు గారు.
ఓయబ్బో..కాపురం చేసే కళ కాలుతొక్కినప్పుడే బయటపడింది అన్నట్లు.. ఆయన ఎంత గొప్ప డాక్టరో బీపీ తగ్గడానికి ఆయన గారు చెప్పిన చచ్చు సలహా తోనే అర్ధమయ్యింది.. మీ ఫ్రెండ్ కొడుకని మీరేమో ఆయన దగ్గరికి తీసుకెళ్లడం.., ఆ మహానుభావుడేమో చిన్నంతరం పెద్దంతరం లేకుండా అడ్డమైన పాడు తిండ్లు తినమని చెప్పడం. ఎదో అభం శుభం తెలియని అమాయకులకు చెప్పినట్లు గా పాపం పుణ్యం ఎరిగిన నా బోటివాళ్ళకీ చెప్తే ఎట్లా అంట? అసలు నాకైతే అక్కడికక్కడే ఆ డాక్టరుని నాలుగు దులిపెయ్యాలనిపించింది కానీ ఎవరిపాపాన వారే పోతారని వదిలేసా . పోనీ మీ ఫ్రెండ్ కొడుకన్నారుగా, మీరైనా ఆ అబ్బాయిని '' పెద్దావిడని అలాంటి పాపిష్టి తిండ్లు తినమనడం ఏంట"ని మందలిస్తారేమో అంటే..తానా అంటే తందానా అంటూ ఆ డాక్టర్ చెప్పినదానికల్లా గంగిరెద్దు లాగా తల ఊపి వచ్చారాయె '' దెప్పిపొడిచింది శాంతమ్మ గారు.
"అంత చెప్పరాని సలహా ఏమి చెప్పాడమ్మా "ఆ డాక్టర్ ? అడిగాడు కృష్ణ..
''ఏమి చెప్తాడురా? మార్నింగ్ వాక్ చెయ్యమన్నాడు, పచ్చి కూరలు తినమన్నాడు, పచ్చళ్ళు, ఉప్పుకారాలు తగ్గించమన్నాడు. అందులో ఏమి తప్పుంది?'' అన్నారు రామారావు గారు.
'వాటన్నిటి గురించీ ఎవరేమన్నారు "
మరి ఇంకేంటి ?
" ఇంకేంటా..ఆ ఉప్పు విషయమే ..నాకు వళ్ళు మండుతున్నది."
"ఉప్పు ఏంటి. ?తగ్గించామన్నాడు అంతేగా ..హై బీపీ వఛ్చిన వాళ్ళని ఉప్పు తగ్గించమనక పూటకో బస్తా కంచంలో గుమ్మరించుకు తినమంటారా ?"
"ఆ మాత్రం ఉప్పు తగ్గించాలని నాకూ తెలుసు,, మా వంశం లో 5 తరాలనుండీ అందరికీ రక్తపోటు ఉందట ".
"ఆ విషయం ఇందాక నువ్వు వంటింట్లో గిన్నెలతో కధాకళీ ఆడించినప్పుడే అర్ధమయ్యిందిలే.. పైగా మీ పుట్టింట్లో అన్నీసొట్టలు పడ్డ బొచ్చలేగా ? అయినా అసలు ఆ డాక్టర్ చెప్పిన వేటితో సమస్య లేదన్నదానివి ఇందాకటినుండి ఎందుకా డాక్టర్ ని ఆడిపోసుకుంటున్నట్లు శాంతం ?
"ఎందుకేంటీ? మీరూ విన్నారుగా ? ఆ డాక్టర్ ఉప్పు తగ్గించమంటే పర్వాలేదు కానీ వాడే కొంచెమ్ ఉప్పు కూడా అదేదో దిక్కుమాలిన ఉప్పు వాడమనలేదూ? అది తలుచుకుంటేనే నా వళ్ళంతా జెర్రులు పాకినట్లుంది. అంది శాంతమ్మ గారు
"దిక్కుమాలిన ఉప్పా? నీ తలకాయ. ఆయన వాడమన్నది దిక్కుమాలిన ఉ ప్పుకాదు, దిక్పాలక ఉప్పు కాదు. దాని పేరు సైన్ధవలవనం . బీపీ వఛ్చిన వాళ్లకి ఆ ఉప్పు వాడితే మంచింది.అయినా వంశ పారంపర్యంగా బీపీ తెచుకున్నదానివి మీ వాళ్ళెవరూ సైన్ధవలవనం వాడటం తెలీదా నీకు?'' అడిగారు రామారావు గారు.
తాడంత ఎత్తున లేచింది ఆ మాటకి శాంతమ్మ గారు.
''ఛీ ఛీ , మా ఇంటా వంటా లేదు అలాంటి పాపిష్టి లవణాలు గివణాలూ తినడం. ఏమనుకున్నారో మా పుట్టింటి వాళ్లంటే .నేనెప్పుడూ అసలా పేరు కూడా వినలేదు. అయినా చీర తో పాటు జాకెట్టు, నెక్లెస్ తో పాటు దుద్దులు లాగా బీపీ తో పాటే సైన్ధవలవనం ఏమైనా సెట్ ఆ ఏంటి ? బీపీ వచ్చిన ప్రతివాళ్ళు అదీ తెచ్చుకు తిని తీరడానికి? "దబాయించింది శాంతమ్మ గారు.
"అదికాదు అమ్మా . బీపీ వచ్చినప్పుడు మాములు ఉప్పు మంచిది కాదు. అలా అని అస్సలు ఉప్పు మానేస్తే అసలుకే తిండి సహించక నీరసిస్తావు. 2 రోజులకన్నా ఎక్కువ ఆ చప్పటి తిండి తినలేవు . అదే సైన్ధవలవనం అయితే బీపీ ఎక్కువ పెంచదు, రుచీ మాములు ఉప్పు లానే ఉంటుంది '' నచ్చ్చచెప్పపోయాడు కృష్ణ ,
అబ్బా పోనిరా కృష్ణా.. బీపీ ఉంటె ఉండనీ.అదే ఓ పక్కన పడి ఉంటుంది. అంతేకానీ దానికోసం ఇప్పుడీ పాపిష్టి తిళ్లన్నీ తినలేనురా '' చెప్పింది శాంతమ్మ గారు.
''ఓ పక్కన పడి ఉండటానికి బీపీ ఎమన్నా రిటైర్ అయినా మొగుడు అనుకుంటున్నావా? వళ్ళంతా పీకి పాకాన పెడుతుంది.ఏమనుకుంటున్నావో? హెచ్చరించారు రామారావు గారు.
"అయినా అమ్మా... ఉప్పు మార్చినంత మాత్రాన అది పాపిష్టి తిండెలా అయిపోతుందమ్మా? నేనేమన్నా రేపటినుంచి దారికాచి కిడ్నాపులు, హత్యలు చేసి ఆ డబ్బుతో ఆ ఉప్పు కొంటానా? వాపోయాడు కృష్ణ.
"అదికాదురా కృష్ణా.. ఊహ తెలిసినప్పటి నుంచీ రామాయణ మహాభారతాలు చదివిస్తూ పెంచింది నన్ను మా బామ్మ. సంధ్యగొబ్బెమ్మ నోము నుండి మొన్నీమధ్య చేసిన లక్ష వ్రత్తుల నోము దాకా స్త్రీల వ్రతకథల పుస్తకంలో చెప్పిన నోములన్నీ చేసుకున్న దాన్ని నేను . పూజా పునస్కారం అవ్వకుండా పచ్చి గంగైనా ముట్టుకోను.
అలాంటిది ..ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు చేసుకున్న పుణ్యమంతా బూడిదపాలయ్యేట్లుగా నేనిప్పుడా సైన్ధవలవనం తినాలా? ఏం.. మాములు ఉప్పు తింటే ఇప్పుడే పోతానా? ఆ పాపిష్టి లవణం తింటే మాత్రం ఇంకో వందేళ్ళుంటానా ?" చిన్నబుచ్చుకున్నారు శాంతమ్మ గారు.
ఆవిడ తీరు అర్ధం కాక అయోమయంగా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు కృష్ణ రామారావు గారు.
" అది కాదు శాంతం..నువ్వు చెప్పిన నీ పుణ్యాల చిట్టా అంతా సరే గానీ సైన్ధవలవణానికి దానికీ ఏంటి సంబంధం?" అడిగారు రామారావు గారు.
బుగ్గలు నొక్కుకుంది శాంతమ్మ గారు. బోలెడంత ఆశ్చర్యం తో రామారావు గారిని చూస్తూ ...
"మీకింకా అర్ధం కాలేదా? నిజం గా ??"అడిగింది శాంతమ్మ గారు.
"నిజం శాంతం , ఒట్టు "అన్నారు రామారావు గారు.
"అయ్యో రామ!! "అంటూ తల బాదుకుంది శాంతమ్మ గారు.
"అందుకే.. నేను నెత్తీ నోరు బాదుకుని మరీ రోజూ చెప్పేది. ఈ వయసులోనైనా కొంచెం భక్తి, జ్ఞానం పెంచుకోండి. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన న్యూస్ ఛానెల్స్ చూడకుండా అప్పుడప్పుడూ పురాణప్రవచనాలు వినండి అని. వింటారా మీరు..చూసిన వార్తలే చూసీ చూసీ బట్టికొట్టడం, పనీ పాట లేని వాళ్ళు నలుగురు చర్చ పేరుతో టీవీలకు ఎక్కి కొట్టుకు చస్తుంటే వినోదం చూడటం, లేదంటే ఎవరెవరో ఆడిన ఆటలన్నీ రోజంతా కూర్చుని చూడటం.... ఇహ మీకేమి అర్ధమౌతుంది నా బాధ?
అయినా ఎదో సామెత చెప్పినట్లు నా పిచ్చి గానీ మీకు ఆ మాత్రం పురాణజ్ఞానం ఉంటే ఇందాకటినుండి నాకీ ఘోషంతా ఎందుకుండేది? అక్కడే ఆ డాక్టరుని మీరే
నాలుగు అక్షింతలేసి, "నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు" అని చెప్పే వారు కాదూ".. మొత్తుకుంది శాంతమ్మ గారు.
అటు తిరిగి ,ఇటు తిరిగి నా వార్తల మీద, స్పోర్ట్స్ మీద పడద్దులే కానీ... ఇంతకీ నీ పుణ్యానికీ ఆ సైన్ధవలవణానికి సంబంధం ఏంటో చెప్పి ఇంకొంచెం పుణ్యం కట్టుకో శాంతం . నీరసంగా అభ్యర్ధించారు రామారావు గారు.
"పుణ్యానికి కాదు పాపానికీ సైన్ధవలవణానికీ ఉంది సంబంధం. ఎంత పాపాత్ముడు ఆ సైన్ధవుడు ? మరి ఆ దుర్మార్గుడు సైన్ధవుడి లవణం తింటే పాపం రాదూ ? అయినా సైన్ధవుడి లవణాలు, జరాసంధుడి లవణాలు తిని మహా పాపం మూట కట్టుకోవాల్సిన అగత్యం ఏంటి నాకు ?మనం తినే ఆహారమే మనం ఏంటో నిర్ణయిస్తుంది అంటారు కదా.. ఇప్పుడు నేను ఆ రాక్షస వెధవ లవణం తిని వాడి లాగా రాక్షసి బుధ్ధులు తెచ్చుకుని అధోగతి పాలవ్వాలంటారా?
అయినా బీపీ తగ్గించడానికి ఆ డాక్టరుకి ఆ ముదనష్టపు సైన్ధవుడే దొరికాడా... కావాలంటే ఏ ధర్మరాజు లవణమో భీష్ముడి లవణమో ఇవ్వమనండి .. శుభ్రంగా తింటాను ''
ఉపోద్ఘాతం మొదలు పెట్టిన అరగంటకి అసలు వార్త మొదలుపెట్టే 24 గంటల వార్తా ఛానల్ న్యూస్ రీడర్ లాగా ఇప్పటికి అసలు విషయం బయటపెట్టింది శాంతమ్మ గారు
శాంతమ్మ గారి మాటలు విని ఒక్క నిమిషం మెదడు తిమ్మిరెక్కినట్లయింది రామారావు గారికి, ...
కృష్ణకైతే ఎముకల లోపల మజ్జలో ఎవరో దురదగుంటాకు పూసినట్లయ్యింది... ఎలా గోక్కుంటే ఆ దురద తగ్గుతుందో తెలియని అయోమయ అచేతనావస్థలో పడిపోయాడు కృష్ణ.
శాంతమ్మ గారితో ఇలాంటి విష'యాల్లో ఎక్కువ అనుభవం ఉన్న రామారావు గారే ముందు తేరుకున్నారు .
మెదడు తిమ్మిరి విదిలించి వదిలించుకోవడానికా అన్నట్లు తలని గట్టిగా పైకి, కిందికి ఊపుతూ పగలబడి నవ్వసాగారు . ఆలస్యంగా తెలివిలోకి వఛ్చిన కృష్ణకీ నవ్వు ఆగలేదు.
"ఓసి నీ ఇల్లు బంగారం కానూ.. అదా నీ గోల ఇందాకటినుంచీ.. సైన్ధవ లవణం అంటే మహాభారతం లో సైన్ధవుడికి సంబంధించిన లవణం అనుకున్నావా !! వాడేమన్నా సముద్రమా వాడి నుంచి ఆ ఉప్పు తయారవడానికి ? మనిషి. మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు సైన్ధవుడికీ ,సైన్ధవ లవణానికీ సంబంధం ఏంటే శాంతం ,, నీ తలకాయ కాకపోతే.." కడుపు పట్టుకు మరీ నవ్వసాగారు రామారావు గారు.
నిర్లక్ష్యంగా రామారావు గారి వైపు " మీ బొంద"అన్నట్లు ఒక చూపు విసిరి, భర్త కనుక మరీ డైరెక్ట్ గా ఆ మాట అనలేక ఓ నిట్టూర్పు విడిచి ,,ఇలా సెలవిచ్చింది శాంతమ్మ గారు.
"నా తలకాయా లేదు, మెడకాయా లేదు...ఎదో ఒక సంబంధం లేకపోతే ఆ లవణానికి అసలు వాడి పేరు ఎందుకు పెడతారు? ఇప్పుడూ... విదురుడు చెప్పిన నీతులకి విదుర నీతులనీ ,యక్షుడు వేసిన ప్రశ్నలకి యక్ష ప్రశ్నలనీ పేరు లేదూ..అలాగే... ఇదేదో ఆ సైన్ధవుడికి సంబంధించిన లవణమే అయ్యి ఉంటుంది. అందుకే ఆ పేరు.
అయినా చెల్లెలు వరస అయిన ద్రౌపదీ దేవిని చెరచడానికి చూసిన వాడు, ముక్కు పచ్చ లారని అభిమన్యుడి చావుకి కారణమైన వాడూ...అటువంటి ఆ సైన్ధవుడి ఉప్పు తినమన్న ఆ డాక్టరుని చెప్పుతో కొట్టాలి "... ఆగ్రహోదగ్రురాలయ్యింది శాంతమ్మ గారు..
బీపీ వలన ఆవిడకి ఆవేశం పెరుగుతోందని గ్రహించిన కృష్ణ కాసేపు ఆ విషయం పై వాదన వదిలెయ్యమన్నట్లు రామారావు గారికి కనుసైగ చేసాడు. సరే అని మౌనం దాల్చారు రామ రావు గారు.
వంటింట్లో వంట చేస్తూ ఉన్న శాంతమ్మ గారి కోడలు రుక్మిణికి హాల్లో అత్తా మామ భర్తల సంభాషణలో కొంతే వినబడింది. మిగిలినదంతా మిక్సీ కుక్కర్ ల శబ్దాలలో కలిసిపోయింది. తాను విన్నదాని ప్రకారం అత్తగారికి మాములు ఉప్పు పనికిరాదని అదేదో సైన్ధవలవణమనే కొత్త ఉప్పు వాడాలనీ మాత్రమే అర్ధమైంది రుక్మిణికి..
"మరి తెచ్చ్చారా ఆ సైన్ధవలవణమేదో..ఇస్తే అత్తయ్యగారికి విడిగా తీసిన పప్పు కూరల్లో కలిపేస్తా " అంటూ హాల్లోకి దూసుకొచ్చింది.
అప్పుడే శాంతమ్మ గారి ఆవేశం తగ్గిద్దామని ఓపక్క తమ నోళ్ళని పాకింగ్ పూర్తయ్యిన బస్తాల లాగా గట్టిగా కట్టేసుకు కూర్చుంటే..రుక్మిణి వలన మళ్ళీచర్చ మొదలై రచ్చ జరుగుతుందని భయపడ్డాడు కృష్ణ..
ఆ సైన్ధవలవణం విషయం మాట్లాడ వద్దనీ , అక్కడినుండి వెళ్లిపొమ్మనీ అర్ధం వచ్చేట్లుగా కళ్ళతో, నోటితో, చేతితో ,ముక్కుతో.. రకాలుగా సైగలు చేసాడు. కృష్ణ కూచిపూడి డాన్సర్ లెవెల్లో సర్వాంగాల్నీ సర్వదిశలకీ తిప్పి ఎంత అభినయించినా, రుక్మిణి కృష్ణ వైపు కన్నెత్తైనా చూడకుండా ద్రోణాచార్యుడి పరీక్షలో పాల్గొంటున్న అర్జునుడిలా లక్ష్యం మీదే ధ్యాస పెట్టి ..
" తెచ్చారా ఆ సైన్ధవ లవణం" అంది మళ్ళీ .
పళ్ళు బిగబట్టి, బండ గొంతుతో "లేదు, తేలేదు" అన్నాడు కృష్ణ..
తనలోని డాన్సర్ ని గుర్తించక పోయినా కనీసం తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ నైనా రుక్మిణి గుర్తిస్తుందేమో.. తన గొంతులోని తేడా గుర్తించి తన వైపు తిరిగితే మళ్ళీ సైగలు చేసి తరిమేద్దాం అన్న ఆశతో..
ఆడ అర్జునుడి అపర అవతారమైన రుక్మిణి దృష్టి మాత్రం చెట్టుమీద పక్షి కంటి నుండి...అదే సైన్ధవ లవణం నుండి ఏ మాత్రం చెదరలేదు.. తన ధోరణి కంటిన్యూ చేస్తూ అడిగింది..
''అయ్యో తేలేదా? పోనీ కిరణ్ ని పంపించి తెప్పిస్తాను,ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఆ సైన్ధవలవణం?''
"కురుక్షేత్రం లో... పోయి తెచ్చుకో " అన్నాడు కృష్ణ ..వళ్ళు మండిపోయి..
అప్పటిదాకా ఎదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న శాంతమ్మగారు కృష్ణ మాట విన గానే ఎదో స్ఫూరించినట్లు ..రెండు చేతులు చరుస్తూ అదీ సంగతి అన్నారు..
రామారావు గారి వైపు తిరిగి చూపుడు వేలు గాలిలో ఊపుతూ.. చూసారా.. నా బాధ తెలిసిన భగవంతుడు నా కొడుకు నోటిద్వారానే నాకు క్లూ ఇప్పించాడు .
ఏమిటీ....నీరసంగా అడిగారు కొడుకు సైగల వాల్ల భార్యతో వాదించే అవకాశం కోల్పోయిన రామారావు గారు.
మీరే విన్నారుగా.. సైన్ధవ లవణం ఎక్కడ దొరుకుతుంది అంటే కురుక్షేత్రం లో అన్న కృష్ణ మాట.. అదే నిజం. కురుక్షేత్రంలో సైన్ధవుడిని అర్జునుడు చంపేసాక , అంత పాపాత్ముడికి కూడా అంత్యక్రియ లు ఎందుకని వదిలేసి ఉంటారు.. వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపి మందు గా తయారు చేసుంటాడు ఆ కాలపు అతితెలివి అప్రాచ్యపు డాక్టర్ ఎవడో.. అదే సైన్ధవ లవణం .. తత్త్వం బోధించిన లెవెల్ లో తేల్చి చెప్పారు శాంతమ్మ గారికి...
ఐన్స్టీన్ కైనా అర్ధం కానీ , అనితర సాధ్యమైనట్టి ఆవిడ సమన్వయం కలిగించిన అయోమయానికి గుడ్లు తేలేసారు కృష్ణ, రామారావు గారు. తలకి ఎటువైపు నుండి మొదలు పెట్టి జుట్టు పీక్కుంటే ఎక్కువ రిలీఫ్ గా ఉంటుందో అన్న ఆలోచనలో నిమగ్నమయిపోయారు.
ఇంతలోకి .."అవునా అత్తయ్య గారూ, సైన్ధవుడు , అంత చెడ్డవాడా? "
అంటూ ధర్మసందేహాలు కార్యక్రమం మొదలుపెట్టింది పురాణాల్లో పాస్ మార్క్ జ్ఞానం కూడా లేని రుక్మిణి...
కోడలు ఇచ్చిన ఆ ప్రోత్సాహానికి ఇక తనని ఆపడం ఎవరి తరమూ కానంత స్థాయి కి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు..నిత్యానంద స్వామి లెవెల్లో ప్రవచనం కొనసాగించింది.
"అవును రుక్మిణీ ! ఆ సైన్ధవ సన్నాసి చెల్లెలు వరుస స్త్రీని చెడు దృష్టితో చూడడమే కాకుండా అభిమన్యుడి మరణానికి కూడా కారకుడయ్యాడు.
నువ్వు చూసావుగా ఈ మధ్య మాయాబజార్ సినిమా కలర్ లో ..ఎంత ముచ్చటగా
ఉన్నారు నాగేశ్వర రావు ,సావిత్రీ..అభిమన్యుడు, శశిరేఖలుగా.. వాళ్ళిద్దరి పెళ్ళికి కృష్ణ భగవానుడు ఎన్ని పాట్లు పడతాడూ? అంతా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సైన్ధవుడి వలన కదూ...కాళ్ళ పారాణి ఆరక ముందే అభిమన్యుడు పోయి , శశిరేఖకి అన్యాయం జరిగిపోయింది??
మొన్నీ మధ్యే నర్తనశాల సినిమా కూడా చూపించా గుర్తుందా నీకు? అందులో శోభన్ బాబు.., అదే అభిమన్యుడు... ఉత్తర ని పెళ్లాడతాడు గుర్తుందా..పాపం ఆ ఉత్తర అయితే కడుపుతో ఉంటుంది అభిమన్యుడు పోయేప్పటికి.అంటూ కళ్లు తుడుచుకుంది శాంతమ్మ గారు.
అత్తగారు చెప్పింది అంతా విన్నాక ...ఇంతకీ సైన్ధవుడి వలన చనిపోయింది నాగేశ్వర రావో, లేక శోభన్ బాబో అర్ధం కాలేదు రుక్మిణికి.
కానీ సైన్ధవుడి వలన సావిత్రికి కష్టం కలిగింది అన్న మాట బాగా బుర్రకెక్కించుకుంది రుక్మిణి. అసలే మహానటి సినిమా చూసినప్పటినుంచీ సావిత్రి కి వీర ఘోర అభిమాని అయిపొయింది రుక్మిణి. ఎంత అభిమానము అంటే వెబ్ ఛానెల్ లో ఆ సినిమా ప్రతిరోజు చూసీ చూసీ పట్టలేనంత ప్రేరణ పొందేసింది. తాను కూడా సావిత్రిలాగా చీరలమ్మి పేదలకు సహాయం చెయ్యాలని బీరువాలో 2 చీరలని పట్టుకు బయలుదేరింది. ఎలాగొ అది పసికట్టిన కృష్ణ, వెయ్యి రూపాయిలు పెట్టి కొని వెయ్యిసార్లు కట్టిన ఆ ఇమిటేషన్ పట్టు చీరలను భార్య వీధిన పెట్టకుండా ఆపి ,కుటుంబం పరువు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఇలాగె వదిలేస్తే,, తనని జెమిని గణేశన్ లాగ 4 పెళ్లిళ్లు చేసుకోమనో,,, లేక రోజు ఇంటికొస్తూ తనకోసం ఒక మందు బాటిల్ తెమ్మనో అంటుందన్న భయం తో రుక్మిణికి తెలియకుండా ఆ వెబ్ ఛానెల్ ఆన్ సబ్స్క్రయిబ్ చేసేసాడు. అయినా అప్పటికే తలకెక్కిన సావిత్రీ వీరా భిమానం మాత్రం ఎక్కడికీ పోలేదు రుక్మిణిలో .అందుకే అత్తగారు చెప్పిన అంత కథలో సావిత్రీ అన్న పేరొక్కటే వినిపించుకుంది.
"వద్దత్తయ్య గారూ..వద్దు. సావిత్రిని అంత క్షోభ పెట్టిన సైన్ధవుడిని మీరసలు క్షమించొద్దు, వాడి ఉప్పే కాదు, వాడికి సంబంధించిన ఏ వస్తువూ ఇంట్లోకి రానీయద్దు''..అంటూ ముక్కు చీదుకుంటూ ,కళ్ళు ఒత్తుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించింది.
రుక్మిణి చేసిన సావిత్రి హడావిడికి శాంతమ్మ గారూ నివ్వెర పోయారు..
తనను మించి పోయిన కోడలి పురాణభాష్యం ఆవిడకీ అర్ధం కాక హతాశులై మౌనంగా కోడలు వెళ్లిన వైపే చూస్తుండిపోయారు.
భార్య మౌనం గా ఉండటం చూసి ఆవిడ మెత్తబడిందని అపార్ధం చేసుకున్న రామారావు గారు ఇదే అదను అనుకుని మళ్ళీ రంగంలోకి దిగారు.
సహజంగా ఎవరైనా మరెవరినైనా దేనికైనా ఒప్పించాలంటే సామదానభేద దండోపాయాలను అదే వరుసక్రమంలో వాడతారు.. కానీ లోకంలో చాలా మంది భర్తలు భార్యని దేనికైనా ఒప్పించాలంటే ఆక్రమంలో రారు. అరబిక్ వ్రాస్తున్నట్లు వ్యతిరేక దిశలో మొదలు పెడతారు. మొదట అధికారం ఉపయోగించి భయపెట్టే దండోపాయంతో మొదలై.. ఆవిడ మొండికెత్తిన కొద్దీ మొదటికొస్తారన్నమాట. అందుకే చివరికి బ్రతిమిలాట లోకి దిగారు రామారావు గారు..
'శాంతీ "...అని గోముగా పిలిచారు.. ఆవిడను ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతంలో పిలిచే పిలుపది
కొడుకు ముందు అలా పిలిచేసరికి ఆవిడకి చిరాకుతో చిర్రెత్తిపోయింది.
శాంతీ లేదు, వాంతీ లేదు...
ఇంకేం మాట్లాడకండి అసలు. మీ మాటలతో నాకు భ్రాంతి కలిగించాలని చూడకండి , నాకసలు ఏ డాక్టర్లు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. , అంటూ అక్కడినుంచి చివ్వున లేచి తన గదిలోకి పోయి డాంమని తలుపేసుకుంది.
ఎలెక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధిలా ...,వరల్డ్కప్ ఫైనల్ లో డక్ అవుట్ అయిన కెప్టెన్ లా.. దిగాలుగా మొహాలు పెట్టుకు కూర్చున్నారు కృష్ణ, రామారావు గార్లు.
ఇప్పుడేం చెయ్యాలి కృష్ణా.. దిక్కుతోచక దీనంగా అడిగారు రామారావు గారు.
ఏమో నాన్నా.. ఆ సైన్ధవలవణం ఏమో కానీ దాన్ని మూలంగా ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడను..ఇంకే డాక్టర్ కీ చూపించుకోను అని మొండికెత్తింది అమ్మ , ఓ పక్క బీపీ ఏమో అంత ఎక్కువగా ఉంది. ఏంచెయ్యాలో ఏంటో...
అవునురా.. వెనకటికెవరో "అల్లం అంటే నాకు తెలీదా.బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడుట,అట్లా వుంది మీ అమ్మ తెలివి. విసుక్కున్నారు రామారావు గారు.
ష్..ఊరుకోండి నాన్న.. అమ్మకి వినబడిందంటే మళ్ళీ కోపం తెచ్సుకుంటుంది..అసలే బీపీ . ఎదో ఒకటి ఆలోచిద్దాంలెండి. మీరు దిగులుపడకండి...అభ్యర్ధించాడు కృష్ణ.
తల కొట్టుకుని, గొణుక్కుంటూ ఉండిపోయారు రామారావు గారు
ప్రక్క గదిలో చదువుకుంటున్న కృష్ణ కొడుకు కిరణ్ ఈ సంభాషణ అంతా విన్నాడు. వింటూనే ఓ పక్క గూగుల్ లో సెర్చ్ చేసాడు. ఏం చదివాడో ఏం చూశాడో మరి ..
బామ్మ హాల్ లోంచి వెళ్లిపోయిందని గమనించి....మెల్లిగా హాల్ లోకి వచ్చి తండ్రినీ , తాతయ్యనీ బయటకు రమ్మని సైగ చేసాడు. ముగ్గురూ ఎదో మాట్లాడుకున్నారు.
సాయంత్రం..వస్తూనే బామ్మా బామ్మా,,నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ వచ్చాడు కిరణ్.. చేతిలో ఉన్న ప్యాకెట్ చూపిస్తూ...
ఏంటిరా అంటూ వచ్చారు శాంతమ్మ గారు..
ఇదా .. హిమాలయన్ సాల్ట్ బామ్మా.. మధ్యాహ్నం ఆ సైన్ధవలవణం గురించి నువ్వు పడ్డ బాధ అంతా విన్నా బామ్మా.. నాకూ నీ మాటే నిజం అనిపించింది. అందుకే వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నా గారు ఒక మంచి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరకి వెళ్ళా . ఆయన కూడా నీలాగా ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు. నీలాంటి పుణ్యాత్ములు అంటే ఆయనకు చాలా గౌరవం . ఆయన కూడా నీ మాటే నిజం అన్నారు.అసలు నీలాంటి వాళ్లకి ఆయనైతే ఆ సైన్ధవలవణమే ప్రిస్క్రైబ్ చెయ్యరట. నీ లాంటి భక్తుల కోసం ఎందరో ఋషులు హిమాలయాల్లో తపస్సు చేసిన హిమాలయన్ సాల్ట్ ఉందట. అది సైన్ధవలవణం కన్నా బాగా పని చేస్తుందట, పైగా అది ఋషులు తపస్సుతో సృష్టించింది కనుక తింటే పుణ్యం కూడా. చెప్పాడు కిరణ్.
పొంగిపోయింది శాంతమ్మ గారు.. మా నాయనే మా తండ్రే.. నన్ను అర్ధం చేసుకునేది నువ్వేరా నాయనా. మీ తాతయ్యకి నా గోడు తలకెక్కితే కదా.. ఆ అయ్య కుచే మీ నాన్నానూ. ఇద్దరూ కలిసి ఆ పాపిష్టి సైన్ధవలవణం తినమని నన్ను కాల్చుకు తిన్నారనుకో.. కంప్లైంట్ చేసింది శాంతమ్మ గారు.
పోనీలే బామ్మా,, నేనున్నానుగా , దిగులుపడకు, ఇంకో విషయం. నిన్ను చూసిన డాక్టర్ గారు ఆ సైన్ధవలవణం ఒక్కటే తప్పు చెప్పాడు కానీ మిగిలిన మందులు అన్నీ కరెక్టే రాసాడుట. ఈ పూట నుండే మందులు మొదలు పెట్టమని చెప్పారు ఈ డాక్టర్గారు .చెప్పాడు కిరణ్.
తప్పకుండారా నా బంగారు తండ్రీ.. అంత మంచి డాక్టర్ చెప్పాక ఇంకా నేను ఎందుకు కాదంటాను..అంటూ సంబర పడిపోయింది శాంతమ్మ గారు.
*****
డాక్టర్ చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించడం తో త్వరలోనే బీపీ కంట్రోల్ అయిపోయి, ఆరోగ్యం గా ప్రశాంతం గా అయిపొయింది శాంతమ్మ గారు.
హిమాలయాల్లో ఋషుల తపస్సు తో సృష్టించిన హిమాలయన్ సాల్ట్ మహిమే తప్ప మనుషులు చేసిన మందులకు ఇంత ప్రభావం ఉండదని మనసారా నమ్ముతోంది. మనవడికి తన పై ఉన్న ప్రేమని తలచుకుని తలచుకుని మురిసిపోతోంది.
నెల తర్వాత ఒకరోజు ఆవిడ భాగవతం చదువుకుంటుంటే.. వచ్చి ఒళ్ళో పడుకున్నాడు కిరణ్. ప్రేమ గా తల నిమిరింది శాంతమ్మ గారు.
"బామ్మా నీ బీపీ తగ్గిపోయిందిగా" అన్నాడు కిరణ్..
"అవునురా" అంది శాంతమ్మ గారు.
"ఆ హిమాలయన్ సాల్ట్ తింటే నీకేమి ఇబ్బంది లేదుగా. నువ్వు భయపడ్డావుగా ..సైన్ధవలవణం తింటే నువ్వు కూడా సైన్ధవుడి లాగ అయిపోతావని ..అలాంటి మార్పులేం రాలేదుగా" ..అడిగాడు కిరణ్.
"చక్కగా మన కోసం హిమాలయాల్లో తపస్సు చేసి ఋషులు సృష్టించిన ఉప్పు తింటే సైన్ధవుడి గుణాలు ఎందుకొస్తాయిరా... నిజానికి ఈ ఉప్పు తినడం మొదలు పెట్టాక నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటోంది. మీ తాతయ్య తిక్క చేష్టలని కూడా కోపం లేకుండా ఓర్చుకోగలుగుతున్నాను " అన్నారు శాంతమ్మ గారు. (" నీ మొహం, అది మందులు వాడి బీపీ తగ్గించుకోవడం వల్ల , ఉప్పు వల్ల, పప్పు వల్ల కాదు "అనుకున్నారు చాటు నుండి వింటున్న రామారావు గారు. )
"బామ్మా.. నీకో విషయంచెప్తే కోప్పడవుగా" గారంగా అడిగాడు కిరణ్.
"పిచ్చి తండ్రీ. నీ మీద నాకు కోపమేంటిరా?చెప్పు "..అన్నారు శాంతమ్మ గారు.
"నిజానికి సైన్ధవ లవణం అన్నా హిమాలయన్ సాల్ట్ అన్నా ఒకటే బామ్మా".. చెప్పాడు కిరణ్..
"హదేంటిరా...? "నివ్వెరపోయింది శాంతమ్మ గారు.
"అవును బామ్మా, హిమాలయాల దగ్గరలో సింధు నది తీరా ప్రాంతం లో దొరుకుతుంది సైన్ధవలవణం. దాన్నే ఇంగ్లీషులో హిమాలయన్ సాల్ట్ అంటారు. సింధు నది ప్రాంతంలో దొరుకుతుంది కనుక సైన్ధవ లవణం అన్నారు కానీ దానికీ భారతంలో సైన్ధవుడికీ ఏమీ సంబంధం లేదు". అన్నాడు కిరణ్
:"నిజామాట్రా ?" ..ఆశర్యపోయారు శాంతమ్మగారు.
"అవును బామ్మా .. ఆ రోజు నువ్వు సైన్ధవలవణం మూలంగా మందులే వాడనంటే భయం వేసి ఇలా చెప్పాల్సొచ్చింది. నీకు అబధం చెప్పినందుకు క్షమించు బామ్మా.".
"హారి గడుగ్గాయి, మీ నాన్నకి కృష్ణ అని పేరు పెడితే ఆ కృష్ణ మాయంతా నీకు అబ్బింది రా. నేను క్షమించడం ఏమిటిరా వెర్రి సన్నాసి. మిమ్మల్నందరినీ ఖంగారు పెట్టినందుకు మేరె నన్ను క్షమించాలి. అయినా నీ అంత తెలివి, నేర్పు మీ తాతయ్యకి ఉంటే నేను ఆయన మాటా విందును." అన్నది శాంతమ్మ గారు.
"ఆహా.. మనవడి తెలివితేటలన్నీ తాత నుండి వచ్చేవేలేవోయ్"..అంటూ నవ్వుతూ చాటునుండి వచ్చారు రామారావు గారు, ఆయన వెనకే కృష్ణా..
"అమ్మయ్య !అయితే ..ఈ ఉప్పుకీ సావిత్రి ని ఏడిపించిన సైన్ధవుడికీ ఏమి సంబంధం లేదన్నమాట" అంటూ రుక్మిణీ వచ్చింది.
నవ్వులు నిండిన ఆ లోగిలి లో ఆనందాల హరివిల్లులు విరిశాయి.
🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊
****** See less
 *ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు...*

*జ్ఞాన సాగర భాండాగారం...!!*

అక్షర ముక్కల్ని అందంగా
దాచుకున్న  ప్రియా నేస్తం
మస్తిష్కానికి నుంచి మనసుకు
అల్లుకున్న అక్షరాల పద బృందం...

రాత గాడి రాతలను 
భావితరాల అందించిన అక్షరనిధి
విజ్ఞానాన్ని వినయంగా నింపుకొని
విశ్వమంతా విస్తరించిన ఆకాశం...

అక్షర ముత్యాల అపురూపంగా
దాచుకున్న నేలపైన రత్న గర్భం
సమస్తాన్ని జ్ఞానాన్ని నింపుకున్న
విశ్వంలో ప్రవాహ జ్ఞాన సాగరం....

ప్రాచీన నుండి ఆధునిక వరకు
కాలపు మైలురాళ్ళ చరిత్రకు నిదర్శనం
శాస్త్రాన్ని సాంకేతికతను ముడి వేసి
విజ్ఞాన సర్వస్వాన్ని అందించే ప్రయోగం...

గ్రంథమే విశ్వమంతా వ్యాపించి
అజ్ఞానపు మూఢత్వము తొలగించే
మస్తిష్కపు మట్టిలో పుష్పించే 
ప్రపంచమంతా వ్యాపించిన వట వృక్షం...

కాగితపు పొలములో
అక్షరాలను పండించిన క్షేత్రం
పదం వాక్యంలో పరవశించి ప్రవహించే
నాగరికత పరిమళాల నదీ ప్రవాహం..

ప్రపంచాన్ని కన్నులతో చూడకున్నా
అరచేతిలోనే దర్శింప చేసే దర్పణం
ఒంటరితనాన్ని దూరం చేసే
ఎల్లప్పుడూ తోడు నిలిచే ఆత్మబంధువు..

దగ్గరగా ఉండే ప్రియ నేస్తం
ఎల్లప్పుడూ తోడు ఉండే బంధం
నా ప్రియ మస్తిష్కపు వికాసం
సమస్త లోకాలకు జ్ఞాన అమృత భాండం..

కొప్పుల ప్రసాద్


జై తల సద్గురు ప్రభు మహారాజ్ కి జై గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో కర్మకు సంబంధించినటువంటి రెండు విషయాలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్మ కర్మల యొక్క ఫలానుభవాలు వాటి మీద మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మామూలుగా లౌకికంగా వ్యవహారిక జీవన విధానంలో మనం పరిశీలించినట్లయితే ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేశారు అనుకోండి వాళ్లకి ఎవరు శిక్ష విధిస్తారు అని ఒక క్వశ్చన్ వేసాం అనుకోండి మామూలుగా ఈ లోకంలో ఎవరైనా తప్పు చేశారు అనుకో అమ్మ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని ఇతను తప్పు చేశాడు అని తెలిస్తే ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తే తెలుస్తుంది ఏం చేస్తారు వెంటనే ఒక రక్షక పట్టులు వచ్చి అతన్ని తీసుకువెళ్లి అరెస్ట్ చేసి ఒకచోట స్టోర్ చేస్తారు హోల్డ్ చేస్తారు తర్వాత కోర్టుకు తీసుకువెళ్లి అక్కడ న్యాయ విచారణ జరిపిస్తారు న్యాయ విచారణ జరిగిన తర్వాత ఒక శిక్ష అనేటువంటిది అతను చేసినటువంటి పొరపాటుకు గాని తప్పుకు గాని ఒక శిక్ష అనేటువంటిది నిర్ణయిస్తారు ఆ శిక్ష నిర్ణయించిన తర్వాత ఈ యొక్క రక్షక పట వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు వాళ్ళు అతని తోటి ఆ శిక్షను అనుభవింప చేస్తారు ఇది మన అందరికీ అనుభవంలో ఉన్నటువంటి సత్యం ఇది మనందరికీ తెలుసు తప్పు చేసిన వాడిని పోలీసులు తీసుకెళ్తారు కోర్టుకి తీసుకెళ్తారు శిక్ష వేస్తారు శిక్ష అనుభవింప చేస్తారు ఇది మనందరికీ తెలిసిందే అయితే కొంతమంది తప్పు చేసింది కనపడదు ఇప్పుడు గుర్తిస్తేనే కదా అతను ఇప్పుడు ఫలానా వాళ్ళు తప్పు చేశారు అనుకో అమ్మా అతను తప్పు చేసింది గుర్తించితే శిక్ష అనేటువంటిది ఉంటది మరి తప్పు చేసింది తెలియకపోతే ఎవరు శిక్ష విధిస్తారు ఎలా శిక్ష విధిస్తారు ఏ కోర్టు అయినా గాని ఏ రాజ్యాంగం అయినా గాని అతను తప్పు చేస్తే తెలిస్తేనే కదా శిక్ష విధించేది ఇంకోటి ఈ తప్పు చేయటాల్లో కూడా కర్మలు చేసేటువంటి అంటే దుష్కర్మల్లో కూడా వ్యక్తమయ్యేటువంటివి కొన్ని అవ్యక్తంగా చేయబడేటువంటివి కొన్ని అంటే కొన్ని బయటకు కనపడేవి ఉంటాయి కొన్ని బయటకు కనపడకుండా ఉండేటువంటివి కూడా కొన్ని ఉంటాయి అయితే బయటికి కనపడేటువంటి వాటికి ఐడెంటిఫై చేస్తే వీళ్ళు శిక్ష విధించగలుగుతారు ఇవాళ బయటికి కనపడలేదు అనుకోండి గుప్తంగా ఉందనుకోండి ఒకవేళ ఫేక్ అంటే మోసం చేసి గాని అట్లా వాళ్ళు గొప్ప వాళ్ళుగా చలామణి అయితే మాత్రం మరి వాళ్ళకి శిక్ష ఉంటదా ఇప్పుడు చాలా మందిని మనం ఈ ప్రపంచంలో ఎంతో మందిని చూస్తున్నాం ఎంతో మంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్లూయన్స్ ను ఉపయోగించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ కోర్టులో గాని ఏ చట్టాలు గాని ఏమి చేయలేకపోతున్నాయి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నాయి తప్పు చేసినటువంటి వాళ్ళందరూ కూడా కోట్లు కోట్లు మోసం చేసినా గాని బాజాప్తాగా కారుల్లో తిరుగుతున్నారు ఏసీ కారుల్లో తిరుగుతున్నారు చిన్న చిన్న పొరపాట్లు చేసినటువంటి వాళ్ళు పిక్ పాకెటర్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు శిక్ష అనుభవిస్తున్నారు అసలు చేసినోళ్ళు ఏమి లేదు పెద్ద పెద్దవి చేసినటువంటి వాళ్ళు చెప్తారు కదా బిగ్ షాట్స్ ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే బిగ్ షాట్స్ అంటే అందరికీ భయంగానే ఉన్నారు వాళ్ళు కూడా భయపడుతూనే ఉన్నారు అన్నమాట వాళ్ళు ఏదైనా అనాలంటే కూడా ఇలా ఉన్నటువంటి వ్యవహారిక జీవన విధానంలో మన మధ్యన మన వాట్సాప్ లోనే ఒక మెసేజ్ వచ్చింది నేను అది చూశాను అన్నమాట మీరు కూడా చూసే ఉంటారు అయినా గాని అందరికీ ఒకసారి గుర్తు చేద్దాం అని నాకు అనిపించింది అన్నమాట ఎందుకంటే శిక్ష విధించేటువంటిది ఎవరు అంటే మనకు తెలిసిన పరిధిలో వీళ్ళే అనుకుంటాం ఇంతటితో అయిపోయింది అనుకుంటాం అది కాదన్నమాట ఇంతటితో అయిపోయేటువంటిది కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏదైనా కర్మ ఫలం అనుకూలంగా లేదు అనుకో సో ఉద్యోగం రాలేదు వాళ్లకు వ్యాపారం సాగట్లేదు పంట పండట్లేదు ఆరోగ్యం సరిగా లేదు ఇలా ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకో వెంటనే చాలా మంది ఏం చేస్తారు ఒక పండిట్ ని సంప్రదిస్తారు ఒక ఆస్ట్రాలజిస్ట్ ని సంప్రదిస్తారు ఒక ఆస్ట్రాలజిస్ట్ ని సంప్రదిస్తే ఆస్ట్రాలజిస్ట్ ఏమంటాడు అంటే ఒక జ్యోతిష్యుడు ఏమంటాడు నేను మీకు ఉద్యోగం తెప్పిస్తా అంటాడు మీ అబ్బాయికి పెళ్లి చేస్తా అంటాడు అమ్మ మీ అమ్మాయికి సంతానం అందేట్లు నేను చేస్తా అంటాడు మీకు ఆరోగ్యం నేను సెట్ చేస్తా అంటాడు మీ అప్పులు నేను తీరుస్తా అంటాడు ఆయన తీరుస్తారా మన అప్పులు ఆయన అప్పులు తీర్చేటట్టు అయితే అందరూ అక్కడికే వెళ్తారు వీళ్ళ అప్పులన్నీ ఆయన తీర్చేటట్టు అయితే అక్కడికే వెళ్తారు అంటే ఏమనుకుంటారు అందరూ కూడా జ్యోతిష్యుడు ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు అని చెప్పి వెళ్తారు ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి జ్యోతిష్యుడు యొక్క మాట్లాడేటువంటి విధానం కూడా అలాగే ఉంటది అన్నమాట ఇక అమ్మయ్య ఇంకా అమ్మయ్య మన అబ్బాయి పెళ్లి అయిపోయినట్టే మన అబ్బాయి పెళ్లి అయిపోయింది మన అమ్మాయికి ఉద్యోగం ఉంచినట్టే అమ్మాయి నా మోకాళ్ళ నొప్పి తగ్గినట్టే నా మోకాళ్ళ నొప్పి ఆపులన్నీ తీరినట్టే ఎందుకంటే ఆయన ఆ హామీ ఇచ్చిండు ఆయన హామీ ఇచ్చిండు 40 రోజులు చాలు నాకు ఎక్కువ రోజులు వద్దు 40 రోజులు చాలు 40 రోజుల్లో మీరు కేల్ ఖతం దుకాన్ మీరు అంతా పర్ఫెక్ట్ గా ఉంటారు అని చెప్పిండు అయితే మరి దాని కోసం చాలా ప్రాసెస్ ఉంటది వాళ్ళ దగ్గర చాలా ప్రాసెస్ అయితే ఎంతమందికి సక్సెస్ అవుతది ఎంతమందికి సక్సెస్ అవుతది ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇంకోటి ఒకాయనకి ఆరోగ్యం బాలేదు హుటా హుట్టిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఆయన ముందే చెప్పిండు మా దగ్గర చాలా సౌండ్ ఎక్కువ ఉంది ఫైనాన్షియల్ గా మేము చాలా సౌండ్ చేయగలం ఎంతైనా పర్వాలేదు ఆయన తిరిగి ఇంటికి రావాలి ఎంత సౌండ్ అయినా మేము భరించగలం ఆయన మాత్రం ఇంటికి రావాలి అని చెప్పిండు అయితే ఆయన డాక్టర్ అన్నాడు నేను గ్యారెంటీ ఇస్తున్నా ఆయన ప్రాణానికి నాది గ్యారెంటీ అర్థమైందా మూడు రోజుల్లో ఇంటికి పోవచ్చు మూడు రోజుల్లో ఇంటికి తెస్తా పోవచ్చు ఈయన హామీ ఇచ్చాడు డాక్టర్ గారు ఆ జ్యోతిష్యుడు నేను తగ్గిస్తా అంటుండు డాక్టరు నేను తగ్గిస్తా వీళ్ళిద్దరూ ఒక జ్యోతిష్యుడు ఒక డాక్టర్ ఇలా తగ్గిస్తా అంటే పైన ఒకాయన ఉన్నాడంట ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు వీళ్ళు అనేదాన్ని వీళ్ళు అనేదాన్ని నవ్వుకుంటూ ఉన్నాడు ఆయనకి ఎందుకు నవ్వు వస్తుంది ఎందుకంటే మొత్తం వీళ్ళ కంట్రోల్ లోనే ఉన్నట్టు ఈ అంటే ఈ ప్రపంచం మొత్తం లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క కర్మ ఫలాలన్నీ కూడా వీడి చేతిలో పెట్టినట్టు ఆయన ఆ అర్థమైందా ఈయనకి ఏమన్నా అది ఇచ్చినట్టు పవర్ ఆఫ్ అటార్మీ అంటారు కదమ్మా ఈ హక్కులు ఇచ్చినట్టు ఈయనకు ఫీల్ అవుతాయి ఈ డాక్టర్ అంతే ఫీల్ అవుతున్నాడు ఆ ఆస్ట్రాలజిస్ట్ కూడా అంతే ఫీల్ అవుతాడు అన్నమాట ఆయనకు నవ్వు వస్తుంది అన్నమాట నేను అసలు వీడికి రాసినే రాసియలే నేను అసలు వీడికి హక్కులు రాసినే రాసియలే బజార్ కి ఒక్కడు దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు ఈ ఆఫీసులు పెట్టుకొని కూర్చున్నారు నా దగ్గరే హక్కులు ఉన్నాయి నేను ఇక్కడ మంత్రం చదివితే నీకు అక్కడ రిజర్వేషన్ కన్ఫర్మ్ రిజర్వేషన్ బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పి చదువుతూ ఉంటారు అన్నమాట నేను ఎంత చెప్తే అంత నేను ఎంత అంటే అంత అని చెప్పి అంటూ ఉంటారు ఇది నిజం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇది నిజం కాదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు పరమాత్మ చెప్తున్నాడు ఎందుకంటే మనల్ని పుట్టించింది ఈయన కాదు మనల్ని పుట్టించిన వాడు ఎవరైతే ఉన్నారో మనల్ని పోషించే వారు ఎవరైతే ఉన్నారో మనతో ఈ కర్మ అనుభవింప చేసేది కూడా వారే వారే మనతోటి కర్మ అనుభవింప చేస్తున్నారు పుట్టించిన వాడు పోషించేవాడు మనతో కర్మ అనుభవించే అనుభవింప చేసేవాడు ముగ్గురు ఒక్కరే అర్థమైందా అమ్మ మనకి ఏడవ అధ్యాయంలో కూడా చెప్తారు అన్నమాట వేదాహం సమతీతాని వర్తమానం చార్జన అంటే నీ యొక్క గతం గూర్చి నాకు తెలుసు నీ యొక్క వర్తమానం గూర్చి కూడా నాకే తెలుసు నీ యొక్క భవిష్యత్తు గూర్చి కూడా నాకే తెలుసు ఇంకెవరికీ తెలియదు ఈ ప్రపంచంలో నీ యొక్క గతం గూర్చి నాకు తెలుసు వర్తమానం గూర్చి నాకు తెలుసు నీ యొక్క భవిష్యత్తు గూర్చి కూడా నాకు తెలుసు నాకంటే ఇంకెవరికీ ఎక్కువ తెలియదు కూడా నాకంటే ఇంకా ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో గాని నాకంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు కాబట్టి నువ్వు ఎవరు చెప్పినా నువ్వు నమ్మొద్దు నేను చెప్పిందే నమ్ము నేను చెప్పిందే నమ్ము ఎందుకంటే ఎవరికైనా ఏదైనా కర్మ ఫలాన్ని ఇచ్చి అనుభవింప చేసేటువంటి ఆ డిసైడింగ్ పవర్ ఏదైతే ఉన్నదో ఆ డిసైడింగ్ పవర్ నాకు ఉంది ఆ డిసైడింగ్ పవర్ నాకు ఉంది తప్ప ఇంకెవరికీ లేదు ఎవరైనా ఏదైనా చెబితే మీరు నమ్మి మోసపోవద్దు నమ్మి మోసపోవద్దు చెప్తున్నారు అంటే కొన్ని మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత ఇప్పటికి సంబంధించినటువంటి కర్మ విధానమే మనకు తెలుసు అర్థమైందా అమ్మ చాలా మంది నేను పుట్టిన తర్వాత పాపం చేయలేదని అంటాడు నేను ఏ తప్పు చేయలేదని అంటాడు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోతే మనకు అలాంటి కర్మ అనుభవించేటువంటి పరిస్థితి ఉండదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పు మన పూర్వీకులు మనకు అర్థం కావడం కోసం అలాంటి పదం ఉపయోగాలు చేశారు సపోజ్ ఉదాహరణకు అమ్మ అందరం ఒక పదం వాడతాం ఒకాయనకి యాక్సిడెంట్ అయింది ఒకాయనకి యాక్సిడెంట్ అయ్యో పాపం అంటాం ఒకాయనకి నష్టం వచ్చింది అయ్యో పాపం ఒకాయనకి ఉద్యోగం పోయింది అయ్యో పాపం ఆయనకు ఉద్యోగం పోయిందా అయ్యయ్యో అయ్యో పాపం అంటాం అంటే అయ్యో పుణ్యం ఆయనకు ఉద్యోగం పోయింది అని అనరు ఉద్యోగం వచ్చింది అనుకోండి అయ్యో పుణ్యం ఆయనకు ఉద్యోగం వచ్చింది అంటారా యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అంటాం కానీ అయ్యో పుణ్యం అని అనటంలే ఎక్కడ అలాంటి పద ప్రయోగం చేయటంలే పుణ్యం అనే పదాన్ని వాడే సందర్భాలు రావట్లేదు మనకి పాపం అనే పదాన్ని వాడుతూ ఉన్నాం ఎందుకు వాడికి యాక్సిడెంట్ ఎందుకైంది పాపం అయ్యో పాపం అంటాం మనందరం పాపం వాడు చేసిన పాపమే యాక్సిడెంట్ అయింది వాడు చేసిన పాపమే వాడి కాలు ఇరిగింది వాడు చేసిన పాపమే వాడికి నష్టం వచ్చింది అందరం వాడతామా వాడమా పాపం అని వాడతాం కానీ పాపం అనే పదం ఇలా వాడుతున్నాం అనేది అందరికీ తెలియదు అయ్యో పాపం అంటాం కానీ పాపమే వీడు అనుభవిస్తున్నాడు అని మనం అనుకోము అన్నమాట తెలీదు అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం మన గురువు గారు చెప్పారు కాబట్టి మనకు తెలిసింది లేకపోతే మనకి కూడా తెలియదు మనం కూడా చల్తిగా అడిగి కొట్టుకొని పోతూ ఉంటాం అన్నమాట మనకైనా గురువుగారు చెప్పారు కాబట్టి తెలియబడింది అయ్యో పాపం అని అంటాం అంటే ఏంటంటే అయ్యో పాపం అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాడు పాపాన్ని అనుభవిస్తున్నాడు వాడు పాపాన్ని అనుభవిస్తున్నాడు ఎప్పుడు చేశాడో దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు నో ప్రాబ్లం అనుభవించాల్సింది ఎంతైతే ఉందో అది కచ్చితంగా ఆయన అనుభవింప చేస్తాడు కచ్చితంగా ఆయన అనుభవింప చేస్తాడు రెమిడీస్ ఉండవా రెమిడీస్ ఉండవా అంటే కొన్నిటికి రెమిడీస్ ఉంటాయి కొన్నిటికి రెమిడీస్ ఉండవు కచ్చితంగా కొన్ని అనుభవించవలసిందే ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఇందాక చెప్పా కదా మన ఫౌండేషన్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చిందని చెప్పా కదా మీరు కూడా చదివే ఉంటారు నాకు మంచిగా అనిపించింది అన్నమాట అది చదివితే దాన్ని గుర్తు చేసుకోవడం ఇంతకుముందు రంగనాథ్ మిశ్రా రంగనాథ్ మిశ్రా అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీం కోర్టు జడ్జి గా పని చేశారు మన భారతదేశంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారిలో రంగనాథ్ మిశ్రా అనేటువంటి వారు ఒకరు ఉన్నారు ఆయన గారు ఒకసారి ఒరిస్సా వెళ్ళారు పూరి పూరి వెళ్లారన్నమాట పూరిలో ఒక లా కాలేజీలో ఒక ఫంక్షన్ ఉంటే దానికి ఇతన్ని ముఖ్య అతిథిగా మెయిన్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారన్నమాట ఈయన ప్రధాన న్యాయమూర్తి కాబట్టి లా కాలేజీలో జరిగేటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈయన గారిని అక్కడికి ఇన్వైట్ చేస్తే ఆ ప్రోగ్రాం కి వెళ్లారు అక్కడ రెండు రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ముందు రోజు పూరి వెళ్ళినప్పుడు మరి దర్శించుకోవాలిగా జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు కదమ్మా పుణ్యక్షేత్రం కదా టైం ఉంది కదా అని చెప్పి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు జగన్నాథ స్వామిని దర్శించుకున్న తర్వాత రిటర్న్ లో వచ్చేటప్పుడు రిటర్న్ లో వచ్చేటప్పుడు ఒక స్వరం వినిపించింది రంగనాథ బాబు గారు అని రంగనాథ బాబు గారు రంగనాథ్ బాబు గారు అని ఒకాయన పిలుస్తూ ఉన్నారు వెనక నుంచి వెనక నుంచి ఎవరో పిలుస్తూ ఉన్నారు ఇలా వెనక తిరిగి చూశాడు ఎవరబ్బా నన్ను పిలిచేది ఇక్కడ ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ లో నన్ను పిలిచే వాళ్ళు ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక కుష్టు వ్యాధి పేషెంట్ కనిపించారు ఎవరు కనిపించారు కుష్టు వ్యాధి పేషెంట్ కనిపించారు ఆయన ఈయన వెనక్కి తిరిగి చూడగానే ఆయన ఏమంటుండు ఆ రంగనాథ్ బాబు గారు నన్ను గుర్తుపట్టారా అంటుండు రంగనాథ్ బాబు గారు నన్ను గుర్తుపట్టారా అంటుండు ఈయన దగ్గరికి వెళ్తాడు నువ్వు నువ్వు ఎవరో నేను గుర్తుపట్టలేదయ్యా నువ్వు ఎవరో నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు నిన్ను పోల్చుకోలేకపోతున్నా నేను నేను చూసే ఉంటా మరి నా జీవితంలో ఎంతో మందితో పరిచయం ఉంది నిన్ను కూడా చూసే ఉంటా కానీ నేను మర్చిపోయా అని అంటాడు నన్ను మామూలుగా మర్చిపోవడం కాదు నా పరిచయం నీకు మామూలుది కాదు మన ఇద్దరి పరిచయం చాలా ఎక్కువగానే ఉండేది మీరు గుర్తించలేకపోతున్నారు ఇప్పుడు నేను గుర్తు చేస్తా అంటాడు ఎవరు నువ్వు ఏంటి నీ కథ ఏంటి అని అంటే అప్పుడు చెప్తాను మీరు ఇంతకుముందు వరిసాలో ఇంతకుముందు మీరు వరిసాలో లాయర్ గా లాయర్ గా మీరు పని చేశారు మీరు వరిసాలో లాయర్ గా పని చేసి ఉన్నటువంటి రోజుల్లో నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కులియా డాకు కులియా డాకు అనేటువంటి ఒక బందిపోటు దొంగని బందిపోటు దొంగ నేను ఎంతో మందిని హింసించి ఎంతో ధనాన్ని నేను కొల్లగొట్టి ఎన్నో తప్పులు చేస్తే అలా నేను నేను చేసినటువంటి అన్ని తప్పులను నువ్వే కాచి నన్ను రక్షించి ఎక్కడ ఏ కోర్టు ఎక్కడా కూడా నాకు శిక్ష పడకుండా నన్ను ప్రొటెక్ట్ చేశారు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నాడు మీకు ఇప్పుడు ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది నువ్వు కులియా డాకా ఇట్లా అయినవే రా అంటాడు మరి అప్పుడు కింగ్ లా ఉండేవాడు ఇప్పుడు కుష్టు వ్యాధి వచ్చి గుడి మెట్ల మీద అడుక్కుంటాడు గుడి మెట్ల మీద అడుక్కుంటాడు ఏయ్ ఇట్లా అయినవే రా నువ్వు నేను గుర్తుపట్లేదు నిన్ను పోల్చుకోలేదు అంటాడు నేను నిన్ను పోల్చుకోలేదు అంటే వాడు వాడు ఎన్నో తప్పులు చేస్తే వాడిని రక్షించింది నేనే రక్షించింది ఈయనే ఇప్పుడు వాడు మరి ఆ వాడు ఇంతకు ముందు ఎలా వెలిగాడు ఆ ఎన్నో కార్లు ఎంతో మంది వాడి దగ్గర బ్యాక్ గ్రౌండ్ ఉండేది ఎంతో మంది బ్యాక్ గ్రౌండ్ ఉండేది వాడి కింద పని చేసేటువంటిది సేవా గణం అన్నమాట ఎంతో మంది ఫైనాన్షియల్ గా చాలా ఫిట్ గా ఉండేటువంటి వాడు బలంగా ఉండేవాడు ఎంతో పవర్ ఉపయోగించేటువంటి వాడు మరి పొలిటిషియన్స్ ఏ భయపడేటువంటి వాడు ఆయన పేరు వింటే అలాంటి వ్యక్తి ఇలా తయారు కావడం ఏంటి అని చెప్పి ఈయన అనుకున్నాడు ఓ నువ్వా అనుకున్నాడు ఎక్కువ సేపు మాట్లాడటం ఈయనకి ఇష్టం లేదు ఆయనతో ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు సరే భగవంతుడు నిన్ను అనుగ్రహించాలి అని చెప్పి ఒక మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఫంక్షన్ లోకి వస్తారు అన్నమాట లా కాలేజీలో జరిగేటువంటి ఫంక్షన్ లో ఇతనికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తారు అన్నమాట ఎందుకంటే అంటే నేను గతంలో లాయర్ గా పని చేసినప్పుడు నా యొక్క చాకశక్యంతో వాడిని రక్షించా నా తెలివితోటి వాడిని రక్షించా కానీ వాడికి శిక్ష పడకుండా నేను మాత్రమే చేయగలిగా కానీ ఆయన ఉన్నాడే ఈ కోర్టు కాదు అసలు ఆ పైన ఇంకో కోర్టు ఉంది ఆ కోర్టులో ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే అక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఇతను ఎంతో గొప్పగా జీవించాడు ఎందుకంటే తన యొక్క ధనంతో గాని ఇన్ఫ్లూయన్స్ తో గాని తెలివితో గాని ఎన్నో తప్పులు చేసి కూడా మంచివాడుగా చలామణి అవుతూ అలా జీవించినటువంటి వ్యక్తిని ఆయన శిక్షించాడు ఎలా శిక్షించాడు అంటే తినడానికి తిండి లేక నడవడానికి శరీరం సహకరించక పాకుంటూ వెళ్ళాడు ఫుడ్ కోసం ఊర్లో జనమంతా ఎలగొట్టారు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా నువ్వు కుష్టు వ్యాధి వచ్చింది ఈ ఊర్లో ఉంటే మా అందరికీ ఇబ్బంది జరుగుద్ది ఈ ఊర్లో ఉండొద్దు అని చెప్పి ఊర్లో నుంచి వెళ్లగొడితే వెళ్లగొడితే పూరి వచ్చి పూరిలో బ్రతికాడు గుడి మెట్లకాడ గుడి చుట్టూ తిరుగుతూ ఎవరైనా పెడితే తింటూ ఏమీ లేకపోతే ఎన్ని రోజులు పస్తున్నాడో ఎన్ని ఇబ్బందులు అనుభవించాడో అని చెప్పడం అనేటువంటిది ప్రాక్టికల్ అన్నమాట ఈ విషయాన్ని అక్కడ ఆయన చెప్పాడు అన్నమాట రంగనాథ్ మిశ్రా గారు ఆ యొక్క ఫంక్షన్ లో తెలియజేస్తారు అంటే ఏంటి అర్థం ఈ ప్రపంచంలో మనం ఏదైనా కర్మ చేస్తే తప్పు చేస్తే ఈ లోకం చూడకపోవచ్చు ఈ లోకంలో ఉన్న జనానికి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది ఎందుకంటే మనందరినీ శిక్షించేవాడు ఒకడు ఉన్నాడు రక్షించేవాడు ఆయనే శిక్షించేవాడు ఆయనే ఎందుకంటే మనం భక్తితో వేడుకుంటే భక్తితో వేడుకుంటే ప్రహ్లాదున్ని ధ్రువున్ని లేకపోతే అనేకమైనటువంటి భక్తాదులందరిని రక్షించినటువంటి ఏ దైవం అయితే ఉన్నాడో ఆ దైవమే తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు అంటే తప్పు చేసిన వాళ్ళందరం కర్మ అనుభవించవలసిందే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా గుర్తు చేసుకోవచ్చు ఎందుకు మనకు చెప్తారు పెద్దలు నవ్వుతూ చేసినటువంటి పాపం ఏడుస్తూ అనుభవించాలి అని చెప్తారు ఎందుకంటే గర్వంతో గాని అహంకారంతో గాని అజ్ఞానంతో చేయబడినటువంటి కర్మలకు ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించవలసిందే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మనం ఎప్పుడు చదువుకుంటాం బుర్హన్ గారు రాశారు గర్వమతుల గానవే గర్వమతుల గానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నుచును గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నుచును నిర్రనేల్గుచు మెర్రి చూపును వెర్రితనమున చూడబోకు మానసా నీ వినవే భూతముల చట్టమేమో గనవే చెప్పారు అంటే వాళ్ళు మహారాజుల్లా జీవించారు ఈరోజు ఈ లోకంలో దుర్యోధనుడు గాని వీళ్ళందరూ శిశుపాలుడు వీళ్ళందరూ గొప్ప స్థాయిలోనే జీవించారు కానీ వినాశాన్ని పొందారు ఎందుకు వాళ్ళు చేయబడినటువంటి కర్మ ఫలాలు అలాంటి దుస్థితిని వాళ్లకు కలిగించింది మనకి ఎగ్జాంపుల్ లో ఎప్పుడు చెప్పుకుంటాం ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అంతకు పూర్వం జన్మల్లో ఒక నిరంకుశమైనటువంటి ఒక నిరంకుశమైనటువంటి ఒక రాజుగా జీవించాడు ఎంతంటే ఒక కఠినాత్ముడు ఒక కఠినాత్ముడు అన్నమాట అంటారే కరుడు కట్టినటువంటి రాక్షసుడు అంటారు కదా అలాంటి రాక్షస స్వభావంతో జీవించాడు అయితే అతను గత జన్మలో గతంలో జరిగినటువంటి ఒక [సంగీతం] జన్మలో ఒక హంస కొంతమంది పక్షి అని ఉపకహరించారు ఒక హంస ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట ఒక హంస ఒక తన పిల్లల్ని కొన్నిటిని పొదిగి సిద్ధంగా ఉంది ఒక 100 పిల్లల్ని పొదిగి సిద్ధంగా ఉందన్నమాట అది తన పిల్లలతో తాను ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి తరుణం తన పిల్లలతో ఒక 100 ఒక హంస 100 పిల్లల్ని పెట్టుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి తరుణంలో వీడు అటుగా వెళ్ళాడు ఎవరు ధృతరాష్ట్రుడు అటుగా వెళుతూ ఉంటే అది కనపడింది అది కనపడింది ఎందుకంటే వీడికి జ్ఞానం లేదు కదా రాక్షసుడు కదా రాక్షస స్వభావం కలిగినటువంటి వాడుగా దాన్ని హింసించాలి అనుకున్నాడు వాడికి దయ కరుణ ఏముంటదమ్మా రాక్షసుడికి వెంటనే దాని కళ్ళు పొడిచాడట ఫస్ట్ ఆ హంసకి రెండు కళ్ళు పొడిచాడు అది ఆ పిల్లల్ని చూడలేక రెండు కళ్ళు పొలిస్తే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా చుట్టూ 100 పిల్లలు ఉన్నాయి ప్రొటెక్ట్ చేసుకోలేక ఎంత తపన పడిందో అనట పిల్లల కోసం ఎంతో అలా తపన పడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లల్ని కూడా చంపిండు పసి పిల్లలు ఇంకా కొన్ని గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని గుడ్లు పిల్లలై ఉన్నాయి ఆ పిల్లల్ని చూసుకోలేక పిల్లలు కనిపించక కళ్ళు కనపడక ఎంతో దీన అవస్థను అనుభవించింది మరి ఇప్పుడు ఆ జన్మ గడిచిపోయింది ఆ జన్మ గడిచిపోయింది నెక్స్ట్ తర్వాత తదనంతరం జన్మల్లో కళ్ళు లేకుండానే పుట్టాడు ఆ పుట్టిన వంద మంది వాళ్లే ఆ పక్షి పిల్లలే వీడికి సంతానంగా పుట్టారు వాళ్ళందరూ కూడా వినాశాన్ని పొందారు ఒక్కడు మిగిలాడా ఎవరు చేసిన పాపం అది ధృతరాష్ట్రుడు తను చేసినటువంటి పాపమే ఆ రోజు అహంకారం తోటి నవ్వుతూ అహంకారం తోటి ఒక వికృతమైనటువంటి ఒక వికారమైనటువంటి పరిస్థితిలో అలాంటి దుశ్చర్య చేశాడు దానికి ప్రతిఫలాన్ని అనుభవించడం అనేటువంటిది జరిగింది అంటే ఇలా చేయబడినటువంటి చెడు కర్మకు లేదా మంచి కర్మకు ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉండి తీరుతుంది చెడుకైనా ఉంటుంది మంచికైనా ఉంటుంది ఏదైనా అనుభవించవలసిందే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఉదాహరణకి ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దశరథుడు అయోధ్యను పరిపాలించినటువంటి రోజుల్లో అప్పుడప్పుడు ఋషులను రక్షించడం కోసం లేకపోతే లోకాన్ని వాళ్ళ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్రూర మృగాలను వేటాడేటువంటి వారు ఒకరోజు వేటాడటానికి వెళ్ళినప్పుడు ఒక పులికి బాణం వేస్తాడు అక్కడ పులి లేదు అక్కడ పులి లేదు అక్కడ మంచి నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళినటువంటి శ్రవణ కుమారుడు అనేటువంటి ఒక బాలుడికి బాణం గుచ్చుకుంది వెళ్లి చూసాడు పొరపాటు జరిగింది గుర్తించాడు అయ్యా నేను చూసుకోలేదు మరి చూసుకోలేకపోయినా తగిలింది కదా వాడు ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది కదా నన్ను క్షమించు దీనికి ఏమైనా నాకు శిక్ష విధించు దీనికి నాకు ఏదైనా శిక్ష విధించు నేను నీకు ఆ శిక్ష అనుభవిస్తా అంటాడు శిక్ష విధించే పరిస్థితిలో నేను లేను నీకు నేను శిక్ష విధించే పరిస్థితిలో నేను లేను నేను చివరి క్షణాల్లో ఉన్నాను నా ఆయువు చివరి క్షణంలో ఉంది మా తల్లిదండ్రులు వృద్ధులు మా తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళు కనపడవు మా తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళు కనపడవు వృద్ధులు వాళ్ళని నేను కాబిట్లో పెట్టుకొని ఊరూరు తిప్పుకుంటూ వాళ్ళని పోషించాలి అది నా పరిస్థితి ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ అనాధలు అయిపోయారు వాళ్ళిద్దరూ అనాధులు అయిపోయారు ఇప్పుడు ఎలా అని చెప్తే ఏదైనా ఉంటే మా తల్లిదండ్రులను అడుగు వాళ్ళు ఏమైనా క్షమించి నీకు ఏమైనా శిక్ష విధిస్తే నువ్వు ఏమైనా రిలీఫ్ పొందొచ్చు యువర్ ఛాయిస్ అని వెళ్లి మా తల్లిదండ్రులను అంటే వెళ్లి అడుగుతారు వెళ్లి వెళితే మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళను పోషించేటువంటి కొడుకును కోల్పోయారు కొడుకును కోల్పోయారు వాళ్ళు ఒక్కటే అంటారు అన్నమాట ఎందుకంటే ఒక పిల్లలు లేనప్పుడు ఒక తనకు ఉన్నటువంటి సంతానం దూరమైతే ఎంత బాధ అనుభవించాలో అంత బాధ నువ్వు కూడా అనుభవించి తీరుతావు అంత బాధ నువ్వు కూడా అనుభవించి తీరవలసిందే కచ్చితంగా ఇప్పుడు ఆ శ్రవణ కుమారుడు మరణించిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఒక 14 సంవత్సరాలు జీవించారు అనుకోండి 14 సంవత్సరాలు జీవించారు అంటే ఆ తల్లిదండ్రులు ఒక తన కుమారుడు లేకుండా 14 సంవత్సరాలు జీవించారు కాబట్టి అలాగే దశరథ మహారాజు కూడా తన కొడుకుకి దూరమై 14 సంవత్సరాలు జీవించాడు మరి దేవుడే జన్మించాడు దశరథ మహారాజుకి జన్మించింది ఎవరు దేవుడే జన్మించాడు మరి దేవుడు జన్మించిన కర్మ అనుభవించక తప్పలేదు కదా దేవుడే కొడుకుగా జన్మించిన గాని ఆ దేవుడే వెళ్ళవలసినటువంటి పరిస్థితి మరి ఆ దేవుడు ఏళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టాడు లోకంలో పుట్టడానికి ప్లేస్ లేదా లోకంలో అంటే ఒకదానికి ఒకటి ఇంటర్నల్ లింక్స్ కర్మ అనుబంధం కర్మ బంధం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది అర్థమైందా నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా చెప్తారన్నమాట మనం youtube మన ఫౌండేషన్ గ్రూప్ లోనే వచ్చింది మనం చదివినం చూసే ఉన్నాం ఇంకొకటి సరే శ్రీరాముడు అడవికి వెళ్ళాడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు మరి అరణ్యవాసం 14 సంవత్సరాలు చేయటానికి కారణం దశరథుడు మూలం దశరథుడు కారణం అన్నమాట ఆయన శ్రవణ కుమారుడిని బాధ పెడితే వాళ్ళ తల్లిదండ్రుల శాపం ద్వారా దశరథ కుమారుడు కొడుకు దూరమయ్యాడు ఇది బాగానే ఉంది కానీ దీనికి ఇంటర్నల్ లింక్ కైక ఆవిడ కూడా తన పాత్రని పోషించింది తన పాత్రను పోషించడం ద్వారా అంటే దశరథుడు డైరెక్ట్ వేరే వాళ్ళు చెప్తే వింటాడా వేరే వాళ్ళు చెప్తే వినే టైపు కాదన్నమాట దశరథ మహారాజు కూడా కాకపోతే కైకకి ఇంతకు ముందు వరం ఇచ్చాడు ఒక రాక్షసుడిని సంహరించినటువంటి సందర్భంలో కైకని అడుగుతాడు అన్నమాట నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు ఏమైనా గిఫ్ట్ కావాలంటే అడుగు ఇస్తా అంటాడు అవునా కాదా హెల్ప్ చేసినప్పుడు అంటారు కదా అమ్మ మనం ఏదైనా మన వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఏం కావాలంటే వడ్డాణం నెక్లెస్ అడిగితే వాళ్ళు ఇస్తారు కదా అట్లే దశరథ మహారాజును కూడా దశరథ మహారాజు కూడా భారాన్ అడిగితే నాకు ఇప్పుడేం అవసరం లేదు నాకు అన్ని ఉన్నాయి ఎప్పుడైనా అవసరం అయితే అడుగుతాను హోల్డ్ చేసుకుంది తను హోల్డ్ చేసుకుంది ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందన్నమాట మందర వచ్చి వేసింది అన్నమాట బాణం మందర బాణం వేసేసరికి ఆవిడకి మనసు వికలమైంది వెంటనే నా కుమారుడికి పట్టాభిషేకం కావాలా రాముడు అడవికి వెళ్ళాలి అలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా అడవికి పోవాలంటారు వేరే రాజ్యానికి పోవాలన్నా వేరు ఇప్పుడు సపోజ్ ఇద్దరు అన్నదమ్ములకు ఏమైనా క్రాష్ వచ్చిందనుకో ఒకళ్ళు హైదరాబాద్ లో ఉండండి ఒకళ్ళు బెంగళూరులో ఉండండి అని అంటామా అనమా కనీసం సిటీకి పొమ్మ అనగానే అడవికి పొమ్మనటం ఏంటి అమ్మ అడవికి పొమ్మ ఇలాంటి కోరిక కోరకూడదు కానీ కోరిక ఇంకో రాజ్యానికి పోయి ఉండయ్యా అని అంటే అది వేరు అడవికే పోవాలి ఇంటికి రాకూడదు సరే అడవికి పోవాలన్న దాని వెనుక ఎంతో కథనం ఉంది అంటే ఎంతో మందిని రాక్షసులను సంహరించాలా ఎంతో మంది ఉత్తముల్ని పోషించాలా వాళ్ళని అనుగ్రహించాలా అంటే దానికి చాలా హిస్టరీ ఉంది అంటే వారి అవతారం యొక్క కారణమే అది కాకపోతే నెపం ఇది ఉందన్నమాట నెపం ఇది ఉంది అర్థమైందా అమ్మా ఇది అయిపోయింది ముగింపు 14 సంవత్సరాలు అయిపోయింది మళ్ళా వచ్చాడు పట్టాభిషేకం జరిగింది మళ్ళా సీతాదేవి వెళ్ళటం మళ్ళా లవకుశలు రావడం ఒక హిస్టరీ మళ్ళా అయిపోయింది రామాయణం ముగింపు మళ్ళా దేవుడే మళ్ళా పుట్టిండు ద్వాపర యుగంలో దేవుడే ద్వాపర యుగంలో మళ్ళీ పుట్టిండు దేవుడు పుడితే తల్లిదండ్రులను జైల్లో పెడతారా అమ్మ సపోజ్ ఒక పిఎం ఒక సీఎం ఉంటే ఆ పిఎం సీఎం వాళ్ళ తల్లిదండ్రులను జైల్లో ఉంచుతారా అసలు ఇప్పటి రోజుల్లో అమ్మ ఇప్పటి రోజుల్లో మరి సుప్రీం పవర్ గా అమ్మ దేవాది దేవుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ కదా అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించక ముందు అంటే వేరు జన్మించక ముందు వేరు జన్మించిన తర్వాత కూడా పెద్దవాడు అయిన తర్వాత మరి చిన్నప్పుడే పూతన ఇట్లాంటి వాళ్ళందరిని ఎప్పుడో వేసేసాడు చిన్నప్పుడు ఏమన్నా శక్తి లేనటువంటి వాడు అవతార తత్వం గుర్తు లేనటువంటి వ్యక్తి కాదమ్మా అవతార తత్వం మీద పూర్తి అవగాహన ఉండి ఇది అవతారం అని తాను పరమాత్మ స్వరూపం అని పూర్తిగా తెలిసి ఉండే ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి అవతారం అది పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్తారు కదా అమ్మ శ్రీకృష్ణ పరమాత్మది అలాంటప్పుడు లాస్ట్ లో కంసున్ని చంపిన తర్వాత వెళ్తాడు అక్కడ జైలుకి వెళ్తాడు తల్లిదండ్రులను విడిపియడానికి అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుద్ది అన్నమాట దేవకీ దేవి ఏ నాయనా నువ్వు పుట్టాక కూడా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని విడిపించడానికి అని చెప్పి అడుగుతుంది కాదమ్మా గతంలో నువ్వు కైకగా ఉన్నప్పుడు రామాయణంలో త్రేతా యుగంలో నువ్వు కైకగా ఉన్నప్పుడు నన్ను 14 సంవత్సరాలు అడవికి పంపించావు కదా దానికి ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు 14 సంవత్సరాలు దేవకీగా పుట్టి అనుభవించావు వేరే ఏం లేదు నేనేం చేయలా నేను నువ్వు చేసినటువంటి కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించావు నువ్వు చేసిన కర్మ ఫలాన్నే నువ్వు అనుభవించావు ఇందులో నేను కూడా నిమిత్త మాత్రమే నేను కూడా అంటే అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు గాని శ్రీకృష్ణ పరమాత్మ గాని మేము కూడా నిమిత్త మాత్రులమే అని చెప్పారు మరి ఇప్పుడు దేవాది దేవుళ్ళు అయినటువంటి అవతార మూర్తులైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు దత్తాత్రేయుడు త్రిమూర్తులు వీళ్ళే వాళ్ళ యొక్క చట్టాన్ని వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క ప్రకృతి నియమాలను వాళ్ళు పాటిస్తూ ఉంటే మన జ్యోతిష్యులు మన డాక్టర్లు నేను రక్షిస్తా నేను రక్షిస్తాను అని అంటే ఎలా ఉంటది ఆయనకి ఏరా నాయనా నేనే మా అమ్మని నాన్నని జైల్లో పెట్టించా దేవత వసుదేవుని పెట్టించింది నేనే ఎందుకంటే రామాయణంలో నాకు ఇట్లా అడవులకు పంపించారు మళ్ళా వాళ్ళతో ఈ శిక్ష నేనే అనుభవించిన నాకు తల్లి అయినా ఒకటే తండ్రి అయినా ఒకటే ఎవరినైనా నేను శిక్ష అనుభవింప చేస్తా నా చట్టం అలా స్ట్రిక్ట్ గా ఉంటది ఇక్కడ ఇన్ఫ్లూయన్స్ పని చేయదు పొలిటికల్ పవర్ పని చేయదు మనీ పవర్ పని చేయదు అని చెప్పి పరమాత్మ చెప్తూ ఉంటే నేను రక్షించగలను అంటాం ఎంత హాస్యాస్పదంగా ఉంటది మనకి బురహాన్ గారు ఇంకో పాట రాస్తారు కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులు చెక్కుబడిరి కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులు చెక్కుబడిరి గర్వ గర్వపడకు దండివాడని గర్వమణచును యముడు నీకు గర్వపడకు దండివాడని గర్వమనచును యముడు నీకు మానసా నీ వినావే భూతముల చట్టమేమోగనావే ఏమని చెప్తున్నారు కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులే చిక్కుబడిరి అమ్మ బ్రహ్మ విష్ణు ఈశ్వరులే చిక్కుపడ్డారట ఏం తప్పక కర్మ తప్పక ఇక మన కర్మ ఆయన తగ్గిస్తాడు అని చెప్పి ఇప్పుడు ఆయనకు దండం మనం వాళ్లే కర్మను తప్పించుకోలేక వాళ్లే కర్మను అనుభవించడం కోసం చిక్కుబడితే ఈ కర్మ యొక్క వలయంలో ఈ ప్రకృతి యొక్క వలయంలో వాళ్లే చిక్కుబడితే మళ్ళా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారని తిరగడం ఎంతవరకు రైట్ ఏమి ఆలోచిస్తున్నాం అని చెప్పి మళ్ళా మనకి గుర్తు చేస్తున్నారు మన గురువుగారు అంటే [సంగీతం] అమ్మ దత్తాత్రేయుడిగా అవతరించినటువంటి సందర్భంలో దత్తాత్రేయుడుగా అవతరించినటువంటి సందర్భంలో త్రిమూర్తులను అనుసూయ దేవి చిన్న పిల్లలుగా చేసి ఉయ్యాల్లో పండుకొని పెట్టి ఊపింది అర్థమైందా అమ్మా చిక్కు ఎక్కడ చిక్కుబడ్డారు అంటే అనసూయ దేవి దగ్గర బాలలుగా చిక్కుబడ్డారు అప్పుడు మళ్ళా లక్ష్మీదేవి సరస్వతీ దేవి పార్వతీ దేవి వచ్చి అనసూయా దేవిని వేడుకొని అనసూయ దేవిని మెప్పించి మళ్ళా వాళ్ళను అవతార స్వరూపులుగా మార్చారు అనేటువంటిది మనకి కథనం చెప్తారు అంటే ఎందుకు అంటే ఎవరైనా గాని చేస్తే దాన్ని అనుభవించి తీరవలసిందే అనుభవించి తీరవలసిందే అంటే మనం ఈరోజు అనుభవించేటువంటి వాటికి ఖచ్చితంగా కారణం గతంలో చేయబడినటువంటిదే గతంలో చేయబడినటువంటిదే మనం ఈరోజు అనుభవిస్తున్నాము అయితే దీనికి పరిష్కారం లేదా అంటే మన గురువుగారు గాని వేదంలో గాని భగవద్గీతలో గాని ఉపనిషత్తుల్లో గాని మార్చుకునేటువంటి విధానాన్ని లేకపోతే దీన్ని అధిగమించేటువంటి విధానాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే సంచిత కర్మ నశిస్తుంది అని చెప్పారు కర్తృత్వ రహిత కర్మాచరణ చేయటం ద్వారా ఆగామి కర్మ రాదు అని చెప్పారు ప్రారబ్ధం భోగతేన ప్రారబ్ధాన్ని అనుభవించడం ద్వారా అది నశిస్తుంది అని చెప్పారు ప్రారబ్ధాన్ని పూర్తిగా నేను తీసివేస్తాను అని చెప్పినటువంటి గురువు లేడు ప్రారబ్ధాన్ని ఎవరైనా గాని అనుభవించవలసిందే అనుభవించవలసిందే కాకపోతే మనం సత్కర్మాచరణ చేయడం ద్వారా మనం పుణ్యఫలాన్ని పెంచుకోవడం చేత దాని యొక్క పర్సెంటేజ్ ని తగ్గించుకోవచ్చు దాన్ని అధిగమించడం అంటే కర్మ ఉంటుంది కర్మ ఫలం ఉంటుంది కానీ ఆ ప్రాబ్లం నుండి సర్వే అవ్వటానికి కొంత ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది ఉపశమనం అనేటువంటిది కర్మ ఎక్కువ చేశాడు అనుకో అమ్మ దుష్కర్మ ఎక్కువ చేశాడు అనుకో అమ్మ ఏసీ లేనటువంటి రూములో ఒక చిన్న రూములో ఎండలో పడుకోబెడతారు పేషెంట్ ని కాళ్ళు పని చేయటం లేదు చేతులు పని చేయటం లేదు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు రూమ్ లోనే ఉండాలి ఎండ వచ్చిన అక్కడే ఉండాలి వాన వచ్చిన అక్కడే ఉండాలా చలి వచ్చిన అక్కడే ఉండాలి హెల్త్ సపోర్ట్ చేయటం లేదు ఆయన చేసినటువంటి కర్మకు అక్కడ పడుకోబెట్టాలి అదే సత్కర్మ చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అమ్మ ఏసీ రూమ్లో పడుకోబెడతారు కర్మ అయితే అనుభవించాలి గాని ఇప్పుడు ఏసీ రూమ్లో పడుకుంటావా నాన్ ఏసీ రూమ్ లో పడుకుంటావా అర్థమైందా అమ్మ బెడ్ మీద పడుకుంటావా మన చెక్క బల్ల మీద పడుకుంటావా యువర్ ఛాయిస్ అంటే సత్కర్మ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే అనుభవించేటువంటి కర్మలో కొంత రాయితి నొప్పి అదే ఉంటది కాలుకి ఇంజూర్ కాలు ఇంజూర్ అయితే లెగ్ ఇంజూర్ ఇంజూర్ ఇంజూరే అదేమి తగ్గదు కాలు ఇరగడం ఇరగడమే కాకపోతే ఇరిగిన కాలు తోటి నువ్వు జనరల్ రూమ్ లో ఉంటావా హైఫై రూమ్ లో ఉంటావా యువర్ ఛాయిస్ యువర్ ఛాయిస్ నువ్వు చేసే సత్కర్మలు చేస్తే హైఫై రూమ్ లో అనుభవిస్తావ్ దుష్కర్మలు చేస్తే నార్మల్ రూమ్లో జనరల్ హాస్పిటల్ లో జనరల్ బెడ్ మీద పడుకోబెడతారు ఎవరు చూసే దిక్కు కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో జనరల్ బెడ్ మేము పడుకోబెడితే కొడుకు కూడా రావటంలే డాక్టర్ గారికి అప్పచెప్పండి అయ్యా అన్ని నువ్వే చూసుకో ఇంకా నాకు తీరక లేదు నాకు ఖాళీ లేదయ్యా మొత్తం నువ్వే చూసుకో ఏదైనా అయితే ఫోన్ చెయ్ నాకు ఏదైనా అయితే ఫోన్ చెయ్ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చెయ్ నేను ఇంటికాడ ఉంటనో ఉండనో నేను ఇంటికాడ ఉండనో ఉండనో మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చెయ్ అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ నెంబర్ ఇచ్చి పోతారు వాళ్ళ దగ్గర ఉండదని ఆయన అనుకుంటుండు వాళ్ళ దగ్గర అది కూడా ఉంది అంటే ఆదరణ లేదు కొడుకు ఆదరించట్లా కోడలు ఆదరించట్లా కూతురు ఆదరించట్లా అల్లుడు ఆదరించట్లా మనవడు మనవరాలు బంధువులు మిత్రులు ఎవరు సపోర్ట్ చేయట్లా ఎందుకు వాడు చేసినటువంటి కర్మ ఫలం అంత బలంగా ఉంది ఈ అంటే ఇవన్నీ ఎవరు విధిస్తారు అంటే మనం చేసినటువంటి కర్మలు కర్మలు అనుభవించాలంటే ఎవరు డిసైడ్ చేసేది మనకి గురువుగారు మనకి సాంఖ్యంలో చెప్పినప్పుడు ఏమని చెప్తారు అంటే ఈశ్వరుడు అన్నారు నాయన గారు ఏమని రాశారు ఈశ్వరుడు అన్నారు ఈశ్వరుడు ఏం చేస్తాడు ఈ ప్రపంచంలో ఎవరైతే ఏ కర్మ అనుభవించాలో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో కర్మ అనుభవింప చేస్తాడు మరి డైరెక్ట్ గా ఈశ్వరుడే వస్తాడా ఉదాహరణకు అమ్మ మనం ఏదైనా లోకంలో ఏదైనా తప్పు చేసాము అనుకో జడ్జి గారు శిక్ష విధించిండు జడ్జి గారు వచ్చి మనతోటి రోజు అక్కడ అనుభవింప చేస్తారా ఎవరు అనుభవిం చేస్తారు అనుభవింపజేసే సెక్షన్ ఒకటి ఉంది మనతో కర్మ అనుభవింప చేసేటువంటి సెక్షన్ ఒకటి ఉంది ఈ మరి మనం ఈ ప్రపంచంలో తప్పు చేస్తే మన కర్మ అనుభవింప చేసే సెక్షన్ ఈ ప్రపంచంలో ఉందా లేదా కచ్చితంగా ఉంది ఏమిటి ఆ సెక్షన్ అంటే పంచభూతాలే మనతో శిక్ష అనుభవింప చేసేది ఎవరు పంచభూతాలే పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రకృతి మనల్ని మనతో ఈ శిక్ష అనుభవింప చేస్తుంది అన్నమాట మనం అనుకున్నాం జైలు అంటే అది అనుకున్నాం ఈ ప్రపంచమే జైలు జైలు అంటే మళ్ళీ అది వేరే కాదు అమ్మ ఇది ఇది ప్రపంచమే జైలు ఇక్కడ ఎలాంటి ఇది ఎలాంటి జైలు పరమాత్మ ఇచ్చినటువంటి జైలు ఎలాంటిది అంటే ఇది పెద్ద జైలు అన్నమాట దాంట్లో ఒక సెల్ ఉంటది కదా ఒక సెల్ ఉంటది కదా ఆ సెల్లు ఈ శరీరం ఆ సెల్లు ఈ శరీరం అన్నమాట ఈ ప్రపంచం ఒక జైలు అనుకుంటే అందులో ఒక సెల్లు ఇదన్నమాట ఇది ఎలాంటి సెల్లు అంటే కదిలే సెల్లు మామూలు జైళ్లలో ఖైదు చేశారు అనుకో అమ్మా అందులో కదిలే పని లేదు అందులోనే ఉండాలి ఆయన అందులోనే ఉండాలి ఇది ఎట్లా అంటే ఇది కదిలేది ఇదొక ఫ్లెక్సిబిలిటీ పరమాత్మ సిస్టం పెద్దది కదా ఆయన ఏరియా పెద్దది కాబట్టి ఆయన ఎలా పెట్టిండు అంటే కొద్దిగా ముందుకు నడవచ్చు వెనక్కి నడవచ్చు ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లుగా కనిపించేటువంటి సెల్ ఇది ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లుగా కనిపించేటువంటి సెల్లు ఎంటర్టైన్మెంట్ కాదు ఏం కాదు అది దుఃఖంతో కూడి ఉన్నటువంటి సుఖం అది సుఖం కానే కాదు అనిపిస్తది అన్నమాట సుఖం అని అనిపిస్తది కానీ అది సుఖం కాదు కదా ఈ ప్రపంచమే జైలు అందులో ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి సెల్ లో మనం ఖైదు చేయబడి ఉన్నాం ఇక బయటికి రాలేం రాత్రే తెలుసుకున్నాం కదా మనం లోపల ఉన్నామని తెలుసుకున్నాం కదా ఇక బయటికి రారాదు ఒకసారి ఒకసారి బయటికి రారు అంటే మామూలుగా రాడంట స్వప్నంలో వెళ్తాడంట బయటికి మీరు వినే ఉంటారు స్వప్నంలో ఎక్కడికి వెళ్తారు కలలు కంటాడు స్వప్నంలో కలలు కంటాడు ఒక నిన్ననే ఈ మధ్యన నవీన్ ఒక ప్రశ్న అడిగిండు అన్నమాట గురువుగారు మన కలలో సూక్ష్మ శరీరం వెళ్ళిద్ది అంటారుగా సపోజ్ ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళింది అనుకోండి చాలా ఇప్పుడు అమెరికా వెళ్ళింది అనుకోండి ఇప్పుడు లేపితే మరి అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా రావాలిగా వెళ్ళినోడు లేపితే రావాలి కదా మరి ఎంత ఎమ్మటే ఎలా వస్తాడు అని అడిగిండు సూక్ష్మ శరీరం వెళ్తే లేపగానే అమెరికా నుంచి ఎక్కడ వచ్చి మళ్ళా ఎట్లా ఉంటాడు ఇందులో అని అడిగిండు మనకు వచ్చిందా అమ్మ ఇప్పుడు ఏం డౌట్ మరి అమెరికా వెళ్తే అమెరికా వెళ్ళినాడు రావాలంటే కనీసం రెండు మూడు గంటలు పట్టాలిగా కనీసం ఫాస్ట్ గా జర్నీ చేసినా గాని మరి అట్లా ఎట్లా వస్తారు గురువుగారు ఏమండీ అమెరికా నుంచి అని అడిగిండు ఇంకోటి ఏంటంటే అమ్మ మనకి సిల్వర్ కార్డు అని చెప్తారు సూక్ష్మ శరీరం అనేటువంటి దాన్ని సిల్వర్ కార్డు తో కట్టి ఉంటది సిల్వర్ కార్డు వెండి తీగ అని చెప్తారు యోగా పరిభాషలో అది బొడ్డు కాడి నుంచి కట్టి ఉంటది సూక్ష్మ శరీరాన్ని బొడ్డు నాభి కాడి నుంచి కడతారు అన్నమాట నాభి కాడి నుంచి సూక్ష్మ శరీరం బంధి అయి ఉంటుంది అన్నమాట అది ఎంత లెక్క వెళ్ళినా గాని ఇలా అనగానే వెంటనే వచ్చేస్తుంది అన్నమాట అది తెగదు అది తెగితే మళ్ళా రావు సిల్వర్ కార్డు అది తెగింది అనుకో వచ్చే పని కాదు అది వచ్చే పని కాదు ఇంతే సంగతులు ఇక మళ్ళా ఇంకో శరీరంలో అది నిద్ర లేవడమే తప్ప మళ్ళా ఈ శరీరంలో రాదన్నమాట అది అంతే మనం తెంచితే తెగేది కాదు మన వెపన్స్ పని చేయవు మనం మన వెపన్స్ కత్తులు ఇవి పని చేయవు అమ్మ అక్కడ మన వెపన్స్ ఏమి పని చేయవు అన్నమాట ఆయన తెంచాలి దాన్ని తీరవు నీవు అవి తెంచక తీరవు నీవు అవి తెంచక తెంచేవాడు తెంచితేనే అది తెగుద్దట తెంచేవాడు వేరే ఉండడు ఆ కట్లు తెంచేవాడు ఆ ముడి విప్పేవాడు ఒకాయన ఉన్నాడు అన్నమాట ఆ కట్టు తెంచేవాడు ఒకాయన ఉన్నాడు ఆయన మాత్రమే తెంచగలడు మరి ఆయన ఆయన ఎప్పుడు తెంచుతాడు అంటే ఆయనకు ఒక ఆర్డర్ ఉంటది ఆయనకు ఒక ఆర్డర్ ఉంటది ఆ ఆర్డర్ ప్రకారం ఓకే అమ్మ మన అందరితోటి ఆయన కర్మ అనుభవింప చేస్తాడు చేస్తూ ఉన్నాడు సత్కర్మ చేయటం ద్వారా ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది అర్థమైందా అమ్మా దుష్కర్మ చేస్తే దాని ప్రభావం గత జన్మలో చేసింది మనకు తెలియదమ్మా మనం గత జన్మలో ఏం చేసాము అనేటువంటిది మనకు తెలియదు కొన్ని ఈ జన్మలో చేసినవి ఉంటే కొన్ని గత జన్మకు సంబంధించినవి ఉంటాయి కానీ గత జన్మలోవి అనుభవిస్తూ ఈ జన్మలో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ జన్మలో నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా నేను అనుభవించేది గత జన్మలకు సంబంధించినటువంటి ఫలితమే అనేటువంటి భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జన్మలో మనం సత్కర్మానుష్టానాన్ని విడిచిపెట్టకుండా దైవాన్ని విడిచిపెట్టకుండా దైవ భావంతో లేకపోతే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చూపెట్టినటువంటి ధర్మబద్ధంగా జీవిస్తే దైవానుగ్రహం కలుగుతుంది చూడండమ్మ జనరల్ గా పాండవులు కౌరవులు రెండు మాటలు చెప్పి ముగింపు అమ్మ పాండవులు కౌరవులు కౌరవుల పక్కన ఎవరున్నారు అంటే భీష్ముడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు ద్రోణాచార్యుడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు వీళ్ళందరూ కౌరవుల పక్షంలో ఉన్నారు యోధాన యోధులు కర్ణుడిని సంహరించే వ్యక్తి పుట్టలా ఈ ప్రపంచంలో భీష్ముడిని సంహరించేటువంటి వ్యక్తి పుట్టలా అసలు ఇచ్చామరణం పొంది ఉన్నటువంటి భీష్ముడిని ఎవరు చంపగలరు ద్రోణాచార్యుడిని ఎవరు సంహరించగలరు వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ ఫుల్ ఎనర్జీ ఉన్నటువంటి మహాత్ములే కానీ వాళ్ళు ఎక్కడున్నారు కౌరవుల పక్కన ఉన్నారు ఆ తర్వాత మరి పాండవులకు వెళ్లి ఎవరున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి జనరల్ గా అయితే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సుఖపడాలి కదా దేవుడు ఉన్న కాడ సుఖం ఉండాలి కదా మరి పాండవులు ఎక్కడైనా సుఖపడినట్టు చరిత్రలో ఉందా పాండవులు ఎప్పుడైనా సుఖపడినట్టు చరిత్రలో మనకు తెలుస్తుందా సుఖపడినట్టు చరిత్రలో మనకైతే తెలియదు పోనీ ఇప్పుడు గనక లైవ్ లో పాండవులు ఉంటే మీరు కష్టపడ్డారా అని అడిగితే వాళ్ళు కొంచెం కూడా నేను కష్టపడ్డా అనరు వాళ్లకు జీవించే పరమాత్మ తోడుగా ఉండడం చేత వాళ్ళు అనుభవించేటువంటిది కష్టమని వాళ్ళకి అనిపియలేదట వాళ్లకు కష్టమని అనిపించలేదు చూసే మనకు అనిపిస్తుంది చూసే మనకి కష్టం అనిపిస్తది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి రమణ మహర్షికి సర్జరీ చేసేటప్పుడు అది సెడేషన్ ఇవ్వకుండా చేశారంట చూసే మనందరం ఏమనుకుంటాం వామ్మో ఎంత బాధపడుతున్నావ్ ఎంత బాధపడుతున్నాం కానీ రమణ మహర్షి నాకు బాధ ఉందని చెప్పారా అంటే మన దృక్కోణం వేరు వారి దృక్కోణం వేరు అర్థమైందా అమ్మా దేవుడు పక్కన ఉండటం చేత వాళ్లకి ఎన్ని కష్టాలు వచ్చినా గాని అవి కష్టంలా వాళ్ళకి అనిపించలా ఆనందంగా అనుభవించారు అర్థమైందా అమ్మా వీళ్ళకి మహాత్ములు ఉన్నారు వీళ్ళకి కూడా బలం ఎక్కువగానే ఉంది కానీ వీళ్ళు విలాసవంతమైనటువంటి రాజ్యంలో ఉన్నారు కానీ దుర్యోధనుడు ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపోలేదట వాళ్ళ అడవి హాయిగా నిద్రపోయారు పాండవులు అడవిలో ఉన్న హాయిగా నిద్రపోయారు దుర్యోధనుడు మంచి రాజ భవనంలో ఉన్నాడు సకల సుఖాల మధ్యలో ఉన్నాడు హంసతూలిక పాన్పుపై పవళించి ఉన్నాడు కానీ నిద్ర పట్టట్లా నిద్ర కోసం మత్తు పదార్థాలు తీసుకునేటువంటి దుస్థితిలో దుర్యోధనుడు ఉన్నాడు వాళ్ళు చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే అమ్మ మనకు ఈ చుట్టూ ఉన్నటువంటి ధనం మాత్రమే మనకు ఆనందాన్ని కలిగిస్తదని ప్రకృతిలో ఉన్నటువంటి మేడలు ఆనందాన్ని కలిగిస్తాయని కారులు ఆనందాన్ని కలిగిస్తాయి అని చెప్పి చాలా మంది ధనాన్ని చేరువ చేసుకోవడం కోసం ధనాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కేవలం సుఖానికి ధనం మాత్రమే ప్రామాణికం అని ధనం ఉంటే ఏదైనా గాని సాధించవచ్చు ఎంతటి సుఖమైనా అనుభవించవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఉంటే సుఖం వస్తది అనుకోవడం కరెక్ట్ కాదు అంటే సుఖానికి ప్రామాణికం ఆనందానికి ప్రామాణికం ధనం కాదు ఆనందానికి ప్రామాణికం ధనం కాదు భౌతికమైనటువంటి పదార్థాలతో ఆనందం వస్తది అని అనుకోవడమే కరెక్ట్ కాదు ఎందుకంటే నిత్యమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటిది భగవంతుని యొక్క సన్నిధి మాత్రమే ఎవరైతే భగవంతుని యొక్క సన్నిధికి చేరుకుంటారో పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు అట్టి తత్వాన్ని తనలోనే దర్శించి ఇప్పుడు దైవానుగ్రహం కలగాలి దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉంటాడు అన్నారు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడు మరి ఇప్పుడు దైవ సన్నిధిలో ఉండాలంటే ఇప్పుడు మనం ఏ ఊరు పోదాం ఆనందంగా ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక ఊరు పోవాలి కదా దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ పోవాలి దేవుడు ఇక్కడే ఉన్నాడు మనం చేసేటప్పుడు చదువుతాం ధ్యానము గావించెద మంగరు పాద నిరాజములో వేడెద సాన్నిధ్య మాత్రన సకల వేదన బాపు సమర్ధ్య యుక్తము సద్గురు రూపము ధ్యానము గావించెద మా గురుపాద నిరాజములో వేడెద సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాబు ఎంత అద్భుతంగా రాశారు నాయన గారు సాన్నిధ్య మాత్రాన సకల వేదనలు దూరమైతాయి ఎవరి సాన్నిధ్యంలో పరమాత్మ యొక్క భగవంతుని యొక్క సాన్నిధ్యంలో భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు చేరుకుంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం చేరి ఆ భగవంతుని నువ్వు ధ్యానం చేస్తే నీకు ఉన్నటువంటి సకల వేదనలు సకల దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్పారు రోజు చదువుకుంటున్నాం కదా అమ్మా చదువుకుంటున్నామా లేదా చదువుకుంటున్నాం కదా అందుకే సాన్నిధ్యంలో ఉండమని చెప్పారు కాబట్టే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినం గురు సాన్నిధ్యంలో ఉండటం కోసం అంతేనా అమ్మ అంతేనా మరి వైజాగ్ లో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎట్లా ఇప్పుడు ఇక్కడ వారం ఇక్కడ నాలుగు రోజులు ఉన్నాం ఇక్కడ అయిపోయింది మళ్ళా వైజాగ్ వెళ్తే మళ్ళా ఎట్లా మళ్ళీ ఎప్పుడైనా దుఃఖం వస్తే ఎక్కడికి రావాలిగా ఆడేది కదా అది అంటే సాన్నిధ్య మాత్రం అంటే వారు సన్నిధి ఏది అంటే వ్యవహారికంగా ఒక సెంటర్ ఏర్పాటు చేశారు ఒక కేంద్రాన్ని ఒక స్థానాన్ని మాకు వ్యవహారికంగా మనకి ఏర్పాటు చేశారు అన్నమాట ఇది భౌతికంగా కానీ మనకు గురువుగారు ఏమని చెప్పారు గురు సన్నిధి ఏది అంటే సహస్రారమే గురు సన్నిధి ఏది గురు సన్నిధి ఏది సహస్రారమే గురు సన్నిధి నువ్వు సహస్రార చక్రానికి వెళ్తే చాలు ఇంట్లో ఉండొచ్చు ఇప్పుడు సహస్రార చక్రానికి వెళ్ళటానికి వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలా అవసరం లేదు కదా ఇప్పుడు మీరు మహా ఉంటే కూర్చుంటే ఎన్ని ఉంటామో మూడు అడుగులు ఉంటాం మహా అంటే పెద్దోళ్ళు అంటే నాలుగు అడుగులు ఉంటారు ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు ప్రాణము నందు ఉన్నాడు జీవుడు ప్రాణమునందు ఉన్నాడు ఇప్పుడు ప్రాణము నందు ఉన్నటువంటి జీవుడిని ఎక్కడికి తీసుకెళ్లాల సహస్రాన్ని సహస్రారం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది సహస్రారం ఏమైనా కిలోమీటర్లు దూరం ఉందా లేదు కదా ఇక్కడి నుంచి ఇక్కడికేనా ఇక్కడి నుంచి ఇక్కడ మరి ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం ఏంటి అంటే దుఃఖం పోవాలంటే గురు సన్నిధికి పోవాలి గురువుగారు ఎక్కడున్నారు ఇప్పుడు సహస్రారంలో ఉన్నాడు సంవత్సరానికి పోరాదు ఎవరు వద్దు అన్నారు సహస్రానికి పోవచ్చుగా అంటే ఎవరైతే ప్రయత్నం చేసి సహస్రారానికి చేరుకుంటారో గురు సన్నిధికి చేరుకుంటారో వాళ్లకు ఉన్నటువంటి సకల దుఃఖాలు సకల వేదనలు నశిస్తాయి రమణ మహర్షి ఆ గురు సన్నిధిని చేరుకున్నాడు రామకృష్ణ పరమహంస ఆ గురు సన్నిధిని చేరుకున్నాడు స్వామి వివేకానంద ఆ గురు సన్నిధికి చేరుకున్నాడు ఎవరు మన నాయన గారు ఆ గురు సన్నిధికే చేరుకున్నారు సీతమ్మ గారు ఆ గురు సన్నిధికే ఏ గురు సన్నిధికి సహస్రారంలో ఉన్నటువంటి గుణ రూపములు లేనటువంటి ఆ సన్నిధికి చేరుకున్నారు ఇప్పుడు మరి మన గురువుగారు అందరూ అక్కడికి చేరుకుంటే మన మనం ఎక్కడికి చేరుకోవాలా మనం ఆ బాటలోనే నడవాలి కదా మరి గురువుగారు ఒక బాటలో మనం ఒక బాటలో నడిస్తే బాగుంటదా మరి దరి చేరుతామా గురువుగారు నడిచిన బాటలో మనం వేరే సెపరేట్ బాట వేసుకున్నాం అనుకో అమ్మ ఏ నేను ఇటు కాదు ఇటు పోతా అని వేరే వేసుకున్నాం అనుకో కుదురుద్దా మనకి సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సామర్థ్య యుక్తమవు సద్గురు రూపం అది సమర్ధ యుక్తమైనటువంటి గురు రూపం అది సాన్నిధ్య మాత్రాన సామర్థ్య యుక్తాము సద్గురు రూపము ధ్యానము గావించెద అర్థమైందా అమ్మా సమర్ధవంతమైనది అని చెప్తున్నారు ఆ శక్తి ఎలాంటిది అంటే అది సామాన్యమైనటువంటి శక్తి కాదు అది చాలా సామర్థ్యము కలిగి ఉన్నటువంటిది ఎంత సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది ఆ శక్తి అమ్మ ఆ శక్తికి ఎంత సామర్థ్యం ఉంటది అంటే ఏం చెప్తాం ఇంత సామర్థ్యం అని చెప్పగలమా ఇంత అని చెప్తామా ఇంత అని చెప్పలేం ఇంత అని చెప్పలేం ఎవరికి ఎంత గ్రహించగలరు ఎంత రిసీవ్ చేసుకోగలరు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి ఆ యొక్క శక్తిని వాళ్ళు అనుభూతి చెందగలుగుతారు ఎంత ప్రయత్నం చేస్తే అంత ఎగ్జాంపుల్ చెప్తారుగా అమ్మ ఒకచోట అమృతం ఉందని చెప్పారంట అమృతం ఉంది తీసుకెళ్ళండి అని చెప్పారు అమృతం ఉంది తీసుకెళ్ళండి అని చెప్పారు ఇప్పుడు ఎంత తెచ్చుకోగలరు మీరు నీవు ఎంత తెచ్చుకోవాలి నువ్వు మీరు ఎంత కావాలనుకుంటారో అంత పాత్ర తీసుకెళ్తారు ఇప్పుడు కాశీ వెళ్లారు అనుకో అమ్మా గంగాజలం ఇంటికి తీసుకెళ్లాలి అన్నారు ఇప్పుడు ఎవరెంత తీసుకొస్తారు అంటే ఏం చెబుతాం ఒకాయన చిన్న 50 ml తెచ్చిండు ఒకాయన 100 ml తెచ్చిండు ఒకాయన 250 ml ఒకాయన 500 ml ఒకాయన లీటర్ 1000 ml తెచ్చుకొని ఒకాయన 2 l ఓ 5 l స్కాన్ వేసుకొని వచ్చిండు ఆయన ఇష్టం అంటే వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పాత్రను బట్టి ఆ గంగా వాటర్ అనేటువంటిది తెచ్చుకుంటారు అట్లే ఈ యొక్క శక్తిని కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి వాళ్ళ యొక్క సాధనను బట్టి ఆ అనుభూతి చెందటం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఆ గురు పాద పద్మాలను ఆశ్రయించి పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ స్వరూపమే సర్వత్ర వ్యాపించి ఉన్నది అని తెలుసుకొని ఆసక్తే ఇక్కడ కూడా ఉన్నది అని తెలుసుకొని మనం ఆ నమ్మకంతో జీవించి వారిని వేడుకుంటే కచ్చితంగా ఆ అనుగ్రహం మనకు కలిగి కచ్చితంగా దుఃఖాన్ని అధిగమించేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఎందుకు ఇక్కడికే ఎందుకు రావాలి అని చెప్తే ఇక్కడికే ఎందుకు రావాలి అని చెప్తే మనకు ఎప్పుడూ ప్రశ్న వేస్తారమ్మ చాలా మంది అంటారు అంతటా దైవం ఉంటే అంతటా దేవుడు ఉంటే మరి ఆ గోడకాడ దండం పెట్టొచ్చుగా గురువుగారు ఇక్కడికి వచ్చి గురువుగారు పాదాలను ఇక్కడ దండం పెట్టమంటున్నారు ఏంటి అని ఒకాయన అడిగారు ఇప్పుడు ఆ గేటు కాడ దేవుడు ఉండడా ఉన్నాడండి బయట గోడకాడ దేవుడు ఆమె ఉన్నాడండి బయట గేటు కాడ కూడా దేవుడు ఉన్నాడండి మరి ఆ చెట్టు కాడ దేవుడు అక్కడ కూడా దేవుడు ఉన్నాడండి ఆ జెండా కర్ర పెట్టారు జెండా కర్ర జెండా కర్ర కూడా దేవుడు ఉన్నాడండి మరి ఆ కుర్చీ ఆ కుర్చీలో కూడా దేవుడు ఉండండి వంట చేస్తున్నారా గంటకాడ దేవుడు ఆ గంటలో కూడా దేవుడు ఉన్నాడు మరి ఇప్పుడు గంటకు దండం పెట్టొచ్చుగా వారు వంట చేస్తున్నారా గంటకి దండం పెట్టి రావచ్చుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ఎందుకు దండం పెట్టాలి దేవుడు అక్కడ లేడా అంతటా దైవం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళా ఇంకో చోటికి వెళ్లి అక్కడ లేదా ఎందుకు ఆశ్రమం కాడికి లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రానికి ఇంకో పుణ్యక్షేత్రానికి ఎందుకు అని ప్రశ్న వేస్తే మన గురువు గారు ఏమని చెప్పారంటే నాయనా అందడా ఉన్నారు సపోజ్ ఉదాహరణకి అంతటా బయటికి పోతే గాలి ఉంటదా ఉండదా ఉంటది మరి బయట ఉన్నప్పుడు ఒక విధంగా ఇక్కడ రాంగ్ లోనే ఫ్యాన్ పెట్టు ఐదు మీద పెట్టు ఐదు మీద పెట్టు అంటావ్ ఎందుకు బయట ఉన్నదానికి ఇక్కడ డిఫరెన్స్ ఉందా లేదా బయట గాలి లేదా మరి ఇక్కడ ఎక్స్ట్రా గాలి ఉంది ఉందా ఉందా లేదా ఇక్కడ అదే గాలి అక్కడ అదే గాలి ఉంటే అక్కడే ఉండేవాళ్ళం ఇక్కడిదాకా ఫ్యాన్ కింద ఎందుకు కూర్చుంటాం అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తెలుస్తుంది అంతట బయట కూడా గాలి ఉంది కానీ బయట ఉన్నది ఎక్కువ తెలియట్లేదు ఫ్యాన్ కిందకి వచ్చినప్పుడు ఫ్యాన్ కింద ఆ గాలి మనకు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడికి ఈ ఫ్యాన్ కిందకి రావటం మనం అలవాటు చేసుకున్నాం అలాగే అంతటా ఉన్నాడు కానీ కానీ అంతటా ఉన్న దానికంటే ఇక్కడ ఆ గురు పాదాల దగ్గర ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్యాన్ కింద ఎక్కువ స్పర్శ ఎలా తెలుస్తుందో పాదాల దగ్గర లేకపోతే ఈ క్షేత్రంలో లేకపోతే ఇంకో క్షేత్రంలో ఆ శక్తి ఎక్కువగా ప్రకటితం అవుతుంది అంతటా ఉన్నదాన్ని ఉన్నదే గాని ఇక్కడ ఫ్యాన్ ఉండటం చేత దాన్ని కంప్రెస్ చేసి మనకు ఎక్కువగా అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రావాల్సి మనం వచ్చింది ఇక్కడికి ఎందుకు లేవాలి అంటే మనకి ఏవైనా మిస్టేక్స్ జరిగినప్పుడు గాని దాన్ని సవరించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటది అన్నమాట ఇక్కడ ఖచ్చితంగా ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి కలుగుతుంది కాబట్టి మనం మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా ధర్మ మార్గంలో జీవించుదాం గురువు చెప్పినటువంటి ఆ మార్గాన్ని నమ్మకంతో మనం పూర్తి విశ్వాసంతో నమ్మి అడుగులు వేసినట్లయితే వారి యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది కర్మ వచ్చినా గాని మనం ధర్మ మార్గంలో జీవించినటువంటి కారణంగా జీవిస్తూ ఉన్నటువంటి కారణంగా ఏదో ఒక విధంగా అది వైదొలిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్లే ఉపద్రవాన్ని తొలగిస్తారు ఉపద్రవాన్ని తొలగిస్తారు దానికి ఏంటంటే శరణాగతి ఉండాలి మళ్ళా మనకి గురువు దగ్గర శరణాగతి ఉండాలి అహంకారం కొంచెం కూడా మనలో ఉండకూడదు సంపూర్ణ శరణాగతి చెందాలి మనకు ఎగ్జాంపుల్ చెప్తారుగా అమ్మ ఒక నది తీవ్రంగా ప్రవహిస్తుంది తీవ్రంగా ప్రవహించేటువంటి సందర్భంలో ఒక చెట్టు అడ్డం వచ్చింది అనుకో అమ్మ ఏం చేస్తది ఆ ప్రవాహం చెట్టుని కూడా తీసేసుకొని పోయిద్ది చెట్టును కూడా అలా తీసేసుకొని ఆ ప్రవాహం పోద్ది మనం తుఫాన్లు వచ్చినప్పుడు చూస్తే చెట్లు కార్లు అన్ని కొట్టుకొని వస్తాయి అన్నమాట కానీ ఆ ఏటి ఒడ్డునే లేకపోతే ఆ నది ఒడ్డునే చిన్న చిన్న తుంగ మొక్కలు ఉంటాయి అన్నమాట అవి కొట్టుకొని పోవు అవి అక్కడే ఉంటాయి పెద్ద పెద్ద చెట్లన్నీ పోయినా గాని ఆ చిన్న చిన్న మొక్కలన్నీ కొట్టుకో అవి అక్కడే ఉంటాయి ఎందుకు అవి అక్కడే ఉంటాయి అంటే ఎంత పెన్ను ప్రమాదం వచ్చినా ఎంత ఉపద్రవం వచ్చినా కానీ అవి అవి రాగానే వెంటనే వంగిపోతాయి అవి వంగిపోతాయి అవి వంగిపోయినటువంటి కారణం చేత ఉపద్రవాన్ని అధిగమించేటువంటి శక్తిని పొందినవి ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ వంగకుండా నిటారుగా నిల్చున్నాయి ఆ వంగకుండా నిటారుగా నిల్చున్నటువంటి కారణం చేత అవి కొట్టుకోమని మనం కూడా దైవ సన్నిధిలో గురు సన్నిధిలో మనం అహంకారాన్ని విడిచిపెట్టి శిరస్సు వంచి వారికి శరణాగతి చెందాలి మళ్ళా శిరస్సు వంచి అంటే గురువుగారు వచ్చినప్పుడల్లా నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా పంచాంగ నమస్కారం చేస్తున్నా మొత్తం వంచే నమస్కారం చేస్తున్నా గురువుగారు అని అంటాడు ఆయన అంటే నాయనా వంచాల్సింది శరీరం కాదు నాయనా వంచాల్సింది ఏంటి అహంకారాన్ని మనసును వంచాల దేన్ని వంచాల మనసును శరీరాన్ని వంచితే ఏం ఉపయోగం ఎవరైనా ఉంచుతారు శరీరాన్ని కాదు వంచాల్సింది మనసును వంచాలి మనసును అర్పించాలి అర్పించాల్సింది దేన్ని మనసుని అర్పించాలి పవిత్రంగా ఉండాల్సింది శరీరమే కాదు మనస్సు కూడా ఎవరైతే మనసును పవిత్రం చేసుకొని శరీరాన్ని మనసును ఇంద్రియాలను పవిత్రం చేసుకొని పవిత్రమైన వాటిని వారికి అర్పించినప్పుడు వారి యొక్క అనుగ్రహం పూర్తిగా మన మీద ప్రసిరితమై మనం ఏ లక్ష్యాన్ని చేరాలో ఆ లక్ష్యాన్ని చేరటానికి వారి శక్తి మనకి సహకరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మనం వారి యొక్క శక్తిని పొందుతూ ఈ యొక్క లోకంలో మన యొక్క లక్ష్యాన్ని చేరేటువంటి ప్రయత్నం చేద్దాం దానికి వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి శతకోటి నమస్కారాలు చేస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తూ సెలవు జై అతల సద్గురు ప్రభువు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మ బోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థం అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు 
 *రోమన్ ఐదవ చక్రవర్తి నీరో.. రోమ్ నగరం తగలబడి పోతుంటే మరోపక్క ఫిడేల్ వాయిస్తూ సంగీతాన్ని ఆస్వాదించాడు అని ఒక నానుడి.*

*ప్రస్తుతం భారతీయ కొందరు ప్రజలు కూడా నీరో చక్రవర్తిలాగా తమ లోకంలో తాము విహరిస్తూ ఒకపక్క దేశం తగలబడుతూ ఉంటే.. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి బాసటగా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే. భారతదేశంలోని అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ ఒకపక్క గగ్గోలు పెడుతూ ఉంటే. మరోపక్క భారతదేశంలోని అన్ని న్యూస్ పత్రికలలో మెయిన్ హెడ్ లైన్స్ లో వార్త ప్రచురితం అయితే. దీని గురించి మనము పట్టించుకోము.*

*తెల్లారిందా? తిన్నామా? సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ చెప్పామా? మన ఫోటోలను పెట్టామా?*

*లేదా మన గొర్రె ఆలోచనలను మన గొర్రె సిద్ధాంతాలను*
*మన గొర్రె --------------లను పోస్ట్ చేసామా.. ఇక చాలు తిన్నామా పడుకున్నామా !*

*ఈ దేశం ఎక్కడ పోతే మాకేంటి ?*

*పోండిరా సోది నాయాల్లారా.. మీకు ఏమీ పని లేదు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో కాల్పులు జరిగితే మాకేంటి సంబంధం ? ఎక్కడో పశ్చిమబెంగాల్లో హిందువులపైన దాడులు జరిగితే మాకేంటి సంబంధం ?* 

*అలాంటి పనికిమాలిన విషయాలు మాకు అవసరమా ?*

*అనవసరంగా మా మెదడు తింటారు సోషల్ మీడియాలో పొద్దున లేస్తే.* 

*మీ సావు మీరు చావండి. మా గొర్రె ఆలోచనలను మేము నీరో చక్రవర్తిలాగా ఫిడెల్ వాయిస్తూ ఉంటాము సోషల్ మీడియాలో.*
 *దుఃఖము...!*

*'జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం'...!*

మానవ జీవితం అంతా దోష భూయిష్టం, దుఃఖ భూయిష్టం, అప్పుడప్పుడు కొన్ని సుఖాలున్నా దుఃఖాలు మాత్రం తప్పవు. 
ఇలా దుఃఖాలతో కూడినదే ఈ మానవ జన్మ అని తెలిస్తే దీనిపై వైరాగ్యం కలుగుతుంది,  ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది...
జన్మ రాహిత్యానికి ప్రయత్నించాలి అనిపిస్తుంది , కనుక ఈ జన్మలోని దుఃఖ దోషాలను నిశితంగా పరిశీలించాలి...
          
‘ప్రపంచం దుఃఖమయం, దేహం రోగమయం’ అని పెద్దలు చెబుతారు.
 ‘అనిత్యమసుఖం లోకం’ అని గీతాచార్యుడే అన్నాడు. 
‘విద్ధి వ్యాద్యభి మానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం’ అని భజగోవిందంలో శంకరాచార్యులు వారన్నారు.
 వ్యాధులతోను, అభిమానంతోను కూడి దుఃఖాల చేత సత మతమైపోతున్నది ఈ జన్మ అని. 
పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడూ ఏడుస్తాడు, మధ్యలో రోగాలొస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు. 
ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం...

*1) జన్మదుఃఖం...!!*

ఇది ఎలాంటిదో గర్భోపనిషత్ చెబుతున్నది. 
తలచుకొంటే సిగ్గుతో చచ్చిపోవాలి. 
సిగ్గో యెగ్గో అది బహిరంగ రహస్యం, కోడి గ్రుడ్డు అంత గర్భకోశంలో 9 నెలల నివాసం.

అక్కడి క్రిముల చేత పీడించబడటం, జఠరాగ్ని చేత తపించి పోవటం, తల్లి ఆహార విహారాల వల్ల అలమటించి పోవటం, మావి చేత బిగించబడి తలక్రిందులుగా ఉండటం, పూర్వ జన్మల స్మృతితో విపరీతంగా దుఃఖించటం, ప్రసూతి వాయువుల చేత త్రోయబడటం, బయట బడి మల మూత్రాలలో పెద్ద పురుగులాగా పొర్లాడటం.. ఇవన్నీ జన్మదుఃఖాలే. 

*2) మృత్యుదుఃఖం...*

పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యుదుఃఖం. 
ఈ దేహం మృత్యు దేవత సొత్తు. 
పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు, హాటులతో చక్కగా పెంచి, ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్ తో పోషించిన ఈ బంగారం లాంటి శరీరానికి చివరి దశ ఏమిటో కళ్ళు మూసుకొని ఒక్కసారి భావనకు తెచ్చుకోండి. 
మర్మస్థానాలు భేదించబడటం, అంగ సంధులు వికలమైపోవటం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకు రావటం, ప్రాణోత్ర్కమణ జరిగేటప్పుడు లక్ష తేళ్ళు ఒక్కసారిగా కుడితే కలిగేంత బాధ, వశం దప్పి మల మూత్రాలు విడిచి పెట్టటం, భరించ లేని యాతన. ఇవి.. మృత్యురోగాలు. 

ఇంతేనా... !!!
ఇక మరణించ బోతున్నాను అని తెలియగానే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలు, భార్యాబిడ్డలు అంతా గుర్తుకు వస్తారు. 
ఇంత సంపాదించి అన్నీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ, ఇదంతా మృత్యు బాధ...ఆర్.కే.భట్!

 *సర్వేజనా సుఖినోభవంతు!*
 సుప్రీంకోర్టుతో అమీతుమీ తేల్చుకుంటాం. అడ్వోకేట్ విష్ణు శంకర్ జైన్.

కాంగ్రెస్ 1954, 1995 & 2013 సంవత్సరాల్లో తెచ్చిన వక్ఫ్ చట్టంలోని.. "వక్ఫ్ బై యూజర్" అనే క్లాజ్ కిరాతకమైనదే కాదు అమానుషమైనది కూడా. ఈ క్లాజ్ రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ "14, 21, 25 & 300 ఏ" లను ఉల్లంఘిస్తుంది.

వక్ఫ్ బై యూజర్ అనే క్లాజుకున్నట్లు.. చట్టబద్దమైన రక్షణ/హామీ.. దేశంలోని ఇతర వర్గాలకు "టెంపుల్ బై యూజర్, గురుద్వార బై యూజర్ & చర్చ్ బై యూజర్.." పేరిట లేదు.

అందుకే వక్ఫ్ బై యూజర్ అనేదొక తప్పుడు క్లాజ్.

ఇప్పుడసలు విషయానికొస్తా..

ఢిల్లీలోని యమునా నది ఒడ్డున మహదేవ్ శివుని మందిరం కూల్చివేస్తే.. ఆ చర్యపై హైకోర్టుకెళితే.. శివునికి ఎవరి రక్షణా అక్కర్లేదని.. తలబిరుసు సమాధానం చెప్పింది. తరువాత సుప్రీంకోర్టుకెళితే, అక్కడ శివుని మందిరం ప్రాచీనమైందనడానికి ఋజువు ఏది అని అడిగింది. అలాగే రామజన్మభూమి వ్యవహారంపై.. సుప్రీంకోర్ట్ లెక్కలేనన్ని అనుమానాలు లేవనెత్తి శ్రీరాముడు అక్కడే జన్మించాడనడానికి ఋజువులు అడిగింది. ఇదే కోర్టులో శ్రీరాముని ఉనికిపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఆశ్చర్యంగా.. అదే సుప్రీంకోర్ట్.. నేడు.. 200-300 ఏళ్ళ వక్ఫ్ ఆస్తులకు ఋజువులు, పత్రాలు ఎక్కణ్ణుంచి తేగలరు.. అని.. గ్రవాద సముదాయాన్ని వెనకేసుకొస్తోంది. ఎందుకీ ద్వంద ప్రమాణాలు..? దీనిపై మేం సుప్రీంకోర్టును నిలదీయాలనుకుంటున్నాం.

ఇంకొక విషయం..

1995 & 2013 వక్ఫ్ చట్టాలకు వ్యతిరేకంగా 2017/2018 లో మేం సుప్రీంకోర్టు మెట్లెక్కితే.. ఇక్కడికెందుకొచ్చారు.. హైకోర్టుకెళ్ళండని.. మా మీద మొట్టికాయ్ వేసింది. సరేనని మేం హైకోర్టుకెళ్ళాం. కానీ ఏడేళ్ళైనా ఇంతవరకు.. ఆ పిటిషన్లపై విచారణ ఆరంభం కూడా కాలేదు.

కానీ.. ప్రస్తుతం.. ఆ వక్ఫ్ చట్టాల్లోని.. కిరాతకమైన & అమానుషమైన క్లాజులను కొట్టేసిన చట్టంపై వేసిన పిటిషన్లను.. సుప్రీంకోర్ట్ వారంలోపే విచారణకు తీసుకోవడమే గాక.. ఆఘమేఘాల మీద విచారణ మొదలెట్టి.. క్షణాల్లో దాని అభిప్రాయాలను వెల్లడిస్తోంది.

మేం ముందు.. అసలీ పిటిషన్లను ఎందుకు అంగీకరించారు..? మమ్మల్ని ఆదేశించినట్లే.. హైకోర్టుకెళ్ళమని.. పిటిషన్ దారులను ఎందుకు అడగలేదు.. అనేది సుప్రీంకోర్టులో తేల్చుకోవాలనుకుంటున్నాం.

అంటూ సుప్రీంకి ముందస్తు హెచ్చరిక చేసిన..

మొఘలోన్మాదులు పైశాచికంగా "ధ్వంసం చేసి & ఆక్రమించిన" దేశంలోని 40 వేల హిందూ ఆలయాలను.. తిరిగి స్వాధీనం చేసుకోవడానికి.. తన తండ్రి హరిశంకర్ జైన్ గారి.. మార్గదర్శకత్వంలో.. అలుపెరగని పోరు సలుపుతున్న.. అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్.. 
WHAT A ARGUMENT 
వందనం వీరుడా.. పాదాభివందనం..

🙏🙏🙏🙏🙏

వక్ఫ్ బై యూజర్ = ఇస్లామిక్ ఆచారాల కోసం దీర్ఘకాలంపాటు ఉపయోగించబడడం ద్వారా వక్ఫ్‌గా గుర్తించబడిన స్థలాలు, ఆస్తులు
🙏🙏🙏🙏🙏
 *ఇది రచయిత షఫాలి వైద్యా రాసిన భావోద్వేగమైన కవితా ప్రకటన. దీని తెలుగు అనువాదం:* 

ఎప్పుడైనా మాంసం దుకాణం చూసారా?  
కొన్ని మేకలు పశువుల మేత మరిగిస్తూ ఉంటాయి.  
ఒకదాన్ని బయటకి లాగుతారు. అది అరుస్తుంది.  
చంపుతారు. తోలును తీసేస్తారు.  
ఇతర మేకలు భయంతో మేకెలు మేకెలుగా అరుస్తాయి.  
ఒక నిమిషం పాటు మాత్రమే.  
ఆ తర్వాత... అవి మళ్లీ మేత మరిగించడం మొదలు పెడతాయి.  
మనమూ అంతే.  

ఒక హిందువు పహల్గామ్‌లో గుళ్ళిపోతాడు.  
మనమూ అరుస్తాం. పోస్టులు పెడతాం.  
హ్యాష్‌ట్యాగ్లు ట్రెండ్ అవుతాయి.  
తర్వాత... మర్చిపోతాం.  
ఆ మేకలాగే.  

అంకిత్‌ను మర్చిపోయాం.  
కన్హయ్యాను మర్చిపోయాం.  
పండితులను, పాల్ఘర్‌ను, గోద్రాను మర్చిపోయాం.  
కసాయి కూడా అదే ఆశిస్తాడు.  
మనము అరుస్తామని, గర్జించమని.  
అతను కత్తిని పదుకొడుతున్నప్పుడు,  
మనము సౌకర్యపు మేత మరిగిస్తామని.  

ఎన్ని మరణాలు మనల్ని మేలుకొల్పాలి?  
ఎంతవరకూ మర్చిపోతూ ఉంటాం?  
ఎప్పటికి మనము గర్జించాలి?  

#మర్చిపోవద్దు  
#పహల్గామ్  
#హిందూవిరోధాన్నిఆపండి

 *ఇది హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో విప్లవాత్మక చైతన్యం కలిగించేందుకు రాసిన ప్రకటనగా చెప్పొచ్చు.*
*